Helicopter Crash: మరో గగనతల ప్రమాదం.. ఉత్తరాఖండ్‌లో కుప్పకూలిన హెలికాప్టర్

వరుస గగనతల ప్రమాదాలు (Air accidents) ప్రయాణికులను ఆందోళనకు గురిచేస్తున్నాయి. గత గురువారం అహ్మదాబాద్‌లో ఎయిరిండియా విమానం కూలిపోయిన(AirIndia Plane Crash) సంగతి తెలిసిందే. ఈ విషాద ఘటనలో మొత్తం 274 మంది మరణించారు. ఈ దుర్ఘటనలో మృతులను ఇంకా గుర్తు పట్టలేదు. అటు విమానం కూలిన ప్రాంతంలో దాని శిథిలాలను ఇంకా తొలగించలేదు. ఈ పెను విషాదాన్ని మరువక ముందే ఉత్తరాఖండ్‌లో మరో గగనతల ప్రమాదం జరిగింది. ఆదివారం తెల్లవారుజామున ఉత్తరాఖండ్‌(Uttarakhand)లోని గౌరీకుండ్‌లో హెలికాప్టర్ కుప్పకూలింది(helicopter crashed). ఈ ఘటనలో పైలట్ సహా ఏడుగురు దుర్మరణం చెందారు.

సాంకేతిక సమస్య తలెత్తడంతో..

వివరాళ్లోకి వెళ్తే… ఆదివారం తెల్లవారుజామున 5:20 గంటలకు ఉత్తరాఖండ్, ఉతరప్రదేశ్, గుజరాత్, మహారాష్ట్రకు చెందిన ఆరుగురు యాత్రికులతో హెలికాప్టర్ గుప్తకాశీ నుంచి కేదార్‌నాథ్‌(Kedharnath)కు బయలుదేరింది. ఆ సమయంలో సాంకేతిక సమస్య(Technical problem) తలెత్తడంతో పాటు వాతావరణం అనుకూలించకపోవడంతో 10 నిమిషాల్లోనే కుప్పకూలిందని అధికారులు తెలిపారు.ఈ మేరకు ఉత్తరాఖండ్ పౌర విమానయాన అభివృద్ధి అథారిటీ (UCADA) ఈ వివరాలు వెల్లడించింది.

ఉత్తరాఖండ్ సీఎం తీవ్ర దిగ్భ్రాంతి

హెలికాప్టర్ కుప్పకూలిందన్న్న సమాచారం అందుకున్న అధికారులు, జాతీయ విపత్తు ప్రతిస్పందన దళం (NDRF), రాష్ట్ర విపత్తు ప్రతిస్పందన దళం (SDRF) బృందాలు ప్రమాద స్థలానికి చేరుకొని సహాయక చర్యలు చేపట్టాయి. ఈ ఘటనపై ఉత్తరాఖండ్ సీఎం పుష్కర్ సింగ్ ధామి(CM Pushkar Singh Dhami) తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా ప్రమాద స్థలంలో సహాయక చర్యల(Assistive measures)ను మరింత వేగవంత చేయాలన్ని అధికారులను ఆదేశించారు. కాగా, మే 2న కేదార్‌‌నాథ్‌ ద్వారాలు తెరుచుకున్నప్పటి నుంచి ఇది ఐదో ప్రమాదం కావడం గమనార్హం.

Related Posts

Allu Kanakaratnamma: అల్లు అర్జున్ ఇంట విషాదం.. అల్లు కనకరత్నమ్మ కన్నుమూత

టాలీవుడ్‌(Tollywood)లో ప్రముఖ నిర్మాత, గీతా ఆర్ట్స్ అధినేత అల్లు అరవింద్(Allu Aravind) ఇంట తీవ్ర విషాదం నెలకొంది. ఆయన తల్లి, దివంగత హాస్య నటుడు అల్లు రామలింగయ్య భార్య అల్లు కనకరత్నమ్మ (Allu Kanakaratnamma, 94) శనివారం తెల్లవారుజామున 1:45 గంటలకు…

Road Accident: పుణ్యక్షేత్రానికి వెళ్తుండగా ప్రమాదం.. 8 మంది మృతి

ఉత్తరప్రదేశ్‌(UP)లోని బులంద్‌శహర్-అలీగఢ్ సరిహద్దు(Bulandshahr-Aligarh border)లో సోమవారం (ఆగస్టు 25) తెల్లవారుజామున 2:15 గంటల సమయంలో ఘోర రోడ్డు(Road Accident) ప్రమాదం జరిగింది. రాజస్థాన్‌లోని జహర్‌పీర్ (గోగాజీ) పుణ్యక్షేత్రానికి యాత్రికులతో వెళ్తున్న ట్రాక్టర్ ట్రాలీ(Tractor trolley)ని వెనుక నుంచి వేగంగా వచ్చిన కంటైనర్…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *