ఉప్పల్​ BRS గెలుపుకు ‘బేతి’ బలం!

మన ఈనాడు:గ్రేటర్​లో ఉప్పల్​ రాజ‘కీ’యం గడియారంలో ‘ముళ్లు’లా మారుతోంది. సిట్టింగ్​ ఎమ్మెల్యేను కాదని ఓ మంత్రి తన ప్రధాన అనుచరుడి కోసం టిక్కెట్​ ఇప్పించుకున్నారు. దీనికోసం సిట్టింగ్​ ఎమ్మెల్యే పనితీరు బాగలేకపోవడంతోనే ఉప్పల్​ టిక్కెట్​ మార్చాల్సి వచ్చిందని గులాబీ అధిష్టానం నిర్ణయం తీసుకోవాల్సి వచ్చిందని ప్రచారంలోకి తీసుకెళ్లారు.

సంక్షేమ పథకాలు సిట్టింగ్​ ఎమ్మెల్యే బేతి సుభాష్​రెడ్డి ప్రజలతో ఉన్న సంబంధాలతో గులాబీ మరోసారి జెండాల ఎగరాల్సిన అవసరం ఉందని సీఎం గుర్తించారని సమాచారం. పార్టీలో ఉన్నత స్థానాలు కల్పిస్తామని సముచిత ఇవ్వడంతోపాటు ఉప్పల్​ గెలుపులో బేతి పాత్ర చాలా అవసరం ఉందని పార్టీ నాయకులకు తేల్చి చెప్పారు.

కానీ గులాబీ పార్టీ పెద్దల నిర్ణయం పట్ల బీఆర్​ఎస్​ కార్యకర్తలు గందరగోళానికి గురైయ్యారు. పార్టీ మారుతున్నారంటూ ఉప్పల్ నియోజకవర్గంలో అధికారపార్టీ ఎమ్మెల్యేపై ప్రచారం జరిగింది.వీటితో మంత్రి కేటీఆర్​ పార్టీ కార్యక్రమాలకు స్థానిక ఎమ్మెల్యేను కనీసం ఆహ్వనం కూడా పలకలేదు.

ఎమ్మెల్యే బేతి సుభాష్​రెడ్డి ప్రభావం గులాబీ బాస్​ గ్రహించారు. ఎట్టి పరిస్థితుల్లోనూ ఉప్పల్​ ఎమ్మెల్యే బేతి సుభాష్​రెడ్డి బీఆర్​ఎస్​ అభ్యర్థి బండారి లక్ష్మారెడ్డికి సహకరించాలని పట్టుబట్టారు. పదవులు కాదు..గులాబీ జెండా కోసం పనిచేసిన కార్యకర్తగా తాను బీఆర్​ఎస్​ కోసం పనిచేస్తానని ఎమ్మెల్యే బేతి సుభాష్​రెడ్డి బాస్​కు హామీనిచ్చారు.

హస్తం జోరు తగ్గాలే…కారు స్పీడ్​ పెరగాలే
ఉప్పల్​ కాంగ్రెస్​ అభ్యర్థి పరమేశ్వరరెడ్డి ప్రచారం ముందున్నారనే విషయాన్ని ఇంటిలిజెన్స్​ వర్గాలు గులాబీ బాస్​ దృష్టికి తీసుకెళ్లారు. వెంటనే ఉప్పల్​ పగ్గాలు బీఆర్​ఎస్​ చేతిలోనే ఉండాలని ఎమ్మెల్యే బేతి సుభాష్​రెడ్డికి బాధ్యతలు అప్పగించారు. సీరియస్​గా తీసుకోవాలని పార్టీ కార్యకర్తలకు సూచించారు.

Related Posts

Kaleswaram: కాళేశ్వరంలో ప్రారంభమైన కుంభాభిషేక మహోత్సవాలు

తెలంగాణ దక్షిణకాశీ అయిన కాళేశ్వరం(Kaleswaram)లో కొలువైన శ్రీ కాళేశ్వర ముక్తేశ్వర స్వామి(Sri Kaleswara Mukteshwara Swami) ఆలయంలో శతచండి మహారుద్ర సహస్ర ఘటాభిషేక కుంభాభిషేక మహోత్సవాలు(Kumbhabhisheka Mahostavalu) నేటి (ఫిబ్రవరి 7) నుంచి ప్రారంభమయ్యాయి. దాదాపు 42 ఏళ్ల తరువాత ఈ…

Medaram: నేడు మేడారంలో గుడిమెలిగే పండగ.. ఈనెల 12 నుంచి మినీ జాతర

మేడారం సమ్మక్క-సారలమ్మ జాతర(Medaram Sammakka-Saralamma Jathara) ఆసియా ఖండంలో అతిపెద్ద ఆదివాసీ జాతర. రెండేళ్లకు ఒకసారి అత్యంత వైభవంగా జరుగుతుంది. తెలంగాణ(Telangana)లోని ములుగు జిల్లా, తాడ్వాయి మండలం, మేడారం గ్రామంలో జరిగే ఈ జాతరకు భక్తులు(Devotees) కోటికి పైగా తరలివస్తారు. ఈ…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *