PBKS vs CSK: టాస్ నెగ్గిన పంజాబ్.. బ్యాటింగ్ ఎంచుకున్న శ్రేయస్

IPL 2025లో భాగంగా చండీగఢ్‌లోని ముల్లాన్‌పూర్ వేదికగా జరుగుతున్న మ్యాచులో పంజాబ్ కింగ్స్ వర్సెస్ చెన్నై సూపర్ కింగ్స్(PBKS vs CSK) జట్లు తలపడుతున్నాయి. ఈ మ్యాచులో టాస్ నెగ్గిన పంజాబ్ కెప్టెన్ శ్రేయస్ అయ్యర్(Shreyas Ayyar) తొలుత బ్యాటింగ్ ఎంచుకున్నాడు.

కాగా ఈ మ్యాచులో రెండు జట్లు గత మ్యాచులో ఆడిన టీమ్‌లతోనే బరిలోకి దిగుతున్నాయి. ఇప్పటి వరకూ పంజాబ్ 3 మ్యాచులు ఆడి రెండింట్లో నెగ్గింది. అటు చెన్నై నాలుగు మ్యాచులు ఆడి రెండింట్లో ఓడి, మరో రెండు గెలిచింది. దీంతో ఈ మ్యాచులో గెలిచి పాయింట్ల పట్టికలో ముందడుకు వేయాలని ఇరుజట్లు భావిస్తున్నాయి.

తుది జట్లు ఇవే..

పంజాబ్ కింగ్స్ (ప్లేయింగ్ XI): ప్రియాంష్ ఆర్య, ప్రభ్‌సిమ్రాన్ సింగ్(WK), శ్రేయస్ అయ్యర్(C), శశాంక్ సింగ్, మార్కస్ స్టోయినిస్, నెహాల్ వధేరా, గ్లెన్ మాక్స్‌వెల్(Maxwell), మార్కో జాన్సెన్, అర్ష్‌దీప్ సింగ్, లాకీ ఫెర్గూసన్, యుజ్వేంద్ర చాహల్

చెన్నై సూపర్ కింగ్స్ (ప్లేయింగ్ XI): రచిన్ రవీంద్ర, డెవాన్ కాన్వే, రుతురాజ్ గైక్వాడ్(C), విజయ్ శంకర్, రవీంద్ర జడేజా, ఎంఎస్ ధోనీ(WK), రవిచంద్రన్ అశ్విన్, నూర్ అహ్మద్, ముఖేష్ చౌదరి, ఖలీల్ అహ్మద్, మతీషా పతిరణ

Related Posts

Kaleshwaram Project: కాళేశ్వరం ప్రాజెక్టుపై సీబీఐ విచారణ.. ప్రభుత్వం సంచలన నిర్ణయం

కాళేశ్వరం ప్రాజెక్టు(Kaleshwaram Project) నిర్మాణంలో అక్రమాలు జరిగాయని ఆరోపించిన కాంగ్రెస్ సర్కార్(Congress Govt).. అందుకోసం జస్టిస్ పీసీ ఘోష్(Justice PC Ghosh) కమిషన్‌ను ఏర్పాటు చేసిన విషయం తెలిసిందే. దీనిపై కమిషన్ దాదాపు 650 పేజీలతో కూడిన నివేదికను ప్రభుత్వానికి అందజేసింది.…

ఆదోని నుంచి సైకిల్‌పై వచ్చిన అభిమానికి మెగాస్టార్ ఇచ్చిన అద్భుతమైన గిఫ్ట్! వీడియో వైరల్..

మెగాస్టార్ చిరంజీవి(Chiranjeevi) పట్ల అభిమానులు చూపించే ప్రేమ మరోసారి బయటపడింది. ఆదోని(Adoni) నుంచి హైదరాబాద్(Hyderadad) వరకు సైకిల్‌పై ఒంటరిగా ప్రయాణించి వచ్చిన మహిళా అభిమాని రాజేశ్వరి(Rajeshwari) అందరినీ కదిలించింది. ఎన్ని కష్టాలు, అడ్డంకులు ఎదురైనా తన ఆరాధ్య నటుడిని చూడాలన్న తపన…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *