ఆస్తి తగాదాలతో రంగారెడ్డి కలెక్టరేట్​కు మోహన్ బాబు, మనోజ్

టాలీవుడ్ లో ఇటీవల మంచు ఫ్యామిలీ వివాదం (Manchu Family Fight) హాట్ టాపిక్ గా మారిన విషయం తెలిసిందే. ముఖ్యంగా మంచు మోహన్ బాబు, మనోజ్ ల మధ్య వైరం తీవ్ర చర్చనీయాంశమైంది. ఆస్తి తగాదాల నేపథ్యంలో తాజాగా మోహన్ బాబు (Mohan Babu), మంచు మనోజ్ రంగారెడ్డి కలెక్టర్ కార్యాలయానికి చేరుకుని విచారణకు హాజరయ్యారు.

అసలేం జరిగిందంటే?

తాను సంపాదించిన ఇల్లు, ఆస్తులు మంచు మనోజ్ (Manchu Manoj) ఆక్రమించారంటూ రంగారెడ్డి జిల్లా కలెక్టర్​కు ఫిర్యాదు చేసిన మోహన్​బాబు.. తల్లిదండ్రులు, వృద్ధులు, సంరక్షణ, పోషణ చట్టం కింద తనకు రక్షణ కల్పించాలని కోరారు. బాలాపూర్ మండలం జల్​పల్లి గ్రామంలో తానుంటున్న ఇంట్లోకి అక్రమంగా ప్రవేశించారని, ఆస్తులు కావాలంటూ డిమాండ్ చేస్తున్నారని తన ప్రతినిధులతో పంపిన ఫిర్యాదు లేఖలో పేర్కొన్నారు.

కలెక్టరేట్ కు మంచు ఫ్యామిలీ 

ఇక మోహన్​ బాబు ఫిర్యాదుకు స్పందించిన రెవెన్యూ అధికారులు సదరు చట్టం ప్రకారం మంచు మనోజ్​కు వారం క్రితం నోటీసులు పంపగా.. జనవరి 19న ఆయన కొంగరకలాన్​లోని కలెక్టరేట్​కు వచ్చారు. ఇక తాజాగా ఇదే కేసులో మంచు కుటుంబ సభ్యులు (Manchu Family Controversy) ఇవాళ రంగారెడ్డి కలెక్టరేట్ లో విచారణకు హాజరయ్యారు.

నా పోరాటం వారి కోసమే..

తమ విద్యాసంస్థలు, ట్రస్ట్​లో విద్యార్థులకు అన్యాయం జరుగుతోందని వ్యతిరేకించినందుకే అన్నయ్య మంచు విష్ణు (Manchu Vishnu).. తండ్రి మోహన్​బాబును అడ్డుపెట్టుకుని నాటకమాడుతున్నారని మంచు మనోజ్ గతంలో ఆరోపించిన విషయం తెలిసిందే. తమ వద్ద డబ్బుల్లేవ్ అంటున్న తండ్రి, అన్నయ్యలు రూ.వందల కోట్ల బడ్జెట్​తో సినిమాలు ఎలా తీస్తున్నారని ప్రశ్నించారు. తన పోరాటం విద్యార్థులు, బంధువుల కోసమే కానీ..  ఆస్తుల కోసం కాదని స్పష్టం చేశారు.

Related Posts

Kaleshwaram Project: కాళేశ్వరం ప్రాజెక్టుపై సీబీఐ విచారణ.. ప్రభుత్వం సంచలన నిర్ణయం

కాళేశ్వరం ప్రాజెక్టు(Kaleshwaram Project) నిర్మాణంలో అక్రమాలు జరిగాయని ఆరోపించిన కాంగ్రెస్ సర్కార్(Congress Govt).. అందుకోసం జస్టిస్ పీసీ ఘోష్(Justice PC Ghosh) కమిషన్‌ను ఏర్పాటు చేసిన విషయం తెలిసిందే. దీనిపై కమిషన్ దాదాపు 650 పేజీలతో కూడిన నివేదికను ప్రభుత్వానికి అందజేసింది.…

ఆదోని నుంచి సైకిల్‌పై వచ్చిన అభిమానికి మెగాస్టార్ ఇచ్చిన అద్భుతమైన గిఫ్ట్! వీడియో వైరల్..

మెగాస్టార్ చిరంజీవి(Chiranjeevi) పట్ల అభిమానులు చూపించే ప్రేమ మరోసారి బయటపడింది. ఆదోని(Adoni) నుంచి హైదరాబాద్(Hyderadad) వరకు సైకిల్‌పై ఒంటరిగా ప్రయాణించి వచ్చిన మహిళా అభిమాని రాజేశ్వరి(Rajeshwari) అందరినీ కదిలించింది. ఎన్ని కష్టాలు, అడ్డంకులు ఎదురైనా తన ఆరాధ్య నటుడిని చూడాలన్న తపన…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *