అరేబియా సముద్రంలో (Arabian Sea) మునిగిపోయి సహాయం కోసం ఎదురుచూస్తున్న 12 మందిని భారత్, పాకిస్తాన్ తీర ప్రాంత రక్షణ బలగాలు (Indian Coast Guard) కాపాడాయి. భారత్కు చెందిన అల్ పిరాన్ అనే నౌక.. ఈనెల 4వ తేదీన గుజరాత్లోని పోరుబందర్ నుంచి ఇరాన్ వెళ్తోంది. ఈ క్రమంలోనే బలమైన గాలుల కారణంగా ఆ నౌక పాకిస్థాన్ పరిధిలో ఉన్న ఆరేబియా సముద్రంలో భారతీయ జాలలకు అవతల మునిగిపోయింది.
సాయం కోసం ఎదరుచూపులు
అయితే నౌక మునిగిపోతుండగానే అందులోని సిబ్బంది చిన్న పడవ సాయంతో ఎలాగోలా బయటపడ్డారు. సముద్రం మధ్యలో చిక్కుకుని సాయం కోసం ఎదురుచూడసాగారు. సాయం కోసం వారు పంపిన సందేశం ముంబయిలోని మెరిటైమ్ సెక్యూరిటీ సెంటర్ (ఎంసీసీ) (MCC)కి చేరింది. దీంతో ఎంసీసీ వెంటనే కోస్ట్గార్డును అప్రమత్తం చేసింది. ఆ సందేశం పాక్న్లోని ఎంసీసీ సెంటర్కు చేరగా.. పాకిస్థాన్ తీర ప్రాంతం రక్షణ దళాన్ని (ఎంపీఎస్ఏ)ను (MPSA) అలెర్ట్ చేసింది.
దీంతో సముద్రంలో చిక్కుకున్నవారి రక్షణ కోసం ఎంపీఎస్ఏ ఓ హెలికాప్టర్ను పంపింది. భారత కోస్ట్గార్డ్ సార్థాక్ అనే నౌకను పంపించింది. ఎంసీసీ సెంటర్ల సహకారంతో రెండు దేశాల తీరప్రాంత రక్షణ దళాలు అక్కడికి వెళ్లి ఆ 12 మందిని పాకాడాయి. వారిని సురక్షితంగా సార్థాక్ నౌకలో పోరుబందర్ తీరానికి చేర్చినట్లు కోస్ట్గార్డ్ వెల్లడించింది.
#WATCH | Porbandar, Gujarat | A successful rescue operation was carried out by the Indian Coast Guard in the Arabian Sea. 12 crew members of the sunken Indian ship MSV Al Piranpir were successfully rescued from the North Arabian Sea. This rescue operation was supported by… pic.twitter.com/7T19GV3vSq
— ANI (@ANI) December 5, 2024






