రైతులకు గుడ్‌న్యూస్.. ఫిబ్రవరి 24న పీఎం కిసాన్‌ నిధులు జమ?

రైతులకు గుడ్‌ న్యూస్‌. కర్షకులకు పెట్టుబడి సాయం అందించే ఉద్దేశంతో కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న పీఎం-కిసాన్‌ (PM Kisan) పథకం 19వ విడత నిధుల (PM Kisan 19th installment) విడుదలకు డేట్ ఫిక్స్ అయింది. ఫిబ్రవరి 24వ తేదీన నగదు రైతుల ఖాతాల్లో జమ కానుంది. ఈ పథకం కింద కేంద్ర సర్కార్ ఎకరానికి రూ.2 వేలు చొప్పున ఆర్థిక సాయం చేస్తున్న విషయం తెలిసిందే.

బిహార్‌లోని భాగల్పూర్‌లో జరిగే కార్యక్రమంలో ప్రధాని నరేంద్ర మోదీ(PM Modi) ఈ నిధుల్ని విడుదల చేయనున్నారు. 19వ విడతలో 9.7 కోట్ల మంది రైతులకు ప్రయోజనం కలగనుంది. పీఎం కిసాన్‌ నిధులు రావాలంటే అర్హులైన రైతులు ఎన్‌పీసీఐ, ఆధార్‌తో అనుసంధానించిన బ్యాంకు ఖాతాను కలిగి ఉండాలి. అలాగే, ఇ-కేవైసీ కూడా చేసి ఉండాలి.

పీఎం కిసాన్‌ పథకానికి సంబంధించిన స్టేటస్ తెలుసుకోవాలంటే.. పీఎం కిసాన్‌ జాబితాలో మీ పేరు ఉందో, లేదో చూడాలంటే https://pmkisan.gov.in/లోకి వెళ్లి చెక్‌ చేసుకోవచ్చు.  వివరాలు తెలుసుకునేందుకు రిజిస్టర్డ్‌ మొబైల్‌ నంబర్‌/ ఆధార్‌ నంబర్‌ ఎంటర్‌ చేయాలి. లబ్ధిదారుల కోసం పీఎం కిసాన్‌ మొబైల్‌ యాప్‌ కూడా అందుబాటులో ఉంది.

Related Posts

Kaleshwaram Project: కాళేశ్వరం ప్రాజెక్టుపై సీబీఐ విచారణ.. ప్రభుత్వం సంచలన నిర్ణయం

కాళేశ్వరం ప్రాజెక్టు(Kaleshwaram Project) నిర్మాణంలో అక్రమాలు జరిగాయని ఆరోపించిన కాంగ్రెస్ సర్కార్(Congress Govt).. అందుకోసం జస్టిస్ పీసీ ఘోష్(Justice PC Ghosh) కమిషన్‌ను ఏర్పాటు చేసిన విషయం తెలిసిందే. దీనిపై కమిషన్ దాదాపు 650 పేజీలతో కూడిన నివేదికను ప్రభుత్వానికి అందజేసింది.…

ఆదోని నుంచి సైకిల్‌పై వచ్చిన అభిమానికి మెగాస్టార్ ఇచ్చిన అద్భుతమైన గిఫ్ట్! వీడియో వైరల్..

మెగాస్టార్ చిరంజీవి(Chiranjeevi) పట్ల అభిమానులు చూపించే ప్రేమ మరోసారి బయటపడింది. ఆదోని(Adoni) నుంచి హైదరాబాద్(Hyderadad) వరకు సైకిల్‌పై ఒంటరిగా ప్రయాణించి వచ్చిన మహిళా అభిమాని రాజేశ్వరి(Rajeshwari) అందరినీ కదిలించింది. ఎన్ని కష్టాలు, అడ్డంకులు ఎదురైనా తన ఆరాధ్య నటుడిని చూడాలన్న తపన…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *