PMFBY: నేడు రైతుల ఖాతాల్లోకి ప్రధాన మంత్రి ఫసల్ బీమా నగదు

ప్రధాన మంత్రి ఫసల్ బీమా యోజన (PMFBY) కింద పంట బీమా నిధులు ఈరోజు (ఆగస్టు 11) విడుదల కానున్నాయి. దీని ద్వారా దేశవ్యాప్తంగా సుమారు 30 లక్షల మంది రైతుల(Farmers)కు రూ.3,200 కోట్ల పంట బీమా నిధులను కేంద్ర ప్రభుత్వం(Central Govt) నేడు విడుదల చేయనుంది. ఈ నిధులను కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్(Union Agriculture Minister Shivraj Singh Chouhan) రాజస్థాన్‌లోని జుంజునులో జరిగే కార్యక్రమంలో రైతుల బ్యాంకు ఖాతాల్లో నేరుగా జమ చేయనున్నారు. ఈ కార్యక్రమం రైతులకు ఆర్థిక భరోసా(Financial security for farmers) కల్పించి, వ్యవసాయ రంగాన్ని సుస్థిరం చేయడానికి ఉద్దేశించింది.ఈ నిధులలో మధ్యప్రదేశ్ రైతులకు రూ.1,156 కోట్లు, రాజస్థాన్‌కు రూ.1,121 కోట్లు, ఛత్తీస్‌గఢ్‌కు రూ.150 కోట్లు, ఇతర రాష్ట్రాలకు రూ.773 కోట్లు కేటాయించారు.

PMFBY: Odisha To Pay Marginal Farmers' Share Of Crop Insurance Premium |  Odisha

15 రోజుల్లోపు క్లెయిమ్‌లు

2016లో ప్రారంభమైన ఈ పథకం, ప్రకృతి వైపరీత్యాలు, తెగుళ్లు, వ్యాధుల వల్ల పంట నష్టపోయిన రైతులకు ఆర్థిక సహాయం అందిస్తుంది. రైతులు ఖరీఫ్ పంటల(Kharif crops)కు 2%, రబీ పంటలకు 1.5%, వాణిజ్య పంటలకు 5% ప్రీమియం చెల్లిస్తే, మిగిలిన భారాన్ని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు భరిస్తాయి.ఈ పథకం ద్వారా రైతులు వర్షాభావం, వరదలు, తుఫానులు వంటి సహజ విపత్తుల నుండి రక్షణ పొందుతారు. నష్టం జరిగిన 72 గంటల్లో సమాచారం ఇస్తే, 15 రోజుల్లోపు క్లెయిమ్‌లు చెల్లించబడతాయి. డ్రోన్లు, ఉపగ్రహ చిత్రాలు వంటి సాంకేతికతలను ఉపయోగించి పారదర్శకతను నిర్ధారిస్తున్నారు. ఈ నిధుల విడుదల రైతులకు కొత్త ఆశలు కల్పిస్తూ, వ్యవసాయ కార్యకలాపాలను కొనసాగించడానికి ఊతమిస్తుంది.

Related Posts

Kaleshwaram Project: కాళేశ్వరం ప్రాజెక్టుపై సీబీఐ విచారణ.. ప్రభుత్వం సంచలన నిర్ణయం

కాళేశ్వరం ప్రాజెక్టు(Kaleshwaram Project) నిర్మాణంలో అక్రమాలు జరిగాయని ఆరోపించిన కాంగ్రెస్ సర్కార్(Congress Govt).. అందుకోసం జస్టిస్ పీసీ ఘోష్(Justice PC Ghosh) కమిషన్‌ను ఏర్పాటు చేసిన విషయం తెలిసిందే. దీనిపై కమిషన్ దాదాపు 650 పేజీలతో కూడిన నివేదికను ప్రభుత్వానికి అందజేసింది.…

ఆదోని నుంచి సైకిల్‌పై వచ్చిన అభిమానికి మెగాస్టార్ ఇచ్చిన అద్భుతమైన గిఫ్ట్! వీడియో వైరల్..

మెగాస్టార్ చిరంజీవి(Chiranjeevi) పట్ల అభిమానులు చూపించే ప్రేమ మరోసారి బయటపడింది. ఆదోని(Adoni) నుంచి హైదరాబాద్(Hyderadad) వరకు సైకిల్‌పై ఒంటరిగా ప్రయాణించి వచ్చిన మహిళా అభిమాని రాజేశ్వరి(Rajeshwari) అందరినీ కదిలించింది. ఎన్ని కష్టాలు, అడ్డంకులు ఎదురైనా తన ఆరాధ్య నటుడిని చూడాలన్న తపన…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *