
కేంద్ర ప్రభుత్వం 2025 సంవత్సరానికి గానూ పద్మ అవార్డు(Padma Awards)లను ప్రకటించింది. గణతంత్ర దినోత్సవం(Republic Day Clebrations) సందర్భంగా పద్మ అవార్డులను ప్రకటించారు. దేశంలోని అత్యున్నత పౌర పురస్కారాలలో పద్మ అవార్డును 3 విభాగాల్లో అందజేస్తారు. ఈ క్రమంలో పలువురు క్రీడాకారుల(For sportsmen)కు పద్మ అవార్డులు దక్కాయి. భారత మాజీ హాకీ గోల్కీపర్ PR శ్రీజేష్కు పద్మభూషణ్(Padmabhushan).. R అశ్విన్, ఫుట్బాల్ లెజెండ్ IM విజయన్లకు పద్మశ్రీ(Padma Sri) అవార్డులు లభించాయి. అంతేకాకుండా.. హర్విందర్ సింగ్, సత్యపాల్ సింగ్లకు పద్మశ్రీ అవార్డులు వచ్చాయి.
క్రీడల్లో అత్యుత్తమ ప్రతిభకు ‘పురస్కారం’
☛ క్రికెట్లో అశ్విన్(Ravichandran Ashwin) చేసిన సేవలకుగానూ పద్మశ్రీ అవార్డు లభించింది. ఆఫ్-స్పిన్నర్ 2024లో బోర్డర్-గవాస్కర్ ట్రోఫీ(BGT 2024-25) మధ్యలో రిటైర్మెంట్ ప్రకటించాడు. అశ్విన్ 106 టెస్టులు ఆడాడు.. 537 వికెట్లు తీశాడు.
☛ హర్విందర్ సింగ్(Harvinder Singh) పారాలింపియన్, 2024 పారాలింపిక్స్ బంగారు పతక విజేత హర్విందర్ సింగ్కు పద్మశ్రీ అవార్డు లభించింది. హర్విందర్ పురుషుల వ్యక్తిగత రికర్వ్ ఓపెన్ ఫైనల్లో పోలాండ్కు చెందిన లుకాస్జ్ సిజెక్ను ఓడించి పారిస్ పారాలింపిక్స్ 2024లో భారత్కు 4వ గోల్డ్ మెడల్ అందించాడు.
☛ IM విజయన్ను కూడా పద్మశ్రీ అవార్డు వరించింది. అతను భారతదేశపు అత్యుత్తమ ఫుట్బాల్(Foot Ball) ప్లేయర్లలో ఒకరు. మాజీ కేరళ ఫార్వర్డ్ 2000-2004 సమయంలో భారత కెప్టెన్గా కూడా పనిచేశాడు. విజయన్ భారత్ తరఫున 72 మ్యాచ్లలో 29 అంతర్జాతీయ గోల్స్ చేశాడు.