కంగ్రాట్స్‌ రాహుల్‌.. మరోసారి బీజేపీని గెలిపించారు : కేటీఆర్‌

ఢిల్లీ ఎన్నికల్లో ఇప్పటి వరకు వెలువడిన ఫలితాలు (Delhi Assembly Election Results 2025) చూస్తుంటే ఈసారి దేశ రాజధానిలో కాషాయ జెండా ఎగరడం ఖాయమనిపిస్తోంది. 27 ఏళ్ల తర్వాత హస్తిన పీఠాన్ని భారతీయ జనతా పార్టీ (BJP) కైవసం చేసుకోబోతున్న సంకేతాలు కనిపిస్తున్నాయి. ఇప్పటి వరకు వెలువడిన ఫలితాల ప్రకారం బీజేపీ 45 స్థానాలకుపైగా ముందంజలో ఉంటే ఆప్ (AAP) 25 చోట్లు ఆధిక్యంలో కొనసాగుతోంది. ఇక కాంగ్రెస్ ఈసారి కూడా తన సత్తా చాటలేకపోయింది.

రాహుల్ గాంధీకి కంగ్రాట్స్

ఈ నేపథ్యంలో ఢిల్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ కథ కంచికే అంటూ బీఆర్ఎస్ మాజీ మంత్రి, పార్టీ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ (KTR On Delhi Results 2025) ఎద్దేవా చేశారు. ఢిల్లీలో బీజేపీని గెలిపిస్తున్న రాహుల్ గాంధీకి కంగ్రాట్స్ అంటూ కేటీఆర్ సెటైర్ వేశారు. హస్తినలో ఆప్ పాలిట కట్టప్ప పాత్ర పోషించిన కాంగ్రెస్ (Congress) అంటూ ఇప్పటికే గులాబీ దళం సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తోంది.  ఆప్ ఓట్ షేరింగ్ ను దెబ్బతీసి.. బీజేపీని ఢిల్లీ సింహాసనం పై కూర్చొబెడుతున్న కాంగ్రెస్ అంటూ బీఆర్‌ఎస్ పార్టీ నెట్టింట మాస్ ర్యాగింగ్‌ చేస్తోంది.

అలా చేస్తే ఇలాంటి ఫలితాలే వస్తాయ్

మరోవైపు ఢిల్లీ ఫలితాలపై తాజాగా కాంగ్రెస్ ఎంపీ ప్రియాంక గాంధీ స్పందించారు. ఢిల్లీ ఎన్నికల ఫలితాలను తానింకా చూడలేదని చెప్పారు. మరోవైపు ఢిల్లీ ఎన్నికల్లో (Congress Delhi Results 2025) కాంగ్రెస్ పరాజయంపై జమ్మూకశ్మీర్ సీఎం ఒమర్ అబ్దుల్లా సంచలన ట్వీట్ చేశారు.  మనం మనం కొట్లాడుకుంటే ఫలితాలు ఇలానే వస్తాయని ఇండియా కూటమిపై విమర్శలు చేశారు. ఇంకోవైపు ఢిల్లీలో ఆప్ గెలుపోటములు కాంగ్రెస్ బాధ్యత కాదని ఆ పార్టీ స్పష్టం చేసింది.

Related Posts

Kaleshwaram Project: కాళేశ్వరం ప్రాజెక్టుపై సీబీఐ విచారణ.. ప్రభుత్వం సంచలన నిర్ణయం

కాళేశ్వరం ప్రాజెక్టు(Kaleshwaram Project) నిర్మాణంలో అక్రమాలు జరిగాయని ఆరోపించిన కాంగ్రెస్ సర్కార్(Congress Govt).. అందుకోసం జస్టిస్ పీసీ ఘోష్(Justice PC Ghosh) కమిషన్‌ను ఏర్పాటు చేసిన విషయం తెలిసిందే. దీనిపై కమిషన్ దాదాపు 650 పేజీలతో కూడిన నివేదికను ప్రభుత్వానికి అందజేసింది.…

ఆదోని నుంచి సైకిల్‌పై వచ్చిన అభిమానికి మెగాస్టార్ ఇచ్చిన అద్భుతమైన గిఫ్ట్! వీడియో వైరల్..

మెగాస్టార్ చిరంజీవి(Chiranjeevi) పట్ల అభిమానులు చూపించే ప్రేమ మరోసారి బయటపడింది. ఆదోని(Adoni) నుంచి హైదరాబాద్(Hyderadad) వరకు సైకిల్‌పై ఒంటరిగా ప్రయాణించి వచ్చిన మహిళా అభిమాని రాజేశ్వరి(Rajeshwari) అందరినీ కదిలించింది. ఎన్ని కష్టాలు, అడ్డంకులు ఎదురైనా తన ఆరాధ్య నటుడిని చూడాలన్న తపన…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *