
ఎన్టీఆర్ వర్ధంతి (NTR Death Anniversary) సందర్భంగా నందమూరి కుటుంబ సభ్యులు హైదరాబాద్లోని ఎన్టీఆర్ ఘాట్ వద్ద నివాళులు అర్పించారు. బాలకృష్ణ (Balakrishna), రామకృష్ణ, జూనియర్ ఎన్టీఆర్ (NTR), కల్యాణ్ రామ్ లు అంజలి ఘటించిన తర్వా.. నటుడిగా, నాయకుడిగా, సీఎంగా ఆయన చేసిన సేవలను గుర్తుచేసుకున్నారు. మరోవైపు ఎన్టీఆర్ ట్రస్టు భవన్లో మెగా రక్తదాన శిబిరం నిర్వహించనున్నారు. బసవతారకం ఆసుపత్రిలో బాలకృష్ణ ఎన్టీఆర్కు నివాళి అర్పించనున్నారు.
#WATCH | Telangana: TDP leader and actor Nandamuri Balakrishna visits and pays tribute to the former CM of united Andhra Pradesh and Telugu film actor NTR on his 29th death anniversary, in Hyderabad. pic.twitter.com/UDVsikgTAo
— ANI (@ANI) January 18, 2025
నవరసాలకు అలంకారం
“నటనలో ప్రయోగాలు చేసిన నటనా ప్రావీణ్యుడు ఎన్టీఆర్. నటనకు నిర్వచనం.. నవరసాలకు అలంకారం ఎన్టీఆర్. ఆయన ఒక వర్సిటీ.. జాతికి మార్గదర్శకం. ఎన్టీఆర్ లాంటి వారికి మరణం ఉండదు. ఆయన విప్లవాన్ని తీసుకొచ్చారు. కష్టజీవుల కన్నీళ్లు, అన్నార్తుల ఆకలి నుంచి టీడీపీ పుట్టింది. పేదలకు ఉపయోగపడే పథకాలను ఎన్టీఆర్ ప్రవేశపెట్టారు.” అని బాలకృష్ణ అన్నారు.
#WATCH | Hyderabad, Telangana: Junior NTR arrives at NTR ghat and pays tributes to the former CM of united Andhra Pradesh and Telugu film actor NTR on his 29th death anniversary. pic.twitter.com/Cg8Ro7NytZ
— ANI (@ANI) January 18, 2025
యువతకు ఆదర్శం ఎన్టీఆర్
ఎన్టీఆర్ యువతకు ఆదర్శమని బాలకృష్ణ అన్నారు. నాడు 330కి పైగా తాలూకాలను.. 1000కి పైగా మండలాలుగా విభజించి పాలనను సులభతరం చేశారని గుర్తు చేశారు. రెండు రూపాయలకు కిలో బియ్యం తీసుకొచ్చి.. పేదలకు పక్కా ఇళ్లు నిర్మించిన ఆ మహనీయుడు తెలుగువారి గుండెల్లో చిరస్మరణీయంగా నిలిచిపోయారని తెలిపారు. యువత, డాక్టర్లు, ఇంజినీర్లను ఎంతోమందిని ఎన్టీఆర్ రాజకీయాల్లోకి తీసుకువచ్చారని బాలకృష్ణ పేర్కొన్నారు.
#WATCH | Andhra Pradesh Minister Nara Lokesh pays tribute to the former CM of united Andhra Pradesh and Telugu film actor NTR on his 29th death anniversary, in Hyderabad. pic.twitter.com/Lo0CnWbyd9
— ANI (@ANI) January 18, 2025
పేదల జీవితాల్లో వెలుగు నింపిన మహనీయుడు
‘‘సమాజమే దేవాలయం.. ప్రజలే దేవుళ్లు అన్న సూక్తిని మొదటిసారిగా రాజకీయాలకు పరిచయం చేసిన మానవతావాది.. నిరుపేదల జీవితాల్లో సంక్షేమ వెలుగులు నింపిన మహనీయుడు ఎన్టీఆర్. బడుగు బలహీన వర్గాల వారికి రాజ్యాధికారంలో భాగస్వామ్యం కల్పించిన సమతావాది.. స్త్రీలకు సాధికారతనిచ్చిన సంస్కర్త.. స్వర్గీయ నందమూరి తారక రామారావు వర్ధంతి సందర్భంగా ఆ మహానాయకుని స్మృతికి నివాళులర్పిద్దాం’’ అని చంద్రబాబు (AP CM Chandrababu Naidu) ‘ఎక్స్’లో పేర్కొన్నారు.
‘సమాజమే దేవాలయం… ప్రజలే దేవుళ్ళు’ అన్న సూక్తిని మొదటిసారిగా రాజకీయాలకు పరిచయం చేసిన మానవతావాది… నిరుపేదల జీవితాల్లో సంక్షేమ వెలుగులు నింపిన మహనీయుడు ఎన్టీఆర్. బడుగు బలహీన వర్గాల వారికి రాజ్యాధికారంలో భాగస్వామ్యం కల్పించిన సమతావాది…స్త్రీలకు సాధికారతనిచ్చిన… pic.twitter.com/obaiD22a2r
— N Chandrababu Naidu (@ncbn) January 18, 2025
ఆయనో ప్రభంజనం
‘‘ఎన్టీఆర్ ఒక పేరు కాదు.. ప్రభంజనం.. అదొక సంచలనం. తెలుగువాడి విశ్వరూపం.. వెండితెరపై రారాజుగా వెలుగొందారు. రాజకీయాల్లో మహానాయకుడిగా రాణించారు. సమాజమే దేవాలయం.. ప్రజలే దేవుళ్లని నినదించారు. కోట్లాది హృదయాల్లో కొలువైన మా తాతగారే నాకు నిత్యస్ఫూర్తి’’ అని మంత్రి నారా లోకేశ్ (Nara Lokesh) ఎక్స్ వేదికగా పోస్టు పెట్టారు.
యుగపురుషుడు, విశ్వవిఖ్యాత నటసార్వభౌముడు నందమూరి తారక రామారావు గారి 29వ వర్థంతి సందర్భంగా ఆ మహనీయునికి ఘన నివాళి అర్పిస్తున్నాను. ఎన్టీఆర్ అనేది ఒక పేరు కాదు.. ప్రభంజనం. అదొక సంచలనం. తెలుగువాడి విశ్వరూపం. వెండితెరపై రారాజుగా వెలుగొందారు, రాజకీయాల్లో మహానాయకుడిగా రాణించారు.… pic.twitter.com/Vbt7xV8akR
— Lokesh Nara (@naralokesh) January 18, 2025