కార్తిక పౌర్ణమి స్పెషల్.. ఈరోజు “నక్షత్ర దీపారాధన” చేస్తే ఆ దోషాలన్నీ మాయం!

Mana Enadu : హరిహరులకు కార్తికమాసం (Karthika Masam) ఎంతో ప్రీతిపాత్రమైనది. ఈ మాసం శివకేశవులకు చాలా ప్రత్యేకమైనది. ముఖ్యంగా ఈ మాసంలో వచ్చే కార్తిక పౌర్ణమి ఎంతో శక్తివంతమైనది. కార్తిక పౌర్ణమి రోజునే ఈశ్వరుడు త్రిపురాసురుడు అనే రాక్షసుడిని సంహరించాడని.. అందుకే దీన్ని త్రిపురి పూర్ణిమ అని అంటారని పురాణాలు చెబుతున్నాయి.

ఈ ఏడాది కార్తిక పౌర్ణమి (Karthika Poornima) నవంబర్ 15వ తేదీ శుక్రవారం వచ్చింది. ఈ రోజున 365 వొత్తులతో దీపం వెలిగించడం ఆనవాయితీగా వస్తున్న విషయం తెలిసిందే. అయితే ఈ వొత్తుల దీపంతో పాటు నక్షత్ర దీపం కూడా వెలిగిస్తే గ్రహ, జాతక దోషాలన్నీ తొలగిపోతాయని ప్రతీతి. మరి ఈ నక్షత్ర దీపం ఎలా వెలిగించాలి అంటే..?

నక్షత్ర దీపం ఎలా వెలిగించాలి?

కార్తిక పౌర్ణమి రోజున సాయంత్రం శివాలయానికి (Shivalayam) వెళ్లి.. దీపం పెట్టే ప్రదేశాన్ని శుభ్రం చేసి పసుపుతో అలకాలి. అనంతరం నక్షత్ర ముగ్గు (Nakshtra Muggu)లో (ఈ ముగ్గు కోసం ఇంటర్నెట్ లో సెర్చ్ చేయొచ్చు) పసుపు, కుంకుమ ఉంచి 27 తమలపాకులు ఉంచి వాటి మీద 27 మట్టి ప్రమిదలు ఉంచాలి. ఆ మట్టి ప్రమిదలకు గంధం, కుంకుమ బొట్లు పెట్టి నువ్వులు నూనె పోసి 2 లేదా మూడు వత్తులు వేసి ఏకహారతితో దీపారాధన చేయాలి.

మట్టి ప్రమిదలు లేకపోతే 27 ఉసిరి దీపాలు (Karthika Deepam) వెలిగించవచ్చు. దేవాలయాలకు వెళ్లలేనివారు ఇంటి వద్ద ఈ నక్షత్ర దీపాన్ని వెలిగించవచ్చు​.  కార్తిక పౌర్ణమి రోజు ఈ శక్తివంతమైన నక్షత్ర దీపాన్ని దేవాలయంలో లేదా ఇంటి ప్రాంగణంలో వెలిగిస్తే సంవత్సరం మొత్తం నవ గ్రహాలు, 27 నక్షత్రాల అనుగ్రహం లభిస్తుందని, జ్యోతిష్కులు చెబుతున్నారు. గ్రహ, నక్షత్ర దోషాలన్నీ తొలగిపోతాయని తెలిపారు.

దీపాలు కొండెక్కిన తర్వాత ఏం చేయాలి: అయితే ఇంటి వద్ద వెలిగించిన నక్షత్ర దీపాలు కొండెక్కితే మరునాడు ఉదయం తలస్నానం చేసి ముందుగా అక్కడ ఏర్పాటు చేసిన దీపాలను తీసి పక్కన పెట్టి ప్రమిదలు, ముగ్గు మిశ్రమాన్ని ఓ బట్టతో క్లీన్ చేసి ఎవరూ తొక్కని చోట చెట్టు మొదట్లో వేయాలని చెబుతున్నారు పండితులు

Related Posts

Bonala Jathara 2055: భాగ్యనగరంలో బోనాల జాతర షురూ.. నేడు జగదాంబిక ఎల్లమ్మకు తొలిబోనం

ఆషాఢ మాసం బోనాలు(Bonalu) నేటి (గురువారం) నుంచి ప్రారంభం కానున్నాయి. చారిత్రక గోల్కొండ కోట(Golconda Kota)పై వెలిసిన జగదాంబిక ఎల్లమ్మ(Jagadambika Yellamma) ఆలయంలో జరిగే తొలి బోనంతో బోనాల సందడి ప్రారంభం కానుంది. ‘డిల్లం.. బల్లెం.. కుడకలు బెల్లం’ అంటూ ఆదిపరాశక్తి…

Tirumala Updates: తిరుమలలో కొనసాగుతున్న రద్దీ.. శ్రీవారి దర్శనానికి 20 గంటల సమయం

కలియుగ ప్రత్యక్ష దైవంగా భావించే తిరుమల తిరుపతిలో శ్రీ వెంకటేశ్వరస్వామి(Sri Venkateswara Swamy)వారిని దర్శించుకునేందుకు భక్తులు(Devotees) భారీగా తరలివచ్చారు. దీంతో తిరుమల(Tiruala)లో భక్తుల రద్దీ పెరిగింది. గురువారం ఉదయం కూడా భక్తుల రద్దీ కొనసాగుతూనే ఉంది. టోకెన్‌ లేని భక్తులకు శ్రీవారి…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *