
జమ్మూకశ్మీర్లోని పహల్గాం సమీపంలో జరిగిన ఉగ్రదాడి నేపథ్యంలో హైదరాబాద్(Hyderabad)తో సహా తెలంగాణలోని కీలక నగరాల్లో హైఅలర్ట్(High Alert) విధించారు. కేంద్ర నిఘా వర్గాల(Central Intellegence Reports) హెచ్చరికల మేరకు రాష్ట్ర పోలీసు శాఖ అప్రమత్తమైంది. ఉగ్రవాద ప్రభావిత ప్రాంతాల్లో భద్రతను కట్టుదిట్టం చేయాలని కేంద్ర ప్రభుత్వం ఆదేశించింది. ఈ నేపథ్యంలో హైదరాబాద్ నగరంలో భద్రతను కట్టుదిట్టం చేశారు. మహారాష్ట్ర రాజధాని ముంబై(Mumbai) నగరంతో పాటు దాని తీర ప్రాంతాల్లో భద్రతా ఏర్పాట్లు పటిష్ఠం చేసినట్లు ఓ పోలీసు అధికారి తెలిపారు. ఈ దాడి అనంతరం మహారాష్ట్ర హోంశాఖ(Maharastra Home Ministry) అప్రమత్తమైంది. సముద్ర మార్గంలో నిఘాను మరింత కట్టుదిట్టం చేయాలని ముంబై పోలీసులకు ఆదేశాలు జారీ చేసింది. పహల్గాం ఉగ్రదాడి(Pahalgam Terror Attack) నేపథ్యంలో ముందు జాగ్రత్త చర్యగా ముంబై తీర ప్రాంతంలో భద్రతను పెంచారు.
రెచ్చగొట్టే వ్యాఖ్యలు.. అస్సాం ఎమ్మెల్యే అరెస్టు
జమ్ముకశ్మీర్లోని పహల్గాంలో ఇటీవల జరిగిన ఉగ్రదాడి ఘటనలో పాకిస్థాన్(Pakistan)ను సమర్థిస్తూ, రెచ్చగొట్టే విధంగా వ్యాఖ్యలు చేశారన్న ఆరోపణలపై AIUDF పార్టీకి చెందిన MLA అమినుల్ ఇస్లాం(Aminul Islam)ను అసోం పోలీసులు గురువారం అరెస్ట్ చేశారు. ఆయనపై దేశద్రోహం అభియోగాలు మోపారు. ఈ మేరకు భారతీయ న్యాయ సంహిత (BNS)లోని సెక్షన్లు 152/196/197(1)/113(3)/352/353 కింద నగావ్ పోలీస్ స్టేషన్లో కేసు (347/25) నమోదు చేసి అరెస్ట్ చేశారు. అస్సాం సీఎం హిమంత బిశ్వశర్మ(Assam CM Himanta Biswas Sharma) గౌహతిలో జరిగిన మీడియా సమావేశంలో ఈ విషయాన్ని వెల్లడించారు.
🚨 Assam Police have detained AIUDF MLA Aminul Islam over alleged offensive comments regarding the Pahalgam terror attack. Cases have been filed under sections 152, 196, 1971, 1133, 352, and 353 BNS. He has been taken to Nagaon police station for medical attention. pic.twitter.com/M2rCP1nwcx
— The Tradesman (@The_Tradesman1) April 24, 2025