
హైదరాబాద్ జిల్లా స్థానిక సంస్థల ఎమ్మెల్సీ(Hyderabad Local Body MLC Elections) ఎన్నికల్లో MIM పార్టీ ఘన విజయం సాధించింది. శుక్రవారం ఉదయం 8 గంటలకు కౌంటింగ్ ప్రారంభించిన అధికారులు.. గంటన్నర వ్యవధిలోనే ఫలితాన్ని ప్రకటించారు. ఈ ఎన్నికల్లో MIM పార్టీ అభ్యర్థి మీర్జా రియాజ్ ఉల్ హసన్ ఎఫెండి(Mirza Riyaz Ul Hassan Effendi)కి 63 ఓట్లు సాధించగా.. బీజేపీ అభ్యర్థి గౌతమ్ రావు(Gautham Rao)కు 25 ఓట్లు వచ్చాయి. దీంతో 38 ఓట్ల తేడాతో ఎంఐఎం గెలిచింది. కాగా ఈ ఎన్నికల్లో మొత్తం 78.57% పోలింగ్ నమోదైంది. మొత్తం 112 ఓట్లకు గాను 88 ఓట్లు పోలయ్యాయి. ఇందులో 66 మంది కార్పొరేటర్లు, 22 మంది ఎక్స్-అఫీషియో సభ్యులు తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు.
కాగా GHMC ప్రధాన కార్యాలయంలో ఈనెల 23న ఉదయం 8 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకూ పోలింగ్(Polling) నిర్వహించారు. ఈసారి ఎన్నికల్లో కాంగ్రెస్, BRS పోటీకి దూరంగా ఉండటంతో BJP, MIM మధ్యే ఈ పోరు జరిగింది. బీజేపీ అభ్యర్థి గౌతంరావు, MIM అభ్యర్థి మీర్జా రియాజ్ ఉల్ హసన్లలో ఒకరి ఎన్నిక కోసం పోలింగ్ జరిగింది.