గాజా స్ట్రిప్(Gaza Strip)పై ఇజ్రాయెల్ మరోసారి విరుచుకుపడింది. తాజాగా జరిపిన వైమానిక దాడుల్లో కనీసం 80 మంది పాలస్తీనియన్లు (Palestinians) ప్రాణాలు కోల్పోయారని, అనేక మంది గాయపడ్డారని పాలస్తీనా వైద్య వర్గాలు(Palestinian medical communities) వెల్లడించాయి. దక్షిణ గాజాలోని ఖాన్ యూనిస్ నగరం(Khan Younis city)లో జరిగిన దాడుల్లో మహిళలు, చిన్నారులతో సహా 54 మంది మరణించినట్లు నాసర్ ఆసుపత్రి ఒక ప్రకటనలో తెలిపింది.
నిలిచిన ఆరోగ్య సేవలు
ఈ దాడుల కారణంగా గాజాలో క్యాన్సర్ రోగుల(Cancer patients)కు వైద్య సేవలు అందించే ఏకైక ఆసుపత్రి అయిన గాజా యూరోపియన్ హాస్పిటల్ సేవలు పూర్తిగా నిలిచిపోయాయని అక్కడి ఆరోగ్య అధికారులు తెలిపారు. ఆసుపత్రి మౌలిక వసతులు, మురుగునీటి లైన్లు దెబ్బతినడంతో పాటు, అంతర్గత విభాగాలు ధ్వంసమయ్యాయని, ఆసుపత్రికి దారితీసే రహదారులు నాశనమయ్యాయని వారు వివరించారు. గాజా నగరం మరియు ఉత్తర గాజాలోని ఇతర ప్రాంతాలపై జరిగిన దాడుల్లో మరో 26 మంది మరణించినట్లు వైద్య వర్గాలు తెలిపాయి.
‘The ground split and swallowed them’: Survivors of European Hospital bombing in Gaza recount deadly Israeli attack https://t.co/WKdJTZjxl2
— niek jansen (@niekjansen4) May 16, 2025
53,010కి చేరిన మరణాలు?
రాబోయే రోజుల్లో హమాస్(Hamas)ను ఓడించే ప్రయత్నాలలో భాగంగా ఇజ్రాయెల్ సైన్యం(Israel Army) పూర్తి శక్తితో గాజాలోకి ప్రవేశిస్తుందని ఇజ్రాయెల్ PM బెంజమిన్ నెతన్యాహు(Benjamin Netanyahu) హెచ్చరించిన నేపథ్యంలో ఈ దాడులు జరిగాయి. మార్చి 18న రెండు నెలల కాల్పుల విరమణ ముగిసిన తర్వాత ఇజ్రాయెల్ గాజాలో భారీ సైనిక చర్యలను తిరిగి ప్రారంభించింది. అప్పటి నుంచి 2,876 మంది పాలస్తీనియన్లు మరణించగా, 7,800 మందికి పైగా గాయపడ్డారు. అక్టోబర్ 7, 2023న యుద్ధం ప్రారంభమైనప్పటి నుంచి మొత్తం పాలస్తీనియన్ల మరణాల సంఖ్య 53,010కి చేరుకుందని గాజా ఆరోగ్య అధికారులు(Gaza health officials) తెలిపారు.







