KKR vs LSG: మార్ష్, పూరన్ విధ్వంసం.. KKRపై లక్నో విజయం

కోల్‌క‌తాలోని ఈడెన్ గార్డెన్స్ వేదిక‌గా జ‌రిగిన ఐపీఎల్ 21వ మ్యాచ్‌లో ల‌క్నో సూప‌ర్ జెయింట్స్ సూపర్(LSG) విక్టరీ సాధించింది. భారీ స్కోర్లు నమోదైన ఈ మ్యాచులో లక్నో 12 పరుగుల తేడాతో జయభేరి మోగించింది. టాస్ ఓడి బ్యాటింగ్‌కు దిగిన లక్నో బ్యాటర్లు బ్యాట‌ర్లు కోల్‌క‌తా నైట్ రైడ‌ర్స్ (KKR) బౌల‌ర్ల‌ను ఊచ‌కోత కోశారు. దీంతో ల‌క్నో నిర్ణీత 20 ఓవ‌ర్ల‌లో 3 వికెట్ల‌కు 238 ప‌రుగుల భారీ స్కోర్ న‌మోదు చేసింది. ల‌క్నోకు ఓపెన‌ర్లు మార్క్‌క్ర‌మ్, మిచెల్ మార్ష్ ఏకంగా 99 ప‌రుగుల భాగ‌స్వామ్యం అందించారు. వేగంగా ఆడే క్ర‌మంలో మార్క్‌క్ర‌మ్ (28 బంతుల్లో 47) ప‌రుగులు చేసి తృటిలో హాఫ్ సెంచ‌రీ చేజార్చుకున్నాడు.

Image

పూర‌న్‌, మార్ష్ తుఫాన్ ఇన్నింగ్స్‌

ఆ త‌ర్వాత క్రీజులోకి వ‌చ్చిన నికోల‌స్ పూర‌న్‌ (36 బంతుల్లో 87) రన్స్, మార్ష్ (41 బంతుల్లో 81) పరుగులతో విధ్వంసం సృష్టించారు. వ‌రుస బౌండ‌రీల‌తో కేకేఆర్ బౌల‌ర్ల‌పై విరుచుకుప‌డ్డారు. ముఖ్యంగా మార్ష్ తుఫాన్ ఇన్నింగ్స్‌లో 5 సిక్స‌ర్లు, 6 ఫోర్లు ఉన్నాయి. వీరిద్దరి విధ్వంసంతో లక్నో 238/3 భారీ స్కోరు సాధించింది. కోల్‌క‌తా బౌల‌ర్ల‌లో హ‌ర్షిత్ రాణా 2 వికెట్లు తీయగా, ఆండ్రీ ర‌స్సెల్ ఒక వికెట్ ప‌డ‌గొట్టాడు.

ఛేదనలో వారిద్దరే..

అనంతరం భారీ లక్ష్య ఛేదనలో నైట్‌రైడర్స్ ధాటిగానే ఇన్నింగ్స్‌ను ప్రారంభించింది. ఓపెనర్లు డికాక్ (15), నరైన్ (30) రన్స్‌తో స్కోరు బోర్డును పరుగులు పెట్టించారు. ఆ తర్వాత కెప్టెన్ రహానే (35 బంతుల్లో 61), వెంకటేశ్ అయ్యర్ (29 బంతుల్లో 45) చెలరేగినా వీరికి మిగతా బ్యాటర్ల సహకారం దక్కలేదు. చివర్లో రింకూ సింగ్ (15 బంతుల్లో 38) రన్స్‌తో మెరుపులు మెరిపించినా నిర్ణీత ఓవర్లలో 234/7 పరుగులకే పరిమితమైంది. దీంతో లక్నో 4 రన్స్ తేడాతో విక్టరీ కొట్టింది. లక్నో బౌలర్లలో ఆకాశ్, శార్దూల్ చెరో 2 వికెట్లు తీయగా, అవేశ్, దిగ్వేశ్, బిష్ణోయ్ తలో వికెట్ పడగొట్టారు.

Related Posts

Kaleshwaram Project: కాళేశ్వరం ప్రాజెక్టుపై సీబీఐ విచారణ.. ప్రభుత్వం సంచలన నిర్ణయం

కాళేశ్వరం ప్రాజెక్టు(Kaleshwaram Project) నిర్మాణంలో అక్రమాలు జరిగాయని ఆరోపించిన కాంగ్రెస్ సర్కార్(Congress Govt).. అందుకోసం జస్టిస్ పీసీ ఘోష్(Justice PC Ghosh) కమిషన్‌ను ఏర్పాటు చేసిన విషయం తెలిసిందే. దీనిపై కమిషన్ దాదాపు 650 పేజీలతో కూడిన నివేదికను ప్రభుత్వానికి అందజేసింది.…

ఆదోని నుంచి సైకిల్‌పై వచ్చిన అభిమానికి మెగాస్టార్ ఇచ్చిన అద్భుతమైన గిఫ్ట్! వీడియో వైరల్..

మెగాస్టార్ చిరంజీవి(Chiranjeevi) పట్ల అభిమానులు చూపించే ప్రేమ మరోసారి బయటపడింది. ఆదోని(Adoni) నుంచి హైదరాబాద్(Hyderadad) వరకు సైకిల్‌పై ఒంటరిగా ప్రయాణించి వచ్చిన మహిళా అభిమాని రాజేశ్వరి(Rajeshwari) అందరినీ కదిలించింది. ఎన్ని కష్టాలు, అడ్డంకులు ఎదురైనా తన ఆరాధ్య నటుడిని చూడాలన్న తపన…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *