IPL History: ఐపీఎల్@18వ సీజన్.. ఇప్పటికీ ఆడుతున్న ప్లేయర్లు వీరే

మ‌రో రెండు రోజుల్లో ధనాధన్ క్రికెట్ టోర్నీ ఇండియ‌న్ ప్రీమియ‌ర్ లీగ్ (IPL2025) 18వ సీజ‌న్ ప్రారంభం కానుంది. ఈ నెల 22న ఈడెన్ గార్డెన్స్‌లో కోల్‌క‌తా నైట్ రైడ‌ర్స్ (KKR), రాయ‌ల్ ఛాలెంజ‌ర్స్ బెంగ‌ళూరు (RCB) మ‌ధ్య జ‌రిగే ఆరంభ మ్యాచ్‌తో మెగా టోర్నీకి తెర‌లేవ‌నుంది. అయితే, 2008లో ప్రారంభ‌మైన IPLలో ఇప్ప‌టివ‌ర‌కు వేలాది మంది క్రికెట‌ర్లు ఆడారు. కానీ, కొంద‌రు మాత్ర‌మే ఆరంభ సీజ‌న్ నుంచి రాబోయే 18వ ఎడిష‌న్‌లో కూడా ఆడ‌నున్నారు. మరి ఆ ప్లేయర్లు ఎవరో ఓ లుక్ వేద్దామా..

The Excitement of IPL 2024: A Full Schedule Overview - Businessprizm

18వ ఎడిష‌న్‌లోనూ ఆడుతోంది వీరే..

1.మ‌హేంద్ర సింగ్ ధోనీ (CSK)
2. విరాట్ కోహ్లీ (RCB)
3. రోహిత్ శ‌ర్మ (2008లో డెక్క‌న్ ఛార్జ‌ర్స్‌, ఇప్పుడు MI),
4. ర‌వీంద్ర జ‌డేజా (RR త‌ర‌ఫున అరంగేట్రం.. ఇప్పుడు CSK)
5. ర‌విచంద్ర‌న్ అశ్విన్ (CSK)
6. ఇషాంత్ శ‌ర్మ‌(KKR త‌ర‌ఫున ఎంట్రీ.. ఇప్పుడుG T)
7. అజింక్య ర‌హానె (ప్రారంభ సీజ‌న్‌లో MIకి ప్రాతినిధ్యం.. ఇప్పుడు KKR కెప్టెన్‌)
8. మ‌నీశ్ పాండే (ప్రారంభ సీజ‌న్‌లో MI, ఇప్పుడు KKRకు ప్రాతినిధ్యం)

THE FOUR IPL ORIGINALS These stars from the 2008 inaugural season are still  going strong in IPL 2025.😍🔥

ఎక్కువ టైటిళ్లు నెగ్గింది ఆ జట్లే..

కాగా ఇప్పటి వరకూ 17 సీజన్లలో చెన్నై సూపర్ కింగ్స్‌గా 15 సార్లు, పుణే సూపర్ జెయింట్స్‌గా 2సార్లు ఐపీఎల్‌లో తలపడిన CSK 12 సార్లు ప్లేఆఫ్స్ చేరడమే కాక 5సార్లు టైటిల్‌ గెలిచింది. 4సార్లు రన్నరప్‌‌గా నిలిచింది. ఇవన్నీ ధోనీ(MSD) సారథ్యంలోనే కావడం గమనార్హం. ఇక చెన్నైతో సమానంగా ఐపీఎల్ టైటిళ్లను ఐదుసార్లు నెగ్గిన జట్టు ముంబై ఇండియన్స్. దిగ్గజ ఆటగాడు రోహిత్ శర్మ(Rohit Sharma) సారథ్యంలో ముంబై ఎంతో బలంగా ఎదిగింది. ఇక ఆ తర్వాత KKR 3, RR, SRH, GT, డెక్కన్ ఛార్జెస్ ఒక్కోసారి విజేతగా నిలిచాయి.

Related Posts

Kaleshwaram Project: కాళేశ్వరం ప్రాజెక్టుపై సీబీఐ విచారణ.. ప్రభుత్వం సంచలన నిర్ణయం

కాళేశ్వరం ప్రాజెక్టు(Kaleshwaram Project) నిర్మాణంలో అక్రమాలు జరిగాయని ఆరోపించిన కాంగ్రెస్ సర్కార్(Congress Govt).. అందుకోసం జస్టిస్ పీసీ ఘోష్(Justice PC Ghosh) కమిషన్‌ను ఏర్పాటు చేసిన విషయం తెలిసిందే. దీనిపై కమిషన్ దాదాపు 650 పేజీలతో కూడిన నివేదికను ప్రభుత్వానికి అందజేసింది.…

ఆదోని నుంచి సైకిల్‌పై వచ్చిన అభిమానికి మెగాస్టార్ ఇచ్చిన అద్భుతమైన గిఫ్ట్! వీడియో వైరల్..

మెగాస్టార్ చిరంజీవి(Chiranjeevi) పట్ల అభిమానులు చూపించే ప్రేమ మరోసారి బయటపడింది. ఆదోని(Adoni) నుంచి హైదరాబాద్(Hyderadad) వరకు సైకిల్‌పై ఒంటరిగా ప్రయాణించి వచ్చిన మహిళా అభిమాని రాజేశ్వరి(Rajeshwari) అందరినీ కదిలించింది. ఎన్ని కష్టాలు, అడ్డంకులు ఎదురైనా తన ఆరాధ్య నటుడిని చూడాలన్న తపన…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *