Dil Raju: సినిమాల పైరసీ.. నటీనటులపై దిల్ రాజు హాట్ కామెంట్స్

ఇటీవల సినిమాలు థియేటర్లలో విడుదలైన రోజే పైరసీ(Piracy) బారిన పడుతున్న సంగతి తెలిసిందే. దీంతో మేకర్స్(Makers) భారీగా నష్టపోతున్నారు. ఈ నేపథ్యంలో ప్రముఖ నిర్మాత దిల్ రాజు(Producer Dil Raju) పైరసీపై ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశారు. ఏదైనా మూవీ పైరసీకి గురయితే ప్రొడ్యూసర్లు మాత్రమే నష్టపోతున్నారు. నటీనటులు, ఇతర ఆర్టిస్ట్‌(Actors and other artists)లు సేఫ్‌గా ఉంటున్నారని సంచలన కామెంట్స్ చేశారు. అంతేకాదు.. వారు ఒక సినిమా కాకపోతే మరొక సినిమాతో బిజీగా మారిపోతున్నారు. వేరే ప్రొడ్యూసర్(Producer) నష్టపోతే మాకేంటి అని అనుకుంటున్నారు. ఏదైనా తమవరకు వస్తే కానీ నొప్పి తెలీదు. త్వరలోనే ఈ విషయంపై మీటింగ్ పెట్టుకుంటామని చెప్పారు.

పైరసీపై త్వరలోనే ప్రభుత్వానికి లేఖ

కాగా ప్రస్తుతం దిల్ రాజు ‘నిర్మాత, డిస్ట్రిబ్యూటర్‌‌‌(Producer, distributor)గా’ మాత్రమే కాకుండా తెలంగాణ ప్రభుత్వంలో కీలక పదవిలో ఉన్నారు. తెలంగాణ ఫిల్మ్ డెవలప్‌‌మెంట్ కార్పొరేషన్ (Telangana Film Development Corporation) ఛైర్మన్‎గా ఆయన ఇటేవల ఎన్నికయ్యారు. దాంతో FDC ఛైర్మన్‌గా పైరసీపై కట్టుదిట్టమైన చర్యలు ఎలా తీసుకోవాలో ఆలోచిస్తున్నట్లు తెలిపారు. అందుకోసమే ప్రభుత్వాని(Govt)కి ఒక త్వరలో లేఖ రాయనున్నట్లు వెల్లడించారు. ప్రస్తుతం ఇందుకు సంబందించిన కామెంట్స్ పై తెలుగు సినీ హీరోల నుంచి ఏదైనా స్పందన వస్తుందేమో చూడాలి.

Related Posts

ఉగ్రదాడి వేళ మంచి మనసు చాటుకున్న కశ్మీరీలు.. టూరిస్టులకు ఫ్రీగా ఆటో, ట్యాక్సీ రైడ్లు

పహల్గామ్​లో జరిగిన ఉగ్రదాడి (Pahalgam Terror Attack)లో 28 మంది పర్యటకులు మరణించిన విషయం తెలిసిందే. ఈ పెను విషాద సమయంలో అక్కడి ఆటో, ట్యాక్సీ డ్రైవర్లు, వ్యాపారులు, స్థానికులు మంచి మనసు చాటుకుంటున్నారు. టెర్రర్ అటాక్ వల్ల భయంతో వణికిపోతున్న…

Masooda Ott: మరో ఓటీటీలోకి మసూద.. స్ట్రీమింగ్ ఎక్కడంటే?

అభిమానుల్లో సస్పెన్స్‌తో కూడిన హారర్(Horror) చిత్రాలకు ఎప్పుడూ మంచి ఆదరణ లభిస్తుంటుంది. ఇలాంటి సినిమాల(Movies)ను చూసేందుకు చాలా మంది ఇష్టపడుతుంటారు. ఇలాంటి ఎన్నో సినిమాలు తెలుగు ప్రేక్షకులకు మాంచి థ్రిల్‌(thrill)ని అందించాయి. సరిగ్గా ఇలాంటి థ్రిల్‌నే 2022లో విడుదలైన ‘మసూద(Masooda)’ సినిమా…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *