BREAKING: జనసేన ఎమ్మెల్సీ అభ్యర్థిగా నాగబాబు

ఏపీలో రాజకీయాల్లో సంచలన నిర్ణయం వెలువడింది. ఎన్నో రోజులుగా కొనసాగుతున్న ఉత్కంఠకు తెరపడింది. జనసేన(Janasena) ఎమ్మెల్సీ అభ్యర్థిగా కొణిదెల నాగబాబు(Konidela Nagababu) పేరును ఖరారు చేస్తే ఆ పార్టీ అధినేత, ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్(Pawan Kalyan) నిర్ణయం తీసుకున్నారు. దీంతో శాసన సభ్యుల కోటాలో నిర్వహించే ఎమ్మెల్సీ ఎన్నికల్లో నాగబాబు నామినేషన్(Nomination) దాఖలు చేయనున్నారు. ప్రస్తుతం ఆయన జనసేన పార్టీ ప్రధాన కార్యదర్శిగా ఉన్న విషయం తెలిసిందే. కాగా ఆయన నామినేషన్‌కు సంబంధించి అవసరమైన పత్రాలు సిద్ధం చేయాలని జనసేన పార్టీ కార్యాలయ సిబ్బందిని పవన్ కల్యాణ్ ఆదేశించారు.

ఈనెల 20న పోలింగ్

కాగా ఏపీలో 5 MLA కోటా MLC స్థానాలకు నోటిఫికేషన్ విడుదలైన విషయం తెలిసిందే. ఈ నెల 10వ తేదీతో నామినేషన్ల దాఖలుకు గడువు పూర్తికానుంది. ఈనెల 20న పోలింగ్(Polling) జరగనుంది. అదేరోజు సాయంత్రం కౌంటింగ్ నిర్వహిస్తారు. కూటమి పొత్తులో భాగంగా ఓ MLC స్థానాన్ని జనసేన(Jenasena)కు కేటాయించారు. ఎమ్మెల్సీగా ప్రమాణ స్వీకారం చేసిన తరువాత ఆయన్ను మంత్రివర్గం(Cabinate)లోకి తీసుకొనే అవకాశం ఉంది.

Related Posts

Kaleshwaram Project: కాళేశ్వరం ప్రాజెక్టుపై సీబీఐ విచారణ.. ప్రభుత్వం సంచలన నిర్ణయం

కాళేశ్వరం ప్రాజెక్టు(Kaleshwaram Project) నిర్మాణంలో అక్రమాలు జరిగాయని ఆరోపించిన కాంగ్రెస్ సర్కార్(Congress Govt).. అందుకోసం జస్టిస్ పీసీ ఘోష్(Justice PC Ghosh) కమిషన్‌ను ఏర్పాటు చేసిన విషయం తెలిసిందే. దీనిపై కమిషన్ దాదాపు 650 పేజీలతో కూడిన నివేదికను ప్రభుత్వానికి అందజేసింది.…

ఆదోని నుంచి సైకిల్‌పై వచ్చిన అభిమానికి మెగాస్టార్ ఇచ్చిన అద్భుతమైన గిఫ్ట్! వీడియో వైరల్..

మెగాస్టార్ చిరంజీవి(Chiranjeevi) పట్ల అభిమానులు చూపించే ప్రేమ మరోసారి బయటపడింది. ఆదోని(Adoni) నుంచి హైదరాబాద్(Hyderadad) వరకు సైకిల్‌పై ఒంటరిగా ప్రయాణించి వచ్చిన మహిళా అభిమాని రాజేశ్వరి(Rajeshwari) అందరినీ కదిలించింది. ఎన్ని కష్టాలు, అడ్డంకులు ఎదురైనా తన ఆరాధ్య నటుడిని చూడాలన్న తపన…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *