BJP-Megastar: చిరంజీవి పొలిటికల్ రీఎంట్రీ ఇస్తారా? బీజేపీ స్కెచ్ ఏంటి?

మెగాస్టార్ చిరంజీవి(Megastar Chiranjeevi) పొలిటికల్ రీ ఎంట్రీ(Political Re-Entry)కి రంగం సిద్ధమవుతోందా? అంటే అవుననే అంటున్నాయి రాజకీయ వర్గాలు. ఇందుకు తాజాగా జరిగిన సంఘటనలను కారణాలుగా అభివర్ణిస్తున్నాయి. ముఖ్యంగా కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి(Kishan Reddy) ఢిల్లిలోని తన నివాసంలో నిర్వహించిన సంక్రాంతి వేడుకల(Sankranti Celebrations)కు మెగాస్టార్‌ను ఆహ్వానించారు. అలాగే ప్రధాని మోదీ(PM Modi)ని సైతం ఈ వేడుకల్లో భాగం చేశారు. ఈ సందర్భంగా బయటికి వచ్చిన వీడియోలు, ఫొటోల్లో చిరంజీవి, ప్రధాని మోదీ అత్యంత సన్నిహితంగా కనిపించడం, ఒకరిచేతులు మరొకరు పట్టుకోవడం, నవ్వుతూ కనిపించడం వంటివి చిరుని పొలిటికల్ రీ ఎంట్రీ కోసమే కమలదళం రెడీ చేస్తోందన్న వార్తలు ఊపందుకున్నాయి.

సంక్రాంతి వేడుకలే పునాదా?

కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ఢిల్లీలో నిర్వహించిన సంక్రాంతి వేడుకలు 2028 ఎన్నికలకు(Elections-2028) కొత్త రాజకీయ సమీకరణలకు పునాది వేసినట్లుగా ఊహాగానాలు వినిపిస్తున్నాయి. వచ్చే ఎన్నికల్లో BJP తెలుగు రాష్ట్రాల్లో పాగా వేయడానికి ఇప్పటి నుంచే స్కెచ్ వేస్తున్నట్లు సమాచారం. ఇందుకు మెగాస్టార్ లాంటి ఫ్యాన్ బేస్ ఉన్న లీడర్లను తమ టీమ్‌లోకి తీసుకొని ముందుకెళ్లాలని కమలం పార్టీ భావిస్తున్నట్లు టాక్. తెలంగాణలో BRS వైఫల్యం, ప్రజల్లో కాంగ్రెస్‌(Congress)పై రోజురోజుకూ సన్నగిల్లుతోన్న విశ్వాసం..తాజాగా నిజామాబాద్‌లో పసుపు బోర్డు(Turmeric Board) ఏర్పాటు వంటివి BJPకి సానకూలంగా మారే అవకాశాలు ఉన్నట్లు తెలుస్తోంది.

Chiranjeevi celebrates Pongal with Prime Minister Narendra Modi at Union  minister G Kishan Reddy home in Delhi - India Today

పవన్‌పై మోదీకి ప్రత్యేక అభిమానం

ఇదిలా ఉండగా చిరంజీవి సోదరుడు పవన్ కల్యాణ్(Pawan Kalyan) ఇప్పటికే బీజేపీతో బాగా దగ్గరగా ఉన్నారు. ఆయనకు సొంతంగా జనసేన(Janasena) పార్టీ ఉన్నా BJP, జనసేన ఒకరికోసం ఒకరు త్యాగాలు చేసుకుంటున్నాయి. పవన్‌ కళ్యాన్‌ పార్టీ జనసేన అయినప్పటికీ బీజేపీ అగ్ర నాయకత్వం అతనిని వేరుగా చూడడం లేదు. పవన్‌ కళ్యాన్‌పై మోదీ ప్రత్యేక అభిమానం చూపిస్తున్న విషయం అందరికీ తెలిసిందే. పవన్‌ కళ్యాన్‌ కూడా మోదీని తన నాయకుడిగానే భావిస్తారు. బీజేపీ ఇప్పటికే పవన్‌ ద్వారా APలో గ్రౌండ్‌ ప్రిపేర్‌ చేస్తోంది. ఇదిలా ఉండగా తాజాగా మెగాస్టార్ తెరపైకి రావడం, ఆయనకు గవర్నర్, లేదా ఉపరాష్ట్రపతి ఇస్తారనే వార్తలూ సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి. మరి వచ్చే ఎన్నికల్లో బీజేపీ ప్లాన్ ఏంటో తెలియాలంటే మరికొన్ని రోజులు ఆగాల్సిందే.

Modi's Bonhomie With Mega Brothers Hogs Limelight

Related Posts

Assembly Seats: త్వరలో ఏపీ, తెలంగాణలో పెరగనున్న అసెంబ్లీ సీట్లు!

రాష్ట్రాల అసెంబ్లీ స్థానల పునర్విభజనతో ఆంధ్రప్రదేశ్, తెలంగాణల్లో అసెంబ్లీ స్థానాలు (Telangana Assembly Seats) పెరగవచ్చని తెలుస్తోంది. ఏపీలో 50 (AP Assembly Seats), తెలంగాణ(Telangana)లో 34 కొత్త అసెంబ్లీ స్థానాలు ఏర్పాటు కానున్నట్లు అధికారులు అంచనా వేస్తున్నారు. అయితే ఇది…

గన్నవరం చేరుకున్న ప్రధాని.. కాసేపట్లో అమరావతికి మోదీ

అమరావతి పునరుద్ధరణ పనుల(For Amaravati renovation works)కు శ్రీకారం చుట్టేందుకు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ(PM Modi) గన్నవరం విమానాశ్రయాని( Gannavaram Airport)కి చేరుకున్నారు. ఆయనకు ఏపీ స్పీకర్ అయ్యన్నపాత్రుడు, డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణరాజు, మంత్రులు అనిత, అనగాని, వాసంశెట్టి స్వాగతం పలికారు.…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *