IND vs PAK: టాస్ ఓడిన భారత్.. బ్యాటింగ్ ఎవరిదంటే?

ఛాంపియన్స్ ట్రోఫీ(Champions Trophy 2025)లో భాగంగా భారత్‌(Team India)తో జరుగుతున్న మ్యాచులో పాకిస్థాన్(Pakistan) జట్టు టాస్(Toss) నెగ్గి బ్యాటింగ్ ఎంచుకుంది. దుబాయ్(Dubai) వేదికగా జరుగుతున్న ఈ మ్యాచులో భారత్ జట్టులో ఎలాంటి మార్పులు లేకుండా తొలి మ్యాచు జట్టతోనే బరిలోకి దిగుతోంది. అటు పాకిస్థాన్ జట్టులో ఒక మార్పు చోటు చేసుకుంది. ఓపెనర్ ఫఖర్ జమాన్ గాయంగా దూరమవడంతో ఇమాముల్ హక్(Imam-ul-Haq) అతడి స్థానంలో వచ్చాడు. కాగా 2023 ప్రపంచ కప్ ఫైనల్ నుంచి వన్డేల్లో భారత్ వరుసగా 12 టాస్‌లను కోల్పోయింది. దీంతో వరుస అత్యధిక టాస్ ఓడిపోయిన కెప్టెన్‌గా రోహిత్(Rohith Sharma) శర్మ నిలిచాడు.

తుది జట్లు ఇలా..

భారత్: రోహిత్ శర్మ(C), శుభ్‌మన్ గిల్, విరాట్ కోహ్లి, శ్రేయస్ అయ్యర్, అక్షర్ పటేల్, కేఎల్ రాహుల్(WK), హార్దిక్ పాండ్య, రవీంద్ర జడేజా, హర్షిత్ రాణా, మహమ్మద్ షమీ, కుల్దీప్ యాదవ్.

పాకిస్థాన్: ఇమామ్-ఉల్-హక్, బాబర్ ఆజం, సౌద్ షకీల్, మహ్మద్ రిజ్వాన్(W/C), సల్మాన్ అఘా, తయ్యబ్ తాహిర్, ఖుష్దిల్ షా, షాహీన్ అఫ్రిది, నసీమ్ షా, హరీస్ రవూఫ్, అబ్రార్ అహ్మద్.

Related Posts

Kaleshwaram Project: కాళేశ్వరం ప్రాజెక్టుపై సీబీఐ విచారణ.. ప్రభుత్వం సంచలన నిర్ణయం

కాళేశ్వరం ప్రాజెక్టు(Kaleshwaram Project) నిర్మాణంలో అక్రమాలు జరిగాయని ఆరోపించిన కాంగ్రెస్ సర్కార్(Congress Govt).. అందుకోసం జస్టిస్ పీసీ ఘోష్(Justice PC Ghosh) కమిషన్‌ను ఏర్పాటు చేసిన విషయం తెలిసిందే. దీనిపై కమిషన్ దాదాపు 650 పేజీలతో కూడిన నివేదికను ప్రభుత్వానికి అందజేసింది.…

ఆదోని నుంచి సైకిల్‌పై వచ్చిన అభిమానికి మెగాస్టార్ ఇచ్చిన అద్భుతమైన గిఫ్ట్! వీడియో వైరల్..

మెగాస్టార్ చిరంజీవి(Chiranjeevi) పట్ల అభిమానులు చూపించే ప్రేమ మరోసారి బయటపడింది. ఆదోని(Adoni) నుంచి హైదరాబాద్(Hyderadad) వరకు సైకిల్‌పై ఒంటరిగా ప్రయాణించి వచ్చిన మహిళా అభిమాని రాజేశ్వరి(Rajeshwari) అందరినీ కదిలించింది. ఎన్ని కష్టాలు, అడ్డంకులు ఎదురైనా తన ఆరాధ్య నటుడిని చూడాలన్న తపన…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *