NKR21: కళ్యాణ్ రామ్ మూవీకి పవర్‌ఫుల్ టైటిల్‌ ఫిక్స్?

నందమూరి కళ్యాణ్ రామ్(Nandamuri Kalyan Ram) హీరోగా నటిస్తోన్న సినిమా టైటిల్‌గా గతంలో ‘రుద్ర(Rudra)’ అని వినిపించింది. కానీ ఆ పేరు ప్లేసులో తాజాగా మరో పేరు ‘అర్జున్ S/o వైజయంతి’ అనే టాక్ బలంగా వినిపిస్తోంది. ఇందుకు ప్రధాన కారణం ఆలనాటి సీనియర్ నటి విజయశాంతి(Vijayashanti) ఈ సినిమాలో వైజయంతిగా నటిస్తుండటమే. మీరు విన్నది నిజమే ఈ చిత్రంలో విజయశాంతి ఓ కీలకమైన పాత్రలో కనిపించనుంది. చాలా రోజుల తర్వాత రీ ఎంట్రీ ఇచ్చిన ‘సరిలేరు నీకెవ్వరు’లో ఆమె ఇమేజ్‌ను కరెక్ట్‌గా వాడలేదు ఆ మూవీ డైరెక్టర్. కానీ ఈ సారి ఆమె పాత్ర చాలా పవర్ ఫుల్‌గా ఉండబోతోందని ఆ మధ్య వచ్చిన ఆమె బర్త్ డే గ్లింప్స్(Glimpse) చూస్తేనే అర్థమైంది.

విజయశాంతి కొడుకుగా కళ్యాణ్ రామ్

ప్రస్తుతం NKR21 వర్కింగ్ టైటిల్‌తో ఈ మూవీ తెరకెక్కుతోంది. అయితే రివిల్ అయిన టైటిల్‌ను బట్టి కళ్యాణ్ రామ్(KalyanRam) విజయశాంతి కొడుకుగా నటిస్తున్నాడు అని తేలిపోయింది. తల్లీకొడుకుల మధ్య రిలేషన్‌ను కూడా ఈ మూవీలో కొత్తగా చూపించనున్నట్లు తెలుస్తోంది. ఈ మూవీ కళ్యాణ్ రామ్ సరసన సాయీ మంజ్రేకర్(Saiee Manjrekar) హీరోయిన్‌గా నటిస్తోంది. ప్రదీప్ చిలుకూరి(Director Pradeep Chilukuri) డైరెక్ట్ చేస్తోన్న ఈ చిత్రాన్ని అశోక్ వర్ధన్ ముప్పా, సునిల్ బలుసు నిర్మిస్తున్నారు. అజనీష్ లోకనాథ్ సంగీతం అందిస్తున్నాడు.

Makers of 'NKR 21' release birthday glimpse video for Vijayashanthi - The  Hindu

ఈ టైటిల్‌తో పాటు టీజర్‌ను కూడా త్వరలోనే విడుదల చేస్తారని చెబుతున్నారు. సినిమాను వేసవి బరిలో మే 26న విడుదల చేసేందుకు మేకర్స్ ప్లాన్ చేస్తున్నారు. మరి “S/o సత్యమూర్తి”లాగా “అర్జున్ S/o వైజయంతి” కూడా బ్లాక్ బస్టర్ అవుతుందేమో చూడాలి.

Related Posts

Mahesh Babu | వారణాసి ఈవెంట్‌లో రాజమౌళి స్ట‌న్నింగ్ కామెంట్స్

Mahesh Babu | సూపర్ స్టార్ మహేశ్‌బాబు—దర్శకధీరుడు ఎస్‌ఎస్‌ రాజమౌళి కాంబినేషన్‌లో వస్తున్న అత్యంత భారీ యాక్షన్ అడ్వెంచర్ ఫిల్మ్ “వారణాసి” పై ఆసక్తి రోజురోజుకూ పెరుగుతోంది. గ్లోబ్ ట్రోటర్ ఈవెంట్‌లో విడుదలైన స్పెషల్ వీడియోకు ప్రేక్షకుల నుంచి అద్భుత స్పందన…

Kaleshwaram Project: కాళేశ్వరం ప్రాజెక్టుపై సీబీఐ విచారణ.. ప్రభుత్వం సంచలన నిర్ణయం

కాళేశ్వరం ప్రాజెక్టు(Kaleshwaram Project) నిర్మాణంలో అక్రమాలు జరిగాయని ఆరోపించిన కాంగ్రెస్ సర్కార్(Congress Govt).. అందుకోసం జస్టిస్ పీసీ ఘోష్(Justice PC Ghosh) కమిషన్‌ను ఏర్పాటు చేసిన విషయం తెలిసిందే. దీనిపై కమిషన్ దాదాపు 650 పేజీలతో కూడిన నివేదికను ప్రభుత్వానికి అందజేసింది.…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *