
నిజామాబాద్ కేంద్ర కారాగారాన్ని జైళ్ల శాఖ డీజీ సౌమ్య మిశ్రా (DG Sowmya Mishra) సందర్శించారు. ఈ సందర్శనలో ఆమె కొత్తగా ఏర్పాటు చేసిన వీ వింగ్ యూనిట్ ను ప్రారంభించారు. వరంగల్ కేంద్ర కారాగారంలోని వీ వింగ్ యూనిట్, జైలు కూల్చిన సమయంలో మూసివేయగా.. అక్కడి యంత్రాలను చెర్లపల్లి సెంట్రల్ జైలుకు తరలించారు.
చెర్లపల్లి యంత్రాలు నిజామాబాద్
ఇక 2021లో నిజామాబాద్ జైలును కేంద్ర కారాగారంగా అభివృద్ధి చేసి, అప్పటి నుంచి స్టీల్ ఇండస్ట్రీ యూనిట్, ముద్రణ యూనిట్, దర్జీ విభాగం, ఫినైల్ తయారీ విభాగాన్ని నిర్వహిస్తున్నారు. డైరెక్టర్ జనరల్గా బాధ్యతలు స్వీకరించిన తర్వాత సౌమ్య మిశ్రా వీ-వింగ్ యూనిట్ను నిజామాబాద్ కేంద్ర కారాగారంలో ఏర్పాటు చేయాలని సిఫార్సు చేశారు. ఇందుకోసం చెర్లపల్లి నుంచి వీ-వింగ్ యంత్రాలను నిజామాబాద్కు తరలించారు.
13 వీవింగ్ యంత్రాలు.. 26 మంది ఖైదీలు
ఈ యూనిట్ ప్రారంభమైన తర్వాత ఖైదీల వస్త్రాలు, టవెల్స్, రుమాలు, బెడ్షీట్లు వంటివి తయారు చేయనున్నారు. ఇవి వరంగల్ రేంజ్లోని అన్ని జైల్లకు సరఫరా చేయడంతో పాటు ప్రజలకు విక్రయించనున్నారు. ఈ యూనిట్లో 13 వీవింగ్ యంత్రాలతో 26 మంది ఖైదీలు పనిచేయనున్నారు.
నిజామాబాద్ కేంద్ర కారాగారాన్ని సందర్శించిన తర్వాత డీజీ సౌమ్య మిశ్రా.. కామారెడ్డి సబ్-జైలును కూడా సందర్శించారు. ఈ ఈ కార్యక్రమంలో ఎం. సంపత్, డీఐజీ ప్రిజన్స్, వరంగల్ రేంజ్, సింధు శర్మ, ఐపీఎస్, ఇన్ఛార్జ్ పోలీస్ కమిషనర్, నిజామాబాద్, పి. సాయికిరణ్, ఐపీఎస్ ట్రెయినీ, శ్రీ ఆనందరావు, నిజామాబాద్ కేంద్ర కారాగారం సూపరింటెండెంట్ పాల్గొన్నారు.