దేశ వ్యాప్తంగా సంచలనం సృష్టించిన దిల్సుఖ్నగర్ బాంబు పేలుళ్ల కేసు(Dilsukhnagar Bomb Blasts Case)లో మంగళవారం (ఏప్రిల్ 8) తెలంగాణ హైకోర్టు(Telangana High Court) తీర్పు వెలువరించనుంది. 2013 ఫిబ్రవరి 21న బస్టాప్ సహా దాని సమీపంలోని మిర్చిపాయింట్ వద్ద జరిగిన జంట పేలుళ్ల(Twin Explosions)లో 18 మంది మృతి చెందగా, 131 మంది గాయపడ్డారు. ఈ కేసులో ప్రధాన నిందితుడు మహమ్మద్ రియాజ్ అలియాస్ రియాజ్ భత్కల్ పరారీలో ఉండగా, మిగిలిన ఐదుగురు నిందితులకు ఎన్ఐఏ కోర్టు(NIA Court) ఉరిశిక్ష విధిస్తూ 2016 డిసెంబరు 13న తీర్పు వెలువరించిన విషయం తెలిసిందే.
సుదీర్ఘ విచారణ అనంతరం..
కాగా ఉరిశిక్ష పడిన నిందితుల్లో(Among the accused) అసదుల్లా అక్తర్ అలియాస్ హద్ది, జియా ఉర్ రహమాన్ అలియాస్ వఘాస్ అలియాస్ నబీల్ అహమ్మద్, మహ్మద్ తహసీన్ అక్తర్ అలియాస్ హసన్ అలియాస్ మోను, యాసిన్ భత్కల్ అలియాస్ షారూఖ్, అజాజ్ షేక్ అలియాస్ సమర్ ఆర్మాన్ తుండె అలియాస్ సాగర్ అలియాస్ ఐజాజ్ సయ్యద్ షేక్ ఉన్నారు. వీరి ఉరిశిక్ష ధ్రువీకరణ నిమిత్తం ఎన్ఐఏ కోర్టు తీర్పును హైకోర్టు(High Court)కు నివేదించింది. దీంతోపాటు ఐదుగురు నిందితులు కింది కోర్టు తీర్పును రద్దు చేయాలని కోరుతూ హైకోర్టును ఆశ్రయించారు. దీనిపై జస్టిస్ కె.లక్ష్మణ్, జస్టిస్ పి.శ్రీసుధలతో కూడిన ధర్మాసనం సుదీర్ఘ విచారణ జరిపి తీర్పు వాయిదా వేసింది. దీంతో నిందితుల అప్పీళ్లు, కింది కోర్టు తీర్పు ధ్రువీకరణపై ధర్మాసనం ఇవాళ తీర్పు వెలువరించనుంది.
Dilsukhnagar Bomb Blast pic.twitter.com/p0LpXR4Xdb
— Mani Kumar Diddi (@MrDiddiMK) February 21, 2025






