Karuppu: ఈనెల 23న ఫ్యాన్స్‌కు బిగ్ సర్‌ప్రైజ్ ఇవ్వబోతున్న సూర్య అండ్ కో!

కోలీవుడ్ స్టార్ హీరో సూర్య(Suriya) హిట్, ఫ్లాప్ అని ఆలోచించకుండా వరుస చిత్రాల్లో నటిస్తున్నారు. ఆయన ఇటీవల నటించిన కంగువ(Kanguva), రెట్రో(Retro) బాక్సాఫీస్ వద్ద బోల్తా కొట్టాయి. దీంతో ఈసారి ఎలాగైనా హిట్ కొట్టాలనే కసితో ఉన్నాడు ఈ తమిళ్ స్టార్. తాజాగా సూర్య తన 45వ చిత్రం ‘కరుప్పు(Karuppu)’తో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు. ఈ మూవీలో సూర్య సరసన స్టార్ బ్యూటీ త్రిష కృష్ణన్ (Trisha Krishnan)హీరోయిన్‌గా నటిస్తోంది. ఈ చిత్రానికి ప్రముఖ తమిళ కమెడియన్, దర్శకుడు RJ బాలాజీ దర్శకత్వం వహిస్తున్నారు. డ్రీమ్ వారియర్ పిక్చర్స్ నిర్మాణంలో రూపొందుతున్న ఈ సినిమా ఫస్ట్ లుక్ పోస్టర్‌(First Look Poster) అభిమానుల్లో భారీ అంచనాలు పెంచేసింది.

‘కరుప్పు’లో సూర్యది వైవిధ్యమైన రోల్

ఇదిలా ఉంటే.. తాజాగా, ‘కరుప్పు’కు సంబంధించిన ఓ అప్డేట్ సోషల్ మీడియా(Social Media)లో వైరల్ అవుతోంది. జులై 23న సూర్య పుట్టినరోజున మూవీ మేకర్స్ అభిమానులకు సర్‌ప్రైజ్ ఇవ్వబోతున్నట్లు సమాచారం. ‘కరుప్పు’ టీజర్‌(Karuppu Teaser)ను విడుదల చేసేందుకు ప్లాన్ చేస్తున్నట్లు తెలుస్తోంది. సూర్య గతంలో ‘సూరరై పోట్రు’, ‘జై భీమ్’ వంటి చిత్రాలతో వైవిధ్యమైన పాత్రల్లో మెప్పించాడు. ‘కరుప్పు’లో కూడా అతని నటన ప్రధాన ఆకర్షణగా నిలవనుందని మేకర్స్ తెలిపారు. సాయి అభ్యంకర్(Sai Abhyankar) సంగీతం అందిస్తున్న ఈ చిత్రంలో ఆర్‌జే బాలాజీ కీలక పాత్రలో కనిపించనున్నారు. షూటింగ్ శరవేగంగా సాగుతోంది, త్వరలో మరిన్ని అప్‌డేట్‌లు వస్తాయని చిత్ర బృందం ప్రకటించింది.

సూర్య ప్రస్తుతం తెలుగు దర్శకుడు వెంకీ అట్లూరి(Venky Atloori)తో మరో చిత్రంలో నటిస్తున్నాడు. కానీ ‘కరుప్పు’పై అభిమానుల ఫోకస్ ఎక్కువగా ఉంది. ఈ సినిమా తమిళ, తెలుగు ప్రేక్షకులను ఆకట్టుకునేలా రూపొందుతోంది. టైటిల్(Title), ఫస్ట్ లుక్ ఆధారంగా ఈ చిత్రం సూర్య కెరీర్‌లో మరో మైలురాయిగా నిలిచే అవకాశం ఉందని అభిమానులు ఆశిస్తున్నారు.

Related Posts

Kaleshwaram Project: కాళేశ్వరం ప్రాజెక్టుపై సీబీఐ విచారణ.. ప్రభుత్వం సంచలన నిర్ణయం

కాళేశ్వరం ప్రాజెక్టు(Kaleshwaram Project) నిర్మాణంలో అక్రమాలు జరిగాయని ఆరోపించిన కాంగ్రెస్ సర్కార్(Congress Govt).. అందుకోసం జస్టిస్ పీసీ ఘోష్(Justice PC Ghosh) కమిషన్‌ను ఏర్పాటు చేసిన విషయం తెలిసిందే. దీనిపై కమిషన్ దాదాపు 650 పేజీలతో కూడిన నివేదికను ప్రభుత్వానికి అందజేసింది.…

ఆదోని నుంచి సైకిల్‌పై వచ్చిన అభిమానికి మెగాస్టార్ ఇచ్చిన అద్భుతమైన గిఫ్ట్! వీడియో వైరల్..

మెగాస్టార్ చిరంజీవి(Chiranjeevi) పట్ల అభిమానులు చూపించే ప్రేమ మరోసారి బయటపడింది. ఆదోని(Adoni) నుంచి హైదరాబాద్(Hyderadad) వరకు సైకిల్‌పై ఒంటరిగా ప్రయాణించి వచ్చిన మహిళా అభిమాని రాజేశ్వరి(Rajeshwari) అందరినీ కదిలించింది. ఎన్ని కష్టాలు, అడ్డంకులు ఎదురైనా తన ఆరాధ్య నటుడిని చూడాలన్న తపన…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *