తరచూ పారాసిటమాల్ వేస్తున్నారా?.. ఐతే ఈ ముప్పు తప్పదు!

Mana Enadu : తలనొప్పి, జ్వరం (Fever), ఒళ్లు నొప్పులు.. ఇలా ఒంట్లో కాస్త నలతగా అనిపించినా సరే పారాసిటమాల్ మాత్ర (paracetamol) వేసుకుంటారు. కొందరైతే జ్వరం వచ్చేలా ఉందని.. ముందే ఓ మాత్ర వేసి పెట్టుకుంటే బెటర్ అని కూడా భావిస్తూ ట్యాబ్లెట్ వాడుతుంటారు. ఇక చాలా మంది పెద్ద వాళ్లు కీళ్ల నొప్పులకు కూడా ఈ మాత్రమే వినియోగిస్తుంటారు. చాలామంది ఇళ్లలో పారాసిటమాల్.. సర్వరోగ నివారణిలా మారింది. మీరు కూడా చీటికిమాటికి పారాసిటమాల్ వేసుకుంటున్నారా? అయితే మీరు ఈ విషయం కచ్చితంగా తెలుసుకోవాల్సిందే..

సర్వరోగనివారిణి పారాసిటమాల్

సర్వరోగ నివారిణిలా పారాసిటమాల్ (paracetamol Problems) ను వాడటం మానేయాలట. ముఖ్యంగా 65 ఏళ్ల పైబడిన వారు ఈ మాత్రల జోలికి పోకపోవడమే బెటర్ అని నిపుణులు చెబుతున్నారు. పారాసిటమాల్ ను తరచూ వాడటం వల్ల జీర్ణకోశం, గుండె, కిడ్నీ సమస్యలు వస్తాయని బ్రిటన్ కు చెందిన నాటింగ్‌హామ్‌ యూనివర్సిటీ అధ్యయనం తేల్చింది.  “Long-term use of paracetamol and risk of kidney disease: a systematic review and meta-analysis” పేరిట బ్రిటీష్ మెడికల్ జర్నల్​లో ప్రచురితమైన అధ్యయనం ఈ విషయాన్ని తెలిపింది.

పారాసిటమాల్ తో ప్రమాదం

తరచూ పారాసిటమాల్ వాడటం వల్ల జీర్ణాశయ పుండ్ల నుంచి రక్తస్రావం అయ్యే ముప్పు 24 శాతం ఉందని ఈ అధ్యయనంలో తేలింది. అంతే కాకుండా పేగుల్లో రక్తస్రావం అయ్యే ముప్పు 36 శాతం పెరుగుతున్నట్లు బయటపడింది. 19 శాతం కిడ్నీజబ్బులు (Kidney Issues), 7 శాతం అధిక రక్తపోటు, 9 శాతం  గుండె (Heart Problems) వైఫల్యమయ్యే అవకాశాలున్నట్లు ఈ అధ్యయనం తేల్చింది. పారాసిటమాల్‌ కీళ్ల నొప్పిని తగ్గించదని.. నొప్పులకు అసలు కారణమేంటన్నది తెలుసుకొని, అవసరమైన మందులు వాడితే మంచి ఫలితం ఉంటుందని నిపుణులు సూచిస్తున్నారు.

Related Posts

Kaleshwaram Project: కాళేశ్వరం ప్రాజెక్టుపై సీబీఐ విచారణ.. ప్రభుత్వం సంచలన నిర్ణయం

కాళేశ్వరం ప్రాజెక్టు(Kaleshwaram Project) నిర్మాణంలో అక్రమాలు జరిగాయని ఆరోపించిన కాంగ్రెస్ సర్కార్(Congress Govt).. అందుకోసం జస్టిస్ పీసీ ఘోష్(Justice PC Ghosh) కమిషన్‌ను ఏర్పాటు చేసిన విషయం తెలిసిందే. దీనిపై కమిషన్ దాదాపు 650 పేజీలతో కూడిన నివేదికను ప్రభుత్వానికి అందజేసింది.…

ఆదోని నుంచి సైకిల్‌పై వచ్చిన అభిమానికి మెగాస్టార్ ఇచ్చిన అద్భుతమైన గిఫ్ట్! వీడియో వైరల్..

మెగాస్టార్ చిరంజీవి(Chiranjeevi) పట్ల అభిమానులు చూపించే ప్రేమ మరోసారి బయటపడింది. ఆదోని(Adoni) నుంచి హైదరాబాద్(Hyderadad) వరకు సైకిల్‌పై ఒంటరిగా ప్రయాణించి వచ్చిన మహిళా అభిమాని రాజేశ్వరి(Rajeshwari) అందరినీ కదిలించింది. ఎన్ని కష్టాలు, అడ్డంకులు ఎదురైనా తన ఆరాధ్య నటుడిని చూడాలన్న తపన…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *