
పాకిస్థాన్(Pakistan) మరోసారి బరితెగించింది. జమ్మూలో గురువారం రాత్రి డ్రోన్లు, మిస్సైళ్ల(Drones, missiles)తో దాడికి పాల్పడింది. ముఖ్యంగా జమ్మూ విమానాశ్రయా(Jammu Airport)న్ని లక్ష్యంగా చేసుకునేందుకు పాకిస్థాన్ ప్రయత్నిస్తోంది. దీంతో విమానాశ్రయంతో సహా పలు ప్రాంతాల్లో భారీ పేలుళ్ల శబ్దాలు వినిపించాయి. దీంతో జమ్మూలో ఎయిర్ సైరన్లు(Air sirens) మోగాయి. ప్రస్తుతం అక్కడ విద్యుత్ సరఫరా, ఇంటర్నెట్ను నిలిపేశారు. ప్రజలందరూ ఇళ్లలోనే ఉండాలని అధికారులు ఆదేశాలు జారీ చేశారు. జమ్మూలోని పలు ప్రాంతాల్లో బ్లాక్అవుట్(Blackout) విధించారు. జమ్మూలో 7-8 పేలుళ్ల శబ్దాలు వినిపించాయని స్థానికులు చెబుతున్నారు. పాకిస్థాన్ డ్రోన్లు భారతదేశంలోకి ప్రవేశిస్తున్నట్లు వీడియోలు సోషల్ మీడియా(SM)లో బయటికొచ్చాయి.
Electricity being shut in Jammu as India’s air defence (S400) gets activated
Security agencies confirming 8 missiles directed from Pakistan at Jammu civil airport, Samba,, RS Pura, Arnia and neighhbouring areas and all were intercepted/blocked by S400#IndiaPakistanWar pic.twitter.com/cxltnsbvhu
— Kashmir Scan (@KashmirScan) May 8, 2025
S-400ను యాక్టివేట్
కాగా వెంటనే స్పందించిన ఇండియన్ ఆర్మీ(Indian Army) S-400ను యాక్టివేట్ చేసింది. దీని ద్వారా డ్రోన్లు, మిస్సైళ్లను సమర్థవంతంగా ఎదుర్కొని వాటిని కూల్చేస్తోంది. ప్రస్తుతం 8 మిస్సైళ్లను భారత్ కూల్చేసింది. ఎస్-400 క్షిపణి రక్షణ వ్యవస్థ ప్రపంచంలోనే అత్యంత ఆధునిక దీర్ఘశ్రేణి గగనతల రక్షణ వ్యవస్థలలో ఒకటిగా పేరుపొందింది. ఈ వ్యవస్థలో ప్రధానంగా మూడు భాగాలు ఉంటాయి: క్షిపణి ప్రయోగ వాహనాలు, శక్తివంతమైన రాడార్, ఒక కమాండ్ సెంటర్. ఇది విమానాలు, క్రూయిజ్ క్షిపణులు, వేగంగా దూసుకొచ్చే మధ్యంతర శ్రేణి బాలిస్టిక్ క్షిపణులను కూడా ఛేదించగలదు. దాదాపు అన్ని రకాల ఆధునిక యుద్ధ విమానాలను ఇది ఎదుర్కోగలదు.
Nikhil: అలాంటి దేశాలకు వెళ్లడం అవసరమా?.. ఆలోచించుకోండి: హీరో నిఖిల్
భారత్-పాక్ ఉద్రిక్తతల వేళ తుర్కియే వ్యవహారశైలిపై వివాదాస్పదమైంది. ముఖ్యంగా ఆ దేశ అధ్యక్షుడు ఎర్డోగాన్ వ్యవహరించిన తీరుపై సర్వత్రా విమర్శలు వ్యక్తమయ్యాయి. తుర్కియే తీరుపై తాజాగా టాలీవుడ్ నటుడు నిఖిల్ (Nikhil) అసహనం వ్యక్తంచేశారు. భారత్కు వ్యతిరేకంగా వ్యవహరించే దేశాల కోసం…