Maha Kumbh: మహాకుంభమేళాలో మోదీ పుణ్యస్నానం.. ప్రత్యేక పూజలు

ఉత్తరప్రదేశ్‌(Uttar Pradesh)లోని ప్రయాగ్‌రాజ్‌లో జరుగుతున్న మహాకుంభమేళా(Maha Kumbha Mela)ను ప్రధాని మోదీ(PM Modi) సందర్శించారు. ఇవాళ ఉదయం 10 గంటలకు ప్రయాగ్‌రాజ్ విమానాశ్రయానికి చేరుకున్న మోదీకి UP సీఎం యోగీ ఆదిత్యనాథ్(CM Yogi Adityanath) ఘన స్వాగతం పలికారు. అనంతరం వారు అక్కడి నుంచి ఆర్మీ ప్రత్యేక హెలికాప్టర్‌లో ప్రయాగకి చేరుకున్నారు. అక్కడి అరైల్ ఘాట్(Arile Ghat) నుంచి సంగం ఘాట్(Sangam Ghat) వరకూ ప్రధాని పడవలో వెళ్లారు. అనంతరం త్రివేణీ సంగమం(Triveni Sangamam) వద్ద మోదీ పుణ్య స్నానమాచరించారు. గంగాదేవికి ప్రార్థనలు చేశారు. ప్రత్యేక పూజల అనంతరం గంగమ్మ తల్లికి హారతి ఇచ్చారు. అనంతరం నాగసాధువులు, సాధుసంతు సభ్యులతో ప్రధాని సమావేశమయ్యారు.

కాషాయ వస్త్రాలు.. రుద్రాక్ష మాలను ధరించి

కాగా మోదీ స్నానం చేసే సమయంలో కాషాయ వస్త్రాలు.. రుద్రాక్ష మాలను ధరించి స్నానమాచరించారు. భీష్మాష్టమి(Bhishmashtami) రోజున మోదీ కుంభమేళాకు రావడం విశేషం. కాగా అరైల్ ఘాట్ నుంచి ప్రయాగ్‌రాజ్‌ ఎయిర్‌పోర్టుకు చేరుకుని అక్కడి నుంచి తిరిగి ఢిల్లీ బయల్దేరుతారు. మోదీ రాక నేపథ్యంలో ప్రయాగ్‌రాజ్ నగరంతో పాటు కుంభమేళా వద్ద భారీ భద్రతా ఏర్పాట్లు చేశారు. అనంతరం ప్రయాగ్‌రాజ్ విమానాశ్రయంకు వెళ్లి ఢిల్లీ(Delhi)కి తిరుగు ప్రయాణం అవుతారు.

ఇదిలా ఉండగా జనవరి 13న ప్రారంభమైన కుంభమేళా ఫిబ్రవరి 26 వరకు కొనసాగనుంది. అతిపెద్ద ఆధ్యాత్మిక వేడుక మహాకుంభ మేళా ప్రపంచ దృష్టిని ఆకర్షిస్తోంది. భారత్‌తో పాటు విదేశాల నుంచి భారీ సంఖ్యలో భక్తులు హాజరవుతున్నారు. ఇప్పటి వరకు 40 కోట్ల మంది కుంభమేళాకు వచ్చినట్లు ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం తెలిపింది.

Related Posts

Kaleshwaram Project: కాళేశ్వరం ప్రాజెక్టుపై సీబీఐ విచారణ.. ప్రభుత్వం సంచలన నిర్ణయం

కాళేశ్వరం ప్రాజెక్టు(Kaleshwaram Project) నిర్మాణంలో అక్రమాలు జరిగాయని ఆరోపించిన కాంగ్రెస్ సర్కార్(Congress Govt).. అందుకోసం జస్టిస్ పీసీ ఘోష్(Justice PC Ghosh) కమిషన్‌ను ఏర్పాటు చేసిన విషయం తెలిసిందే. దీనిపై కమిషన్ దాదాపు 650 పేజీలతో కూడిన నివేదికను ప్రభుత్వానికి అందజేసింది.…

ఆదోని నుంచి సైకిల్‌పై వచ్చిన అభిమానికి మెగాస్టార్ ఇచ్చిన అద్భుతమైన గిఫ్ట్! వీడియో వైరల్..

మెగాస్టార్ చిరంజీవి(Chiranjeevi) పట్ల అభిమానులు చూపించే ప్రేమ మరోసారి బయటపడింది. ఆదోని(Adoni) నుంచి హైదరాబాద్(Hyderadad) వరకు సైకిల్‌పై ఒంటరిగా ప్రయాణించి వచ్చిన మహిళా అభిమాని రాజేశ్వరి(Rajeshwari) అందరినీ కదిలించింది. ఎన్ని కష్టాలు, అడ్డంకులు ఎదురైనా తన ఆరాధ్య నటుడిని చూడాలన్న తపన…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *