Heavy Rains: తెలంగాణలో కుండపోత వానలు.. మరో మూడు రోజులు ఇంతే!

తెలంగాణ వ్యాప్తంగా భారీ వర్షాలు(Heavy Rains) కుదిపేస్తున్నాయి. హైదరాబాద్(Hyderabad) సహా పలు జిల్లాల్లో భారీ వర్షాలు పడుతున్నాయి. ఈ నేపథ్యంలో వాతావరణ కేంద్రం వర్షాలపై మరో కీలక అప్డేట్ ఇచ్చింది. రానున్న మూడు రోజుల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని స్పష్టం చేసింది. అవసరం ఉంటే తప్ప ఎవరు బయటికి రావద్దని సూచించింది. ఇక గురువారం హైదరాబాద్ నగరాన్ని భారీ వర్షం ముంచెత్తింది. అమీర్ పేట్, ఎస్.ఆర్.నగర్, మధురా నగర్, జూబ్లీహిల్స్, బంజారాహిల్స్, కూకట్ పల్లి, మూసాపేట, మాదాపూర్, గచ్చిబౌలి, ఖైరతాబాద్, కోఠి, మలక్ పేట్, దిల్‌సుఖ్ నగర్, వనస్థలిపురం, ఎల్బీనగర్, అబ్దుల్లాపూర్ మేట్, హయత్ నగర్ తదితర ప్రాంతాల్లో భారీ వర్షపాతం నమోదయింది. రోడ్లపైకి వరద నీరు ఒక్కసారిగా చేరడంతో వాహనదారులు అవస్థలు పడ్డారు. జీహెచ్ఎంసీ అధికారులు రంగంలోకి దిగి సహాయక చర్యలు కొనసాగిస్తున్నారు.

Hyderabad rains turn deadly: 2 farmers killed, Charminar damaged,  waterlogging worsens—IMD forecast inside | Today News

ఎప్పటికప్పుడు పరిస్థితిని సమీక్షిస్తున్న అధికారులు

భారీ వర్షాల నేపథ్యంలో GHMC, పోలీస్, ట్రాఫిక్, హైడ్రా విభాగాలు ఎప్పటికప్పుడు పరిస్థితిని సమీక్షిస్తూ సీఎం రేవంత్ రెడ్డికి సమాచారాన్ని చేరవేస్తున్నారు. అన్ని విభాగాలు కలిసి పనిచేసి తగు ముందస్తు జాగ్రత్తలు చేపట్టాలని ముఖ్యమంత్రి సూచించారు. అవసరమైతే తప్ప బయటికి రావొద్దని వీలైతే ప్రయాణాలు వాయిదా వేసుకోవాలని సీఎం రేవంత్ సూచించారు.

నిండుకుండలా హిమాయత్ సాగర్

ఇక నిన్న (ఆగస్టు 7) కురిసిన భారీ వర్షపాతానికి శివారులో ఉన్న హిమాయత్ సాగర్(Himayath Sagar) నిండుకుండని తలపిస్తోంది. దీంతో హిమాయత్ సాగర్ గేట్లు తెరిచి నీటిని మూసీ నది(Moosi River)లోకి విడుదల చేస్తున్నట్లు అధికారులు తెలిపారు. ఇదే విషయమై జీహెచ్ఎంసీ అధికారులు మూసీ నది పరివాహక ప్రాంతాల ప్రజలను అప్రమత్తం చేశారు. ఏదైనా సహాయం కోసం 040 – 2111 1111ను సంప్రదించాలని అధికారులు సూచించారు.

Heavy Flood Water: గండిపేట, హిమాయత్ సాగర్ కు భారీగా వరద ప్రవాహం.. - NTV  Telugu

Related Posts

Kaleshwaram Project: కాళేశ్వరం ప్రాజెక్టుపై సీబీఐ విచారణ.. ప్రభుత్వం సంచలన నిర్ణయం

కాళేశ్వరం ప్రాజెక్టు(Kaleshwaram Project) నిర్మాణంలో అక్రమాలు జరిగాయని ఆరోపించిన కాంగ్రెస్ సర్కార్(Congress Govt).. అందుకోసం జస్టిస్ పీసీ ఘోష్(Justice PC Ghosh) కమిషన్‌ను ఏర్పాటు చేసిన విషయం తెలిసిందే. దీనిపై కమిషన్ దాదాపు 650 పేజీలతో కూడిన నివేదికను ప్రభుత్వానికి అందజేసింది.…

Telangana Assembly: నేటి నుంచి తెలంగాణ అసెంబ్లీ సెషన్స్.. దానిపైనే ప్రధాన చర్చ!

తెలంగాణ అసెంబ్లీ ప్రత్యేక సమావేశాలు(Telangana Assembly special sessions) నేటి (ఆగస్టు 30) నుంచి మూడు రోజుల పాటు జరగనున్నాయి. ఈ మేరకు ఉదయం 10:30 గంటలకు ప్రారంభం కానున్నాయి. తొలిరోజు ఉభయసభల్లో తొలుత ఇటీవల మరణించిన MLAలు, మాజీ సభ్యులకు…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *