Janvi Kapoor: జాన్వీ రెమ్యునరేషన్ లెక్క మారింది.. అడిగినంత అప్పజెప్పాల్సిందేనా?

ఒకప్పటి స్టార్ హీరోయిన్, అతిలోక సుందరి శ్రీదేవి(Sridevi) వారసురాలిగా ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చింది జాన్వీ కపూర్(Janvi Kapoor). తన అందం, టాలెంట్‌తో వరుస ప్రాజెక్టులతో తనకంటూ ప్రత్యేక గుర్తింపు సంపాదించుకుంది. అటు బాలీవుడ్(Bollywood)లోనూ.. ఇటు టాలీవుడ్‌(Tollywood)లోనూ పలు మూవీస్‌లో నటిస్తూ బిజీబిజీగా ఉంది. ఎన్టీఆర్ దేవర(Devara) మూవీతో తెలుగు ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చిన ఈ బ్యూటీ.. ఆ సినిమా సీక్వెల్ లోనూ నటించనుంది. ప్రస్తుతం రామ్ చరణ్(Ram Charan) మూవీ పెద్ది(Peddi)లో నటిస్తోంది. బుచ్చిబాబు సనా(Bucchibabu Saana) తెరకెక్కిస్తున్న ఈ సినిమా వచ్చే ఏడాది మార్చిలో రిలీజ్ కానుంది.

Peddi : A crazy first look of Janhvi Kapoor being readied

దేవర మూవీకి రూ.5 కోట్లు అందుకున్న జాన్వీ

ఇక జాన్వీ రెమ్యునరేషన్(Remunaration) విషయానికొస్తే.. దేవర మూవీకి రూ.5 కోట్లు అందుకున్న ఈ ముద్దుగుమ్మ.. పెద్ది సినిమాకు ఏకంగా రూ.6 కోట్లు తీసుకుంటున్నట్లు తెలుస్తోంది. దీంతో తెలుగులో రెండో చిత్రానికే కోటి రూపాయలు పెంచిందని సమాచారం. అల్లు అర్జున్-అట్లీ(Allu-Atlee Movie) కాంబోలోని ఓ రోల్ కోసం మేకర్స్ ఇటీవల జాన్వీ కపూర్‌ను సంప్రదించారట. దీంతో ఈ మూవీకి మరో రూ.కోటి పెంచేసి మొత్తంగా రూ.7 కోట్ల రెమ్యునరేషన్ డిమాండ్ చేసిందట.

Jr NTR says that Janhvi Kapoor 'manifested' her role in Devara Part 1: 'She  shocked us with her performance' - Hindustan Times

దీంతో ఆమెను మూవీలోకి తీసుకుంటే.. ఉత్తరాదిలోనూ బెనిఫిట్ ఉంటుందని మేకర్స్ భావిస్తున్నారట. అందుకే కాస్త రెమ్యునరేషన్ తగ్గించమని ఆమెతో చర్చలు జరుపు తున్నట్లు సమాచారం. కానీ ఈ భామ మాత్రం వెనక్కి తగ్గేదేలే అంటున్నట్లు బాలీవుడ్‌లో ఓ న్యూస్ వైరల్ అవుతోంది.

Related Posts

Mahesh Babu | వారణాసి ఈవెంట్‌లో రాజమౌళి స్ట‌న్నింగ్ కామెంట్స్

Mahesh Babu | సూపర్ స్టార్ మహేశ్‌బాబు—దర్శకధీరుడు ఎస్‌ఎస్‌ రాజమౌళి కాంబినేషన్‌లో వస్తున్న అత్యంత భారీ యాక్షన్ అడ్వెంచర్ ఫిల్మ్ “వారణాసి” పై ఆసక్తి రోజురోజుకూ పెరుగుతోంది. గ్లోబ్ ట్రోటర్ ఈవెంట్‌లో విడుదలైన స్పెషల్ వీడియోకు ప్రేక్షకుల నుంచి అద్భుత స్పందన…

Kaleshwaram Project: కాళేశ్వరం ప్రాజెక్టుపై సీబీఐ విచారణ.. ప్రభుత్వం సంచలన నిర్ణయం

కాళేశ్వరం ప్రాజెక్టు(Kaleshwaram Project) నిర్మాణంలో అక్రమాలు జరిగాయని ఆరోపించిన కాంగ్రెస్ సర్కార్(Congress Govt).. అందుకోసం జస్టిస్ పీసీ ఘోష్(Justice PC Ghosh) కమిషన్‌ను ఏర్పాటు చేసిన విషయం తెలిసిందే. దీనిపై కమిషన్ దాదాపు 650 పేజీలతో కూడిన నివేదికను ప్రభుత్వానికి అందజేసింది.…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *