Ramayana: రూ.4000 వేల కోట్ల బడ్జెట్‌తో ‘రామాయణ’ మూవీ: నిర్మాత నమిత్ మల్హోత్రా

భారతీయ సినిమా చరిత్రలో అత్యంత ఖరీదైన చిత్రంగా రూపొందుతున్న ‘రామాయణ (Ramayana)’ సినిమా గురించి ఇటీవల వెల్లడైన వార్తలు సంచలనం రేపుతున్నాయి. ఈ రెండు భాగాల సినిమాటిక్ ఎపిక్‌ను నిర్మిస్తున్న ప్రముఖ నిర్మాత నమిత్ మల్హోత్రా (Producer Namit Malhotra) ఈ చిత్ర బడ్జెట్(Budget) గురించి మాట్లాడారు. ఈ మూవీని భారీ బడ్జెట్‌తో ఇండియన్ సినీ హిస్టరీలోనే కనీవినీ ఎరుగని రీతిలో తెరకెక్కిస్తున్నామన్నారు. ఈ మూవీ కోసం సుమారు $500 మిలియన్లు అంటే దాదాపు రూ.4000 కోట్లు అని ఒక పాడ్‌కాస్ట్‌ (Podcast)లో వెల్లడించారు. ఇది భారతదేశంలో ఇప్పటివరకు నిర్మితమైన అత్యంత ఖరీదైన చిత్రంగా నిలుస్తుంది ఆయన పేర్కొన్నారు.

హాలీవుడ్ రేంజ్‌లో విజువల్ ఎఫెక్ట్స్

కాగా నితేష్ తివారీ (Nitesh Tiwari) దర్శకత్వంలో రూపొందుతున్న ఈ చిత్రంలో రణ్‌బీర్ కపూర్ (Ranbir kapoor) శ్రీరాముడిగా, సాయి పల్లవి (Sai Pallavi) సీతగా, యశ్ (Yash) రావణుడిగా, సన్నీ డియోల్ (Sunny Deol) హనుమంతుడిగా నటిస్తున్నారు. నమిత్ మల్హోత్రా ప్రైమ్ ఫోకస్ స్టూడియోస్ & యశ్ మాన్స్టర్ మైండ్ క్రియేషన్స్ సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నాయి. ఈ సినిమా హాలీవుడ్ (Hollywood) స్థాయి విజువల్ ఎఫెక్ట్స్, హన్స్ జిమ్మర్, ఎ.ఆర్. రెహమాన్ సంగీతంతో ప్రపంచవ్యాప్తంగా ఆకర్షించనుంది.

Ramayan' Starring Ranbir Kapoor Annunciated, Filmmaker, Namit Malhotra Unveils The First Poster

బాక్సాఫీస్ రికార్డులను బద్దలు కొట్టే ఛాన్స్

కాగా ఈ ప్రాజెక్ట్‌ను 2015 నుంచి రూపొందించిన నమిత్ మల్హోత్రా.. భారతీయ సంస్కృతిని ప్రపంచానికి చాటిచెప్పాలనే లక్ష్యంతో ఈ చిత్రాన్ని తీర్చిదిద్దుతున్నారు. “ఇది డబ్బు కోసం కాదు, భారతీయ కథలను ప్రపంచ స్థాయిలో ఆవిష్కరించాలనే ఆకాంక్ష” అని ఆయన పేర్కొన్నారు. కాగా రామాయణం మొదటి భాగం 2026 దీపావళికి రానుండగా.. రెండవ భాగం 2027 దీపావళికి విడుదల కానుంది. ఇప్పటికే రిలీజ్ అయిన ఈ మూవీ గ్లింప్స్ భారీ అంచనాలు పెంచేసింది. దీంతో రామాయణ బాక్సాఫీస్ రికార్డులను బద్దలు కొట్టే అవకాశం ఉందని అంచనా.

Related Posts

Mahesh Babu | వారణాసి ఈవెంట్‌లో రాజమౌళి స్ట‌న్నింగ్ కామెంట్స్

Mahesh Babu | సూపర్ స్టార్ మహేశ్‌బాబు—దర్శకధీరుడు ఎస్‌ఎస్‌ రాజమౌళి కాంబినేషన్‌లో వస్తున్న అత్యంత భారీ యాక్షన్ అడ్వెంచర్ ఫిల్మ్ “వారణాసి” పై ఆసక్తి రోజురోజుకూ పెరుగుతోంది. గ్లోబ్ ట్రోటర్ ఈవెంట్‌లో విడుదలైన స్పెషల్ వీడియోకు ప్రేక్షకుల నుంచి అద్భుత స్పందన…

Kaleshwaram Project: కాళేశ్వరం ప్రాజెక్టుపై సీబీఐ విచారణ.. ప్రభుత్వం సంచలన నిర్ణయం

కాళేశ్వరం ప్రాజెక్టు(Kaleshwaram Project) నిర్మాణంలో అక్రమాలు జరిగాయని ఆరోపించిన కాంగ్రెస్ సర్కార్(Congress Govt).. అందుకోసం జస్టిస్ పీసీ ఘోష్(Justice PC Ghosh) కమిషన్‌ను ఏర్పాటు చేసిన విషయం తెలిసిందే. దీనిపై కమిషన్ దాదాపు 650 పేజీలతో కూడిన నివేదికను ప్రభుత్వానికి అందజేసింది.…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *