Local Body Elections: తెలంగాణలో స్థానిక సంస్థల ఎన్నికలపై కీలక అప్డేట్

తెలంగాణ(Telangana)లో స్థానిక సంస్థల ఎన్నికల(Local body elections)కు చకచకా ఏర్పాట్లు జరుగుతున్నాయి. వీలైనంత త్వరగా ఎన్నికలు నిర్వహించేందుకు సీఎం రేవంత్(CM Revanth) సర్కాన్ ప్రణాళికలు చేపడుతోంది. తాజాగా స్థానిక సంస్థల ఎన్నికల కోసం గ్రామ పంచాయతీలు(Panchayats), MPTCలు, ZPTC, వార్డు స్థానాల సంఖ్యను ఖరారు చేసింది. ఈ మేరకు పంచాయతీ రాజ్ శాఖ(Panchayat Raj Department) అధికారిక ఉత్తర్వులు జారీ చేసింది. కాగా రాష్ట్రంలో మొత్తం 12,778 గ్రామ పంచాయతీలు, 1,12,694 వార్డు స్థానాలు ఉన్నట్లు ప్రభుత్వం ప్రకటించింది. అలాగే, 31 జిల్లా పరిషత్‌లు (ZPలు), 566 ZPTC స్థానాలు, 566 మండల పరిషత్‌లు (MPPలు), 5,773 MPTC స్థానాలు ఖరారయ్యాయి.

Telangana CM Revanth Urges Speedy Local Body Elections

తగ్గిన గ్రామ పంచాయతీల సంఖ్య

కాగా ఈ సంఖ్యలు 2019 ఎన్నికలతో పోలిస్తే కొంత తగ్గాయి. దీనికి కారణం వేగవంతమైన పట్టణీకరణ(urbanization)గా తెలుస్తోంది. మరోవైపు 71 గ్రామ పంచాయతీలను గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ (GHMC), మున్సిపాలిటీలు, మున్సిపల్ కార్పొరేషన్‌లలో విలీనం చేయడం. దీంతో గ్రామ పంచాయతీల సంఖ్య 12,848 నుంచి 12,778కి, వార్డుల సంఖ్య 1,13,136 నుంచి 1,12,694కి తగ్గింది. ఎంపీటీసీ స్థానాలు 5,847 నుంచి 5,773కి తగ్గగా, ఎంపీపీల సంఖ్య 539 నుంచి 566కి పెరిగింది.

DMK set to sweep Tamil Nadu local body polls in 9 areas | Latest News India  - Hindustan Times

పంచాయతీ రాజ్ చట్టంలో సవరణలు చేస్తూ నిర్ణయం

తెలంగాణ హైకోర్టు సెప్టెంబర్ 30, 2025 లోపు స్థానిక ఎన్నికలు పూర్తి చేయాలని ఆదేశించిన నేపథ్యంలో, పంచాయతీ రాజ్ శాఖ ఎన్నికల సన్నాహాలను వేగవంతం చేసింది. ఇదిలా ఉండగా జిల్లా కలెక్టర్లు, జడ్పీ CEOలు, DPOలు తక్షణ చర్యలు చేపట్టాలని సూచించింది. అవసరమైన స్టాంపులు, ఫారమ్‌లు, హ్యాండ్‌బుక్‌లు సిద్ధం చేయాలని ఆదేశించింది. అదనంగా, బీసీలకు 42% రిజర్వేషన్‌ను అమలు చేయడానికి పంచాయతీ రాజ్ చట్టంలో సవరణలు చేస్తూ ఆర్డినెన్స్ జారీ చేయడానికి ప్రభుత్వం సన్నాహాలు చేస్తోంది. ఈ ఆర్డినెన్స్ గవర్నర్ ఆమోదం కోసం పంపారు.

Related Posts

Kaleshwaram Project: కాళేశ్వరం ప్రాజెక్టుపై సీబీఐ విచారణ.. ప్రభుత్వం సంచలన నిర్ణయం

కాళేశ్వరం ప్రాజెక్టు(Kaleshwaram Project) నిర్మాణంలో అక్రమాలు జరిగాయని ఆరోపించిన కాంగ్రెస్ సర్కార్(Congress Govt).. అందుకోసం జస్టిస్ పీసీ ఘోష్(Justice PC Ghosh) కమిషన్‌ను ఏర్పాటు చేసిన విషయం తెలిసిందే. దీనిపై కమిషన్ దాదాపు 650 పేజీలతో కూడిన నివేదికను ప్రభుత్వానికి అందజేసింది.…

ఆదోని నుంచి సైకిల్‌పై వచ్చిన అభిమానికి మెగాస్టార్ ఇచ్చిన అద్భుతమైన గిఫ్ట్! వీడియో వైరల్..

మెగాస్టార్ చిరంజీవి(Chiranjeevi) పట్ల అభిమానులు చూపించే ప్రేమ మరోసారి బయటపడింది. ఆదోని(Adoni) నుంచి హైదరాబాద్(Hyderadad) వరకు సైకిల్‌పై ఒంటరిగా ప్రయాణించి వచ్చిన మహిళా అభిమాని రాజేశ్వరి(Rajeshwari) అందరినీ కదిలించింది. ఎన్ని కష్టాలు, అడ్డంకులు ఎదురైనా తన ఆరాధ్య నటుడిని చూడాలన్న తపన…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *