
బస్సు ప్రయాణికులకు టీజీఆర్టీసీ(TGRTC) శుభవార్త చెప్పింది. హైదరాబాద్ నుంచి విజయవాడ వెళ్లే వారికి అదిరిపోయే ఫెసిలిటీ తీసుకొచ్చింది. కేవలం రూ. 99 రూపాయలతో సౌకర్యవంతంగా HYD-Viyawada చేరుకోవచ్చు. ఈ రెండు నగరాల మధ్య ఈవీ (Electric vehicles) బస్సులు అందుబాటులోకి వచ్చాయి. ETO మోటార్స్తో కలిసి ఫ్లిక్స్ బస్ ఇండియా అందుబాటులోకి తీసుకొచ్చిన ఈ బస్సులను నిన్న బేగంపేటలోని ITC కాకతీయ హోటల్లో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో రవాణాశాఖ మంత్రి పొన్నం ప్రభాకర్(Minister Ponnam Prabhakar) ప్రారంభించారు.
5 గంటల్లోనే గమ్యస్థానం చేరొచ్చు
ఈ సందర్భంగా ETO మోటార్స్ CMO వైఎస్ రాజీవ్, ఫ్లిక్స్ బస్ ఇండియా MD సూర్య ఖురానా మాట్లాడుతూ.. మూడు నాలుగు వారాల తర్వాత హైదరాబాద్-విజయవాడ మధ్య EV బస్సులు అందుబాటులోకి వస్తాయని తెలిపారు. అనంతరం విజయవాడ-విశాఖపట్నం మధ్య ఈవీ బస్సు సేవలు అందుబాటులోకి తీసుకొస్తామని పేర్కొన్నారు. మంత్రి పొన్నం మాట్లాడుతూ.. సేవలు ప్రారంభమైన తర్వాత 4 వారాల పాటు హైదరాబాద్ నుంచి విజయవాడకు కేవలం రూ. 99తో ప్రయాణించవచ్చని వివరించారు. అన్ని ప్రభుత్వ పథకాలు(All Govt Schemes) ఈ బస్సుల్లో వర్తిస్తాయని, 5 గంటల్లోనే గమ్యస్థానం చేరుకోవచ్చన్నవారు. ఈ బస్సుల్లో 49 మంది ప్రయాణించవచ్చని, రానున్న రోజుల్లో స్లీపర్ కోచ్ బస్సుల(Sleeper coach buses)ను కూడా అందుబాటులోకి తీసుకొస్తామని చెప్పారు.
హైదరాబాద్ లో ఐటీసీ కాకతీయ లో ఈటో మోటార్స్ నుండి ఫ్లిక్స్ బస్ ఏసీ ఎలక్ట్రిక్ బస్సును ప్రారంభించడం జరిగింది! pic.twitter.com/w969fV9jS4
— Ponnam Prabhakar (@Ponnam_INC) February 6, 2025