తెలుగు చిత్రపరిశ్రమ(Tollywood)లో గతకొంత కాలంగా కొనసాగుతున్న నిర్మాతలు, సినీ కార్మికుల(Producers and film workers) మధ్య వేతనాల వివాదానికి చెక్ పెట్టేందుకు మెగాస్టార్ చిరంజీవి(Megastar Chiranjeevi) రంగంలోకి దిగారు. ఇద్దరి మధ్య వేతనాల పెంపు విషయంలో సయోధ్య కుదరకపోవడంతో షూటింగ్(Shootings)లు నిలిచిపోయిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో చిత్రపరిశ్రమ సమస్యను చక్కదిద్దేందుకు మెగాస్టార్ చొరవ తీసుకున్నారు. ఇందులో భాగంగా తన నివాసంలో ప్రముఖ నిర్మాతలతో ప్రత్యేకంగా సమావేశమై పరిస్థితిని సమీక్షించారు. ఈ భేటీలో నిర్మాతలు అశ్వనీదత్, అల్లు అరవింద్(Allu Aravind), దిల్ రాజు(Dil Raju), సి. కళ్యాణ్, దామోదర ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు.
10 నుంచి 15 శాతం పెంపునకు సిద్ధం
ఈ సందర్భంగా కార్మికులు డిమాండ్ చేస్తున్న 30% వేతనాల పెంపు ఎందుకు సాధ్యపడటం లేదనే వివరాలను నిర్మాతలు చిరంజీవికి వివరించారు. ఇప్పటికే తాము 10 నుంచి 15 శాతం పెంపునకు సిద్ధంగా ఉన్నామని, అంతకుమించి పెంచితే చిన్న బడ్జెట్ చిత్రాల నిర్మాతలు తీవ్రంగా నష్టపోతారని వారు ఆవేదన వ్యక్తం చేశారు. ఇక చిరంజీవి నివాసంలో నిర్మాతల సమావేశం ముగిసిన అనంతరం నిర్మాత సి.కల్యాణ్(Producer C. Kalyan) మీడియాతో మాట్లాడారు. ఈ వివాదంపై చిరు విచారం వ్యక్తం చేశారని, షూటింగ్లు బంద్ కావడం బాధాకరమని చెప్పారని తెలిపారు. సినీ కార్మికుల సమస్యల(Problems of film workers)ను కూడా విని పరిష్కారానికి కృషి చేస్తానని చిరంజీవి హామీ ఇచ్చారని ఆయన అన్నారు.
త్వరలో సినీ కార్మిక నాయకులతో చిరంజీవి భేటీ
ఈ సమస్యపై రెండు రోజులు వేచి చూద్దామని, అనంతరం తన అభిప్రాయాన్ని తెలియజేస్తానని చిరంజీవి(Chiranjeevi) చెప్పినట్టు కళ్యాణ్ వివరించారు. త్వరలో చిరంజీవి సినీ కార్మిక నాయకులతోనూ భేటీ కానున్నారని, వారి వాదనలు కూడా విన్న తర్వాత ఒక పరిష్కారానికి వస్తారని ఆయన తెలిపారు. చిన్న నిర్మాతల విషయంలోనే ఈ వేతనాల సమస్య వస్తుందని, వారితో చర్చించిన తర్వాతే నిర్ణయాలు తీసుకుంటామని కళ్యాణ్ పేర్కొన్నారు.
#ShootingStrikes :#Chiranjeevi ఇంట్లో ముగిసిన నిర్మాతల సమావేశం
షూటింగ్స్ సడెన్ గా ఆపడం భావ్యం కాదు మీ సమస్యలు చెప్పారు అటు వైపు కార్మికుల వెర్షన్ ను కూడా తెలుసుకుంటానని చెప్పిన చిరంజీవి.
పరిస్థితి చక్కబడకపోతే జోక్యం చేసుకుంటానని చెప్పిన చిరంజీవి.#Tollywood #TFI #News pic.twitter.com/RIMLspUs65
— IndiaGlitz Telugu™ (@igtelugu) August 5, 2025






