బాలీవుడ్ స్టార్ హీరో సైఫ్ అలీఖాన్(Saif Ali Khan)పై కత్తిదాడి కేసులో ఇప్పటికే పోలీసు కస్టడీలో ఉన్న నిందితుడే అసలైన నేరస్థుడు అంటూ గట్టిగా నమ్మిన పోలీసులే.. అతడికి ఫేస్ రికగ్నిషన్ టెస్ట్(Facial RecognitionTest) నిర్వహిస్తామంటూ మరోసారి కస్టడీ(Custody) కోరారు. దాడి జరిగిన రోజు CCTVలో కనిపించిన అతను, పోలీసులు అరెస్ట్ చేసిన నిందితుడు ఒకరేనా కాదా అని తేల్చేందుకే ఈ పరీక్ష చేయబోతున్నట్లు ప్రకటించారు. అసలు నిందితుడు ఇతడేనా, కాదా అని అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. జనవరి 16వ తేదీ రోజు వేకువజామున 2.30 గంటలకు బాలీవుడ్(Bollywood) స్టార్ హీరో సైఫ్ అలీఖాన్పై దాడి జరిగిన విషయం అందరికీ తెలిసిందే. వెంటనే కేసు నమోదు చేసుకుని దర్యాప్తు ప్రారంభించారు పోలీసులు. మొత్తం 10 బృందాలుగా ఏర్పడి నిందితుడి కోసం గాలించారు. సీసీటీవీ ఫుటేజీలను పరిశీలించి.. ఇతడే నిందితుడు(Accused) అంటూ ఓ వ్యక్తి ఫొటో(Photo)ను కూడా విడుదల చేశారు.
విచారణ పూర్తి కావడంతోనే..
అయితే ఇలా ఫొటో విడుదల చేసిన 2 రోజుల తర్వాత పోలీసులు(Police) అతడిని అరెస్ట్ చేశారు. ముఖ్యంగా బంగ్లాదేశ్(Bangladesh)కు చెందిన షరీఫుల్ ఇస్తాం షెహజాద్ మహమ్మద్ రోహిల్లా అమీన్ ఫకీర్ను.. థాణే అటవీ ప్రాంతంలో ఉన్న ఓ లేబర్ క్యాంపు వద్ద అదుపులోకి తీసుకున్నారు. అదేరోజు మధ్యాహ్నం ముంబై మెట్రోపాలిటన్ మేజిస్ట్రేట్(Mumbai Metropolitan Magistrate) ముందు హాజరు పరిచారు. ఈ క్రమంలోనే అతడిని మరింతగా విచారించాలని కోరుతూ.. పోలీసులు కస్టడీ కోరారు. దీంతో కోర్టు 5 రోజుల కస్టడీకి అనుమతి ఇచ్చింది. ఈ ఐదు రోజులు నేటితో పూర్తి కావడంతో మరోసారి నిందితుడిని కోర్టు(Court)లో హాజరు పరిచారు.
అది తేల్చేందుకే ఈ పరీక్ష: పోలీసులు
కానీ పోలీసులు ఈరోజు కోర్టు ముందు షాకింగ్ కామెంట్లు చేశారు. నిందితుడైన బంగ్లాదేశీయుడికి(Bangladeshi man) ఫేస్ రికగ్నేషన్ టెస్ట్ చేస్తామని న్యాయస్థానానికి తెలిపారు. దాడి జరిగిన రోజు CCTV ఫుటేజీలో కనిపించిన వ్యక్తి, అరెస్టైన నిందితుడు షరీఫుల్ ఇస్లామ్ షెహజాద్(Shariful Islam Shehzad) అలియాస్ మహమ్మద్ రోహిల్లా అమీన్ ఫకీర్ ఒక్కరేనా కాదా అని తేల్చేందుకు ఈ పరీక్ష చేస్తామన్నారు. దీంతో మరోసారి కోర్టు 4 రోజుల పాటు పోలీసు కస్టడీకి అనుమతిచ్చింది. దీంతో పోలీసుల తీరుపై సర్వత్రా విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.








