‘గర్బా’పై పాట రాసిన ప్రధాని మోదీ.. వీడియో వైరల్

Mana Enadu : దసరా పర్వదినాల సందర్భంగా ప్రధాని మోదీ (PM Modi) ప్రత్యేకమైన పాటను రాశారు. గర్బా నృత్యంపై ప్రధాని రాసిన ఈ పాటను గాయని పూర్వా మంత్రి పాడారు. నవరాత్రి ఉత్సవాల సందర్భంగా..  ప్రధాని తన ఎక్స్‌ ఖాతాలో ఆ పాట వీడియోను షేర్‌ చేశారు. ‘అవ‌తికాలే’ పేరుతో గ‌ర్భా గీతాన్ని ప్ర‌ధాని రాశారు. ప్రస్తుం ఈ వీడియో సోషల్ మీడియాలో బాగా వైరల్ అవుతోంది.

‘‘ఈ పవిత్ర నవరాత్రుల్లో దుర్గాదేవి(Durga Devi)ని ప్రజలు ఐక్యంగా వివిధ రకాలుగా ఆరాధిస్తారు. ఈ ప్రత్యేక సమయంలో అమ్మవారి శక్తి, దయను కీర్తిస్తూ అవటికలయ అనే గర్బా పాటను నేను రచించాను. మనందరిపైనా ఆమె కృప ఉండాలని కోరుకుంటున్నాను’’ అని వీడియో షేర్ చేసిన మోదీ దాని కింద క్యాప్షన్ రాశారు. ఈ సందర్భంగా వర్ధమాన గాయని పూర్వా మంత్రి తన అద్భుతమైన స్వరంతో దీనిని ఆలపించారని ప్రధాని మరో పోస్టులో ఆమెకు ధన్యవాదాలు తెలిపారు.

 

గతేడాది కూడా ప్రధాని శరన్నవరాత్రుల వేళ గర్బాపై ప్రత్యేకమైన కవిత(PM Modi Poetry)ను రాసిన విషయం తెలిసిందే. అది మ్యూజిక్‌ వీడియో రూపంలో విడుదలైంది. చాలాఏళ్ల కిత్రం దీన్ని రాశానని.. ఇప్పుడు ఈ గీతాన్ని వింటుంటే పాత స్మృతులు గుర్తుకు వస్తున్నాయని మోదీ చెప్పుకొచ్చారు. అంతేకాదు.. గర్బాపై మరో పాటను కూడా తాను రాశానని వెల్లడించారు.

‘‘చాలా ఏళ్ల నుంచి రాయలేదు. కానీ గత కొన్ని రోజుల్లో గర్బాపై కొత్త పాటను రాయగలిగాను. నవరాత్రి సందర్భంగా అందరితో ఆ పాటను పంచుకుంటాను’’ అని నాడు ఆయన చేసిన ఎక్స్ పోస్టులో రాసుకొచ్చారు. ఆ పాటకు గాయని ధ్వని భానుశాలి (Dhvani Bhanushali) గాత్రాన్ని ఇవ్వగా, స్వరాలను బాలీవుడ్‌ సంగీత దర్శకుడు తనిష్క్‌ బాగ్చి సమకూర్చారు. జేజస్ట్‌ మ్యూజిక్‌ సంస్థ ఆ పాటను చిత్రీకరించింది.

Related Posts

Kaleshwaram Project: కాళేశ్వరం ప్రాజెక్టుపై సీబీఐ విచారణ.. ప్రభుత్వం సంచలన నిర్ణయం

కాళేశ్వరం ప్రాజెక్టు(Kaleshwaram Project) నిర్మాణంలో అక్రమాలు జరిగాయని ఆరోపించిన కాంగ్రెస్ సర్కార్(Congress Govt).. అందుకోసం జస్టిస్ పీసీ ఘోష్(Justice PC Ghosh) కమిషన్‌ను ఏర్పాటు చేసిన విషయం తెలిసిందే. దీనిపై కమిషన్ దాదాపు 650 పేజీలతో కూడిన నివేదికను ప్రభుత్వానికి అందజేసింది.…

ఆదోని నుంచి సైకిల్‌పై వచ్చిన అభిమానికి మెగాస్టార్ ఇచ్చిన అద్భుతమైన గిఫ్ట్! వీడియో వైరల్..

మెగాస్టార్ చిరంజీవి(Chiranjeevi) పట్ల అభిమానులు చూపించే ప్రేమ మరోసారి బయటపడింది. ఆదోని(Adoni) నుంచి హైదరాబాద్(Hyderadad) వరకు సైకిల్‌పై ఒంటరిగా ప్రయాణించి వచ్చిన మహిళా అభిమాని రాజేశ్వరి(Rajeshwari) అందరినీ కదిలించింది. ఎన్ని కష్టాలు, అడ్డంకులు ఎదురైనా తన ఆరాధ్య నటుడిని చూడాలన్న తపన…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *