మైనంపల్లి పాదయాత్ర..కమలం కోసమేనా..?

 

మంత్రి హరీష్​రావుపై సంచలన వ్యాఖ్యలు చేసి ఉభయ తెలుగు రాష్ట్రాల్లో హట్​ టాఫిక్​గా మారారు. సీఎం కేసీఆర్​ ప్రకటించిన జాబితాలో మల్కాజిగిరి టిక్కెట్​ మైనంపల్లికే కేటాయిస్తున్నట్లు ప్రకటించారు. కానీ కవిత, కేటీఆర్​, హరీష్​రావు ఒత్తిడితో అభ్యర్థి మార్పులో అనివార్యమైంది. మెదక్​ సీటును తన కుమారుడు రోహిత్​ను రంగంలోకి దింపాలని అనుకున్నారు. కానీ బీఆర్​ఎస్​ సీటు రాకుండా మంత్రి హరీష్​రావు అడ్డుకున్నారని విమర్శలు చేసిన విషయం తెలిసిందే..

మల్కాజిగిరి ముఖ్య కార్యకర్తలతో సమావేశం ఏర్పాటు చేశారు. భవిష్యత్తు కార్యాచరణలో వారం రోజుల్లో ప్రకటిస్తానని చెప్పారు. ప్రజల్లోనే ఉంటాను ప్రజల కోసం పనిచేస్తానని అన్నారు. కానీ రోహిత్​కి మెదక్​లో టిక్కెట్​ ఇచ్చేందుకు ఓ జాతీయపార్టీ ముందుకొచ్చిందని రాజకీయవర్గాల్లో వినిపిస్తుంది.

బీజేపీ హమీతోనే పాదయాత్రకు సిద్దం..?

మల్కాజిగిరిలో ఎమ్మెల్యే మైనంపల్లి హన్మంతరావు పాదయాత్ర చేసేందుకు సిద్దం అయ్యారు. ఓ వైపు కాంగ్రెస్​ పార్టీ నుంచి పిలుపు వచ్చిందనే వార్తలు వినిపిస్తున్నాయి. కానీ రెండు చోట్ల టిక్కెట్​ ఇచ్చేందుకు బీజేపీ మొగ్గు చూపించినట్లు తెలుస్తుంది. మల్కాజిగిరి టిక్కెట్​ ఇచ్చేందుకు పార్టీ పెద్దలు  క్లారీటీ ఇచ్చారని సమాచారం.

బీఆర్​ఎస్​ నాయకులు ఎదురుదాడి

మరోవైపు బీఆర్​ఎస్​ నాయకులు మైనంపల్లి మంత్రి హరీష్​రావుపై చేసిన వ్యాఖ్యలపై నిరసనలు చేస్తున్నారు. మరోవైపు మైనంపల్లి అనుచరులు బీఆర్​ఎస్​ నాయకులపై సోషల్​ మీడియా వేదికగా విమర్శలు చేస్తున్నారు. గ్రేటర్​ హైదరాబాద్​లో ఇప్పటికే 50డివిజన్లలో బీజేపీ సత్తా చాటింది. ఈక్రమంలోనే మహనగరంలో ఈసారి కారుకే కష్టమేనని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. కమలం…కాంగ్రెస్​ మధ్యనే పోటీ ఉండబోతుందనేది స్పష్టంగా చెబుతున్నారు.

 

  • Related Posts

    HCU వివాదం.. మాజీ సీఎం కేసీఆర్ కీలక ప్రకటన

    ప్రస్తుతం తెలంగాణలో తీవ్ర చర్చనీయాంశమవుతున్న అంశం HCU భూముల వివాదం. రంగారెడ్డి జిల్లా శేర్లింగంపల్లిలోని కంచ గచ్చిబౌలి 400 ఎకరాల (Kancha Gachibowli Land Issue) విషయం ఇప్పుడు రాష్ట్రంలో తీవ్ర దుమారం రేపుతోంది. ఈ విషయంపై తాజాగా ముఖ్యమంత్రి రేవంత్…

    PM Modi: శ్రీలంకకు చేరుకున్న మోదీ.. రేపు ఆ దేశాధ్యక్షుడితో భేటీ

    భారత ప్రధాని నరేంద్ర మోదీ(PM Modi) విదేశీ పర్యటన కొనసాగుతోంది. రెండు రోజుల పాటు థాయ్‌లాండ్‌(Thailand)లో పర్యటించిన ఆయన.. 3 రోజుల పర్యటన నిమిత్తం శ్రీలంక(Srilanka)కు వెళ్లారు. శుక్రవారం రాత్రి కొలొంబో(Colombo)కి చేరుకున్న ఆయనకు శ్రీలంక మంత్రులు ఘనస్వాగతం పలికారు. కాగా…

    Leave a Reply

    Your email address will not be published. Required fields are marked *