పెళ్లైన పది రోజులకే.. భార్యను అడవిలో వదిలి‌ వెళ్లిన భర్త

Mana Enadu : సిద్దిపేట జిల్లాలో దారుణ ఘటన వెలుగులోకి వచ్చింది. పెళ్లయ్యి పట్టుమని పది రోజులు కూడా కాకముందే గొడవల కారణంగా భార్యను ఓ భర్త అడవిలో వదిలేసి వెళ్లిపోయాడు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. మహారాష్ట్రకు చెందిన విక్రమ్‌ మన్వర్‌ అనే వ్యక్తి ఉద్యోగ రీత్యా బెంగళూరులో నివాసం ఉంటున్నాడు. అక్కడే రబియా అనే యువతితో అతడికి పరిచయం ఏర్పడింది. అది కాస్తా ప్రేమగా మారటంతో ఈనెల 4న విక్రమ్​ మన్వర్, రబియా వివాహం చేసుకున్నారు. అయితే పెళ్లి చేసుకున్న మరుసటి రోజు నుంచే వీరిద్దరి మధ్య విభేదాలు తలెత్తాయి.

రెండ్రోజుల క్రితం వీరు హైదరాబాద్​కు వచ్చారు. ఇక్కడ కూడా వారి మధ్య గొడవ జరిగింది. దీంతో మనస్తాపానికి గురైన రబియా చనిపోవాలని నిర్ణయించుకుంది. శనివారం ఉదయం పెయిన్‌ కిల్లర్‌ ట్యాబ్​లెట్స్​ మింగింది. దీంతో ఆందోళన చెందిన భర్త విక్రమ్ మన్వర్.. రబియాను కారులో సిద్దిపేట జిల్లా ములుగు మండలంలోని వంటిమామిడి వద్దకు తీసుకొచ్చి అక్కడి ఫారెస్ట్‌లో వదిలేసి పారిపోయాడు. (man leaves wife in forest).

తీవ్ర అనారోగ్యంతో ఉన్న రబియాను గమనించిన స్థానికులు వెంటనే పోలీసులకు సమాచారం అందించారు. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు రబియాను సిద్దిపేటలోని ఓ హాస్పిటల్‌కు తరలించారు. రబియా నుంచి వివరాలు సేకరించి ఆమె తల్లిదండ్రులకు సమాచారం అందజేశారు. వారు ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు విచారణ చేపట్టారు.

Related Posts

Hyderabad Crime: దారుణం.. ప్రెగ్నెంట్ అయిన భార్యను ముక్కలుగా నరికిన భర్త

హైదరాబాద్‌లోని మేడిపల్లి(Medipally) పరిధి బాలాజీహిల్స్‌(Balaji Hills)లో దారుణ ఘటన చోటుచేసుకుంది. గర్భవతియైన భార్య జ్యోతి(25)ని భర్త మహేందర్ రెడ్డి(Mahendar Reddy) కిరాతకంగా హత్య చేసి, ఆమె మృతదేహాన్ని ముక్కలుగా చేశాడు. వికారాబాద్ జిల్లా కామారెడ్డిగూడకు చెందిన ఈ దంపతులు ప్రేమ వివాహం…

Road Accident: ఘోర రోడ్డు ప్రమాదం.. ఇద్దరు డీఎస్పీలు మృతి

తెలంగాణలోని యాదాద్రి జిల్లా(Yadadri District) చౌటుప్పల్‌ మండలం ఖైతాపూర్‌ వద్ద ఘోర రోడ్డు ప్రమాదం(Road accident) జరిగింది. స్కార్పియో కారు అదుపుతప్పి లారీ(Lorry)ని ఢీకొన్న ప్రమాదంలో ఇద్దరు మృతి చెందగా, మరో ఇద్దరికి తీవ్ర గాయాలయ్యాయి. మృతులు ఇద్దరూ ఏపీ(Andhra pradesh)కి…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *