Miss World Contestants: అందాల భామల పాదాలు కడిగిన వీడియోపై రచ్చ

అందాల భామల(Miss World Contestants) పాదాలు కడిగిన వీడియో(Foot washing video) ఇప్పుడు పెద్ద దుమారమే రేపుతోంది. దీనిపై ఇటు అధికార కాంగ్రెస్(Congress), ప్రతిపక్ష BRS పార్టీల మధ్య మాటల యుద్ధమే నడుస్తోంది. హైదరాబాద్‌ కేంద్రంగా ప్రపంచ సుందరీమణుల పోటీలు(Miss World pageants 2025) జరుగుతున్న విషయం తెలిసిందే. మిస్ వరల్డ్ కంటెస్టెంట్లు బుధవారం వరంగల్‌ జిల్లా(Warangal District)లో పర్యటించారు. అలాగే ములుగు జిల్లా వెంకటాపూర్ మండలం పాలంపేటలోని రామప్ప దేవాలయ(Ramappa Temple) సందర్శనకు వెళ్లారు. వీళ్లంతా సంప్రదాయం ప్రకారం కట్టు, బొట్టుతో కనిపించారు. గుడిలోకి వెళ్లే ముందు కాళ్లు కడుక్కునేందుకు అధికారులు కుర్చీలు, ఇత్తడి తాంబాలాలను ఏర్పాటు చేశారు.

సీఎం పూర్తిగా మతితప్పాడంటూ వ్యాఖ్యలు

తెలంగాణ ఆడ బిడ్డలు వాళ్లకు చెంబుల్లో నీళ్లు అందించారు. ఆ తర్వాత టవల్ ఇచ్చారు. ఇప్పుడు ఇదే పెద్ద వివాదంగా మారింది.
సోషల్ మీడియా(SM)లో ఈ వీడియో వైరల్‌గా మారింది. తెలంగాణ ఆడపడుచుల ఆత్మగౌరవాన్ని దెబ్బతీసేలా అందాల భామల కాళ్లు కడిగిస్తారా? అంటూ BRS నాయకులు తీవ్ర స్థాయిలో మండిపడుతున్నారు. దీనిపై BRS వర్కింగ్ ప్రెసిడెంట్ KTR కూడా స్పందించారు. కాంగ్రెస్ సీఎం పూర్తిగా మతితప్పాడంటూ ఘాటు వ్యాఖ్యలు చేశారు.

BRS ఆత్మగౌరవం గురించి మాట్లాడటమా?

అలాగే మాజీ మహిళా మంత్రి సబితా ఇంద్రారెడ్డి(Sabita Indra Reddy) కూడా స్పందించారు. రుద్రమదేవి, సమ్మక్క సారాలక్క లాంటి వీర వనితలు పుట్టిన నేలపై తెలంగాణ ఆడబిడ్డలకు ఘోర అవమానం జరిగిందన్నారు. దీంతో BRS నేతలకు కాంగ్రెస్ పార్టీ నేతలు కౌంటర్ ఇస్తున్నారు. కలెక్టర్లతో కాళ్లు మొక్కించుకున్న BRS ఆత్మగౌరవం గురించి మాట్లాడటమా? అని ప్రశ్నించారు. దీంతో అసలు అక్కడ జరిగిందేంటో తెలిపేలా కాంగ్రెస్ వీడియోలను సోషల్ మీడియాలో షేర్ చేశాయి.

Related Posts

Kaleshwaram Project: కాళేశ్వరం ప్రాజెక్టుపై సీబీఐ విచారణ.. ప్రభుత్వం సంచలన నిర్ణయం

కాళేశ్వరం ప్రాజెక్టు(Kaleshwaram Project) నిర్మాణంలో అక్రమాలు జరిగాయని ఆరోపించిన కాంగ్రెస్ సర్కార్(Congress Govt).. అందుకోసం జస్టిస్ పీసీ ఘోష్(Justice PC Ghosh) కమిషన్‌ను ఏర్పాటు చేసిన విషయం తెలిసిందే. దీనిపై కమిషన్ దాదాపు 650 పేజీలతో కూడిన నివేదికను ప్రభుత్వానికి అందజేసింది.…

ఆదోని నుంచి సైకిల్‌పై వచ్చిన అభిమానికి మెగాస్టార్ ఇచ్చిన అద్భుతమైన గిఫ్ట్! వీడియో వైరల్..

మెగాస్టార్ చిరంజీవి(Chiranjeevi) పట్ల అభిమానులు చూపించే ప్రేమ మరోసారి బయటపడింది. ఆదోని(Adoni) నుంచి హైదరాబాద్(Hyderadad) వరకు సైకిల్‌పై ఒంటరిగా ప్రయాణించి వచ్చిన మహిళా అభిమాని రాజేశ్వరి(Rajeshwari) అందరినీ కదిలించింది. ఎన్ని కష్టాలు, అడ్డంకులు ఎదురైనా తన ఆరాధ్య నటుడిని చూడాలన్న తపన…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *