అఫ్గానిస్థాన్(Afghanistan)లోని పశ్చిమ హెరాత్ ప్రావిన్స్లో మంగళవారం రాత్రి జరిగిన ఘోర రోడ్డు ప్రమాదం(Road Accident)లో 71 మంది మరణించారు. ఇందులో 17 మంది చిన్నారులు ఉన్నారు. ఈ దుర్ఘటనలో ఇరాన్(Iran) నుంచి ఇటీవల బహిష్కరించబడిన వలసదారులను తీసుకెళ్తున్న ఒక బస్సు, ట్రక్కు మోటార్సైకిల్(Bike)తో ఢీకొనడంతో భారీ అగ్నిప్రమాదం సంభవించిందని ప్రావిన్స్ ప్రభుత్వ ప్రతినిధి అహ్మదుల్లా ముత్తాఖీ(Ahmadullah Muttaqi) తెలిపారు. ఢీకొన్న బస్సు కాబూల్కు వెళ్తుండగా, ఈ ప్రమాదం గుజారా జిల్లాలోని హెరాత్ నగరం వెలుపల జరిగింది. పోలీసుల ప్రకారం, బస్సు అతివేగంగా, నిర్లక్ష్యంగా నడపడం వల్ల ఈ ప్రమాదం జరిగింది.
ఇంధనం తీసుకెళ్తున్న ట్రక్కును ఢీకొట్టడంతో
బస్సు(Bus) మొదట మోటార్సైకిల్ను ఢీకొట్టి, ఆ తర్వాత ఇంధనం తీసుకెళ్తున్న ట్రక్కును ఢీకొట్టడంతో మంటలు చెలరేగాయి. ఈ ఘటనలో మోటార్సైకిల్పై ఇద్దరు, ట్రక్కులో ఇద్దరు మరణించగా, బస్సులోని ముగ్గురు ప్రయాణికులు మాత్రమే బయటపడ్డారు. ఈ దుర్ఘటనలో బస్సు, ట్రక్కుతోపాటు మోటార్సైకిల్ పూర్తిగా కాలిపోయాయి. అఫ్గానిస్థాన్లో రోడ్డు ప్రమాదాలు సర్వసాధారణంగా జరుగుతుంటాయి. దీనికి ప్రధాన కారణాలు దశాబ్దాలుగా కొనసాగిన సంఘర్షణల వల్ల దెబ్బతిన్న రహదారులు, నిర్లక్ష్య డ్రైవింగ్, ట్రాఫిక్ నియమాల ఉల్లంఘన వంటివి కారణంగా తెలుస్తోంది.
د اطفايې مسؤلين په ډير ليږ وخت کي د حادثی ځای ته ورسيدل خو متاسفانه په ژغورلو ونه توانيدل pic.twitter.com/cj3RhQc25H
— Ahmadullah Muttaqi | احمدالله متقي (@Ahmadmuttaqi01) August 19, 2025
కాగా ఈ ఏడాది ప్రారంభం నుంచి ఇరాన్, పాకిస్థాన్ నుంచి 1.6 మిలియన్ల మంది అఫ్గాన్ వలసదారులు(Afghan immigrants) తిరిగి వచ్చారని ఐక్యరాష్ట్ర సమాఖ్య సమాచారం తెలిపింది. ఈ ప్రమాదం దేశంలోని రోడ్డు భద్రతా సమస్యలను మరోసారి హైలైట్ చేసింది. అధికారులు ఈ ఘటనపై విచారణ జరుపుతున్నారు.






