Thug Life Collections: బాక్సాఫీస్ వద్ద కమల్‌కు షాక్.. ‘థగ్‌లైఫ్’ కలెక్షన్స్ డల్!

ప్రముఖ నటుడు, లోక నాయకుడు కమల్ హాసన్(Kamal Haasan), సీనియర్ నటి త్రిష(Trisha) హీరోయిన్‌గా నటించిన లేటెస్ట్ మూవీ ‘థగ్‌లైఫ్(Thug Life)’. AM మణిరత్నం(Director Mani ratnam) దర్శకత్వంలో రూపొందిన ఈ మూవీలో మరో స్టార్ హీరో శింబు(Simbu) ఓ కీలక పాత్రలో నటించాడు. భారీ అంచనాల మధ్య ఈ మూవీ ప్రపంచ వ్యాప్తంగా జూన్ 5వ తేదీన విడుదలైంది. అయితే ఈ మూవీ విడుదలకు ముందే కమల్ తమిళ్-కన్నడ భాష వ్యాఖ్యలతో షాక్ తగిలింది. ఇక మొదటి షోకే బాక్సా‌ఫీస్(Box office) దగ్గర నెగిటివ్ టాక్ వచ్చింది. దానితో ఈ మూవీ భారీ కలెక్షన్లను(Collections) వసూలు చేయడంలో వెనుకబడిపోయింది.

రూ.105 కోట్ల ప్రీ రిలీజ్ బిజినెస్

ఇక ఈ మూవీకి తమిళనాడు(Tamilnadu) ఏరియాలో రూ.19.05 కోట్ల కలెక్షన్లు దక్కగా, రెండు తెలుగు రాష్ట్రాల్లో రూ.2.65 కోట్లు, కేరళలో రూ.1.65 కోట్లు, హిందీతోపాటు రెస్ట్ ఆఫ్ ఇండియాలో రూ.3.0 కోట్లు , ఓవర్సీస్‌లో రూ.25.85 కోట్ల కలెక్షన్లు దక్కాయి. మొత్తంగా ఈ మూవీకి 2 రోజుల్లో ప్రపంచ వ్యాప్తంగా రూ.25.70 కోట్ల షేర్, రూ. 52.25 కోట్ల గ్రాస్ కలెక్షన్లు(Gross Collections) దక్కాయి. ఈ మూవీకి ప్రపంచ వ్యాప్తంగా రూ.105 కోట్ల ప్రీ రిలీజ్ బిజినెస్(Pre-release business) జరగగా ఈ మూవీ రూ.106.50 కోట్ల టార్గెట్‌తో బాక్స్ ఆఫీస్ బరిలోకి దిగింది.

తమిళనాడు ఏరియాలోనూ నెగిటివ్ టాక్

ఈ మూవీ ప్రపంచ వ్యాప్తంగా మరో రూ.80.80 కోట్ల షేర్ కలెక్షన్లను రాబడితే బ్రేక్ ఈవెన్ ఫార్ములా(Break Even Formula)ను కంప్లీట్ చేసుకుని క్లీన్ హిట్‌గా నిలుస్తుంది. ఇకపోతే ఈ మూవీ కి తమిళనాడు ఏరియాలో నెగిటివ్ టాక్ వచ్చిన మంచి కలెక్షన్లు వస్తాయి అని చాలా మంది భావించారు. కానీ ఈ మూవీ కి తమిళనాడు ఏరియాలో కూడా చలికిలబడింది.

 

Related Posts

Mahesh Babu | వారణాసి ఈవెంట్‌లో రాజమౌళి స్ట‌న్నింగ్ కామెంట్స్

Mahesh Babu | సూపర్ స్టార్ మహేశ్‌బాబు—దర్శకధీరుడు ఎస్‌ఎస్‌ రాజమౌళి కాంబినేషన్‌లో వస్తున్న అత్యంత భారీ యాక్షన్ అడ్వెంచర్ ఫిల్మ్ “వారణాసి” పై ఆసక్తి రోజురోజుకూ పెరుగుతోంది. గ్లోబ్ ట్రోటర్ ఈవెంట్‌లో విడుదలైన స్పెషల్ వీడియోకు ప్రేక్షకుల నుంచి అద్భుత స్పందన…

Kaleshwaram Project: కాళేశ్వరం ప్రాజెక్టుపై సీబీఐ విచారణ.. ప్రభుత్వం సంచలన నిర్ణయం

కాళేశ్వరం ప్రాజెక్టు(Kaleshwaram Project) నిర్మాణంలో అక్రమాలు జరిగాయని ఆరోపించిన కాంగ్రెస్ సర్కార్(Congress Govt).. అందుకోసం జస్టిస్ పీసీ ఘోష్(Justice PC Ghosh) కమిషన్‌ను ఏర్పాటు చేసిన విషయం తెలిసిందే. దీనిపై కమిషన్ దాదాపు 650 పేజీలతో కూడిన నివేదికను ప్రభుత్వానికి అందజేసింది.…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *