SSMB29 అప్డేట్.. US నుంచి హైదరాబాద్‌కు ప్రియాంక చోప్రా

ప్రస్తుతం సినీ ప్రియులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న ప్రాజెక్టు #SSMB29. మహేశ్‌బాబు హీరోగా దర్శకధీరుడు రాజమౌళి (SS Rajamouli) తెరకెక్కించనున్న ఈ సినిమా గురించి ఎప్పుడెప్పుడు అప్డేట్ వస్తుందా అని ఎదురుచూస్తున్నారు. ఇటీవలే ఈ చిత్రానికి సంబంధించి పూజా కార్యక్రమాలు జరిగినట్లు వార్తలు వచ్చాయి. కానీ చిత్రబృందం మాత్రం అధికారికంగా ప్రకటన చేయలేదు. ఇక ఈ మూవీలో మహేశ్ సరసన హాలీవుడ్ బ్యూటీ ప్రియాంకా చోప్రా నటిస్తుందనే వార్త వైరల్ అయిన విషయం తెలిసిందే.

హైదరాబాద్ లో ప్రియాంకా చోప్రా

అయితే తాజాగా ఈ వార్త నిజమేనని రుజువు చేసేలా గ్లోబల్ స్టార్ ప్రియాంకా చోప్రా (Priyanka Chopra) హైదరాబాద్ లో కనిపించింది. లాస్‌ ఏంజెలెస్‌ నుంచి ఆమె హైదరాబాద్ ఎయిర్ పోర్టుకు చేరుకుంది. అయితే ఆమె మహేశ్‌- రాజమౌళి ప్రాజెక్ట్‌ కోసమే హైదరాబాద్‌కు వచ్చారంటూ కామెంట్స్‌ వినిపిస్తున్నాయి. ప్రస్తుతం ప్రియాంకా ఎయిర్ పోర్టు వీడియోలు నెట్టింట బాగా వైరల్ అవుతున్నాయి.

జక్కన్న సినిమాలో విదేశీ నటులు

ప్రియాంకా చోప్రా రాకతో ఈ సినిమా షూటింగ్‌పై త్వరలోనే అధికారిక అప్‌డేట్‌ వచ్చే అవకాశం ఉందని ఫ్యాన్స్‌ భావిస్తున్నారు. ఇటీవలే చిత్రబృందం హైదరాబాద్‌లో పూజా కార్యక్రమాల్ని నిర్వహించి సినిమాకు శ్రీకారం చుట్టిన విషయం తెలిసిందే. అమెజాన్‌ అడవుల (Amazon Forest) నేపథ్యంలో సాగే ఈ కథలో పలువురు ఫారిన్ నటులు నటించనున్నట్లు సమాచారం.

సరికొత్త లుక్ లో మహేశ్ బాబు

దుర్గా ఆర్ట్స్‌పై కె.ఎల్‌.నారాయణ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. వెండితెరపై సరికొత్త లుక్‌లో మహేశ్‌ (Mahesh Babu) కనిపించనున్నారు. ఇప్పటికే ఆయన లుక్స్ వైరల్ అయిన విషయం తెలిసిందే. తాజాగా మ్యూజిక్‌ డైరెక్టర్‌ తమన్‌ ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ ‘హాలీవుడ్‌కు జేమ్స్‌ బాండ్‌ ఎలానో.. టాలీవుడ్‌కు మహేశ్‌ అలాగా. ఈ సినిమా అలవోకగా రూ.1000 కోట్లు సాధిస్తుందని అన్నారు.

Related Posts

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఈ పేరు ఎలా వచ్చిందో మీకు తెలుసా? అసలు స్టోరీ ఇదే!

మెగాస్టార్ చిరంజీవి తమ్ముడిగా సినీ ఇండస్ట్రీలో అడుగు పెట్టి ఎంతోమంది అభిమానుల గుండెల్లో చిరస్థాయిగా నిలిచిపోయే పేరును సంపాదించుకున్నాడు పవన్ కళ్యాణ్. ఇటు రాజకీయాల్లో పవన్ కల్యాణ్ తనకంటూ ఓ ప్రత్యేక గుర్తింపును సాధించారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రిగా కొనసాగుతున్నాడు.…

సినిమాల్లోనే కాదు.. సీరియల్ ల్లో కూడా మెరిసిన అనుష్క!

పూరీ జగన్నాథ్ దర్శకత్వంలో నాగార్జున హీరోగా నటించిన 2005లో వచ్చిన సూపర్ సినిమా ద్వారా తెలుగు ప్రేక్షకులకు పరిచయం అయింది అనుష్క శెట్టి. ఆ తర్వాత మహానంది, విక్రమార్కుడు, అస్త్రం, అరుంధతి, బాహుబలి వంటి బిగ్ హిట్స్‌లో నటించి, టాప్ హీరోయిన్‌గా…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *