SSMB29 అప్డేట్.. US నుంచి హైదరాబాద్‌కు ప్రియాంక చోప్రా

ప్రస్తుతం సినీ ప్రియులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న ప్రాజెక్టు #SSMB29. మహేశ్‌బాబు హీరోగా దర్శకధీరుడు రాజమౌళి (SS Rajamouli) తెరకెక్కించనున్న ఈ సినిమా గురించి ఎప్పుడెప్పుడు అప్డేట్ వస్తుందా అని ఎదురుచూస్తున్నారు. ఇటీవలే ఈ చిత్రానికి సంబంధించి పూజా కార్యక్రమాలు జరిగినట్లు వార్తలు వచ్చాయి. కానీ చిత్రబృందం మాత్రం అధికారికంగా ప్రకటన చేయలేదు. ఇక ఈ మూవీలో మహేశ్ సరసన హాలీవుడ్ బ్యూటీ ప్రియాంకా చోప్రా నటిస్తుందనే వార్త వైరల్ అయిన విషయం తెలిసిందే.

హైదరాబాద్ లో ప్రియాంకా చోప్రా

అయితే తాజాగా ఈ వార్త నిజమేనని రుజువు చేసేలా గ్లోబల్ స్టార్ ప్రియాంకా చోప్రా (Priyanka Chopra) హైదరాబాద్ లో కనిపించింది. లాస్‌ ఏంజెలెస్‌ నుంచి ఆమె హైదరాబాద్ ఎయిర్ పోర్టుకు చేరుకుంది. అయితే ఆమె మహేశ్‌- రాజమౌళి ప్రాజెక్ట్‌ కోసమే హైదరాబాద్‌కు వచ్చారంటూ కామెంట్స్‌ వినిపిస్తున్నాయి. ప్రస్తుతం ప్రియాంకా ఎయిర్ పోర్టు వీడియోలు నెట్టింట బాగా వైరల్ అవుతున్నాయి.

జక్కన్న సినిమాలో విదేశీ నటులు

ప్రియాంకా చోప్రా రాకతో ఈ సినిమా షూటింగ్‌పై త్వరలోనే అధికారిక అప్‌డేట్‌ వచ్చే అవకాశం ఉందని ఫ్యాన్స్‌ భావిస్తున్నారు. ఇటీవలే చిత్రబృందం హైదరాబాద్‌లో పూజా కార్యక్రమాల్ని నిర్వహించి సినిమాకు శ్రీకారం చుట్టిన విషయం తెలిసిందే. అమెజాన్‌ అడవుల (Amazon Forest) నేపథ్యంలో సాగే ఈ కథలో పలువురు ఫారిన్ నటులు నటించనున్నట్లు సమాచారం.

సరికొత్త లుక్ లో మహేశ్ బాబు

దుర్గా ఆర్ట్స్‌పై కె.ఎల్‌.నారాయణ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. వెండితెరపై సరికొత్త లుక్‌లో మహేశ్‌ (Mahesh Babu) కనిపించనున్నారు. ఇప్పటికే ఆయన లుక్స్ వైరల్ అయిన విషయం తెలిసిందే. తాజాగా మ్యూజిక్‌ డైరెక్టర్‌ తమన్‌ ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ ‘హాలీవుడ్‌కు జేమ్స్‌ బాండ్‌ ఎలానో.. టాలీవుడ్‌కు మహేశ్‌ అలాగా. ఈ సినిమా అలవోకగా రూ.1000 కోట్లు సాధిస్తుందని అన్నారు.

Related Posts

Allu Kanakaratnamma: అల్లు అర్జున్ ఇంట విషాదం.. అల్లు కనకరత్నమ్మ కన్నుమూత

టాలీవుడ్‌(Tollywood)లో ప్రముఖ నిర్మాత, గీతా ఆర్ట్స్ అధినేత అల్లు అరవింద్(Allu Aravind) ఇంట తీవ్ర విషాదం నెలకొంది. ఆయన తల్లి, దివంగత హాస్య నటుడు అల్లు రామలింగయ్య భార్య అల్లు కనకరత్నమ్మ (Allu Kanakaratnamma, 94) శనివారం తెల్లవారుజామున 1:45 గంటలకు…

Megastar Chiranjeevi: చిరూని కలిసి మహిళా వీరాభిమాని.. రాఖీ కట్టి తీవ్ర భావోద్వేగం 

కర్నూలు జిల్లా ఆదోనికి చెందిన మెగాస్టార్ చిరంజీవి(Megastar Chiranjeevi) వీరాభిమాని రాజేశ్వరి(Rajeshwari), తన ఆరాధ్య నటుడిని కలిసేందుకు సైకిల్‌(Cycle)పై సుదీర్ఘ ప్రయాణం చేసి హైదరాబాద్(Hyderabad) చేరుకున్నారు. ఈ సంఘటన చిరంజీవిని ఆశ్చర్యంలో ముంచెత్తడమే కాక, అభిమానుల హృదయాలను కూడా కదిలించింది. రాజేశ్వరి…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *