
పవన్ కల్యాణ్ (Pawan Kalyan) హీరోగా సుజీత్ దర్శకత్వంలో రూపుదిద్దుకుంటున్న మూవీ ‘ఓజీ’ (OG). ప్రియాంక అరుల్ మోహన్ (Priyanka Mohan) హీరోయిన్. ప్రముఖ బాలీవుడ్ నటుడు ఇమ్రాన్ హష్మీ విలన్ రోల్ లో నటిస్తున్నారు. ఇదిలా ఉంటే ఈ మూవీ గురించి ఓ ఆసక్తికర విషయం తెలిసింది. ఈ సినిమాలో నటుడు నారా రోహిత్కు (Nara Rohith) కాబోయే సతీమణి శిరీషా లెల్లా నటిస్తున్నారు. ఈ విషయాన్ని తాజాగా స్వయంగా నారా రోహితే వెల్లడించారు. ‘భైరవం’ మూవీ ప్రచారంలో భాగంగా నిర్వహించిన ఇంటర్వ్యూలో ఈ విషయం గురించి మాట్లాడారు.
‘ఓజీ’ మూవీ షూటింగ్ శరవేగంగా..
బెల్లంకొండ సాయి శ్రీనివాస్, నారా రోహిత్, మంచు మనోజ్ (Manoj Manchu) నటించిన సినిమా ‘భైరవం’ (Bhairavam). ఈ సినిమా ప్రచారంలో భాగంగా టీమ్ మొత్తం సాయి దుర్గా తేజ్తో (Sai Durga Tej) కలిసి సరదా ఇంటర్వ్యూ చేశారు. ‘ఓజీ’ అప్డేట్ చెప్పాల్సిందిగా నారా రోహిత్ను సాయి దుర్గాతేజ్ అడగ్గా.. ‘ఇందులో నాకు కాబోయే భార్య శిరీషా నటించింది. ‘ఓజీ’లో ఓ కీలక పాత్రలో నటించే అవకాశం తనకు దక్కింది’ అని స్పష్టం చేశారు. ‘ఓజీ’ మూవీ షూటింగ్ శరవేగంగా జరుగుతోంది. సెప్టెంబర్ 25న ప్రేక్షకుల ముందుకురానుంది.