PBKS vs RCB: చిన్నస్వామిలో ఆర్సీబీ చిత్తు.. 5 వికెట్ల తేడాతో కింగ్స్ గెలుపు

ఐపీఎల్ 2025లో ఆర్సీబీ మళ్లీ అదే కథ. సొంతగడ్డపై ఆ జట్టు మరోసారి చతికిలబడింది. వర్షం కారణంగా ఆలస్యంగా ప్రారంభమైన ఈ మ్యాచులో పంజాబ్ కింగ్స్ RCBని 5 వికెట్లతో చిత్తు చేసింది. PBKSపై ఓడిన RCB ఓ చెత్త రికార్డ్ మూటగట్టుకుంది. హోంగ్రౌండ్‌లో 46 మ్యాచులు ఓడిన జట్టుగా నిలిచింది. గతంతో ఈ రికార్డ్ ఢిల్లీ క్యాపిటల్స్(DC) పేరిట ఉండేది. ఆ జట్టు అరుణ్‌జైట్లీ స్టేడియంలో 45 మ్యాచులు ఓడింది. ఈ గెలుపుతో పంజాబ్ పాయింట్ల పట్టికలో 2వ స్థానానికి ఎగబాకగా.. RCB 4వ స్థానానికి పడిపోయింది.

సగం ఆట వరుణుడే ఆడేశాడు..

వరుణుడు ఆటంకం కలిగించిన ఈ మ్యాచులో ఓవర్లను కుదించారు. ఇరు జట్లకు చెరో 14 ఓవర్లు కేటాయించారు. దీంతో వర్షం తగ్గాక టాస్ నెగ్గిన పంజాబ్ బౌలింగ్ ఎంచుకుంది. వాన పడటం, పిచ్‌ కవర్లతో మూసి ఉంచడం ఆ జట్టు బౌలర్లకు కలిసొచ్చింది. దీంతో బెంగళూరు బ్యాటర్లను బెంబేలెత్తించారు. ఆర్సీబీలో  సాల్ట్ 4, కోహ్లీ 1, పాటీదార్ 23, లివింస్టోన్ 4, జితేశ్ 2, పాండ్య 1, మనోజ్ 1, భువనేశ్వర్ 8, దయాల్ 0, హేజిల్ వుడ్ (0*) తీవ్రంగా నిరాశపర్చారు. చివర్లో టిమ్ డేవిడ్ (50*) సూపర్ ఫిఫ్టీ చేయడంతో ఆ జట్టు నిర్ణీత 14 ఓవర్లలో 95/9 స్కోరు చేసింది. పంజాబ్ బౌలర్లలో  అర్షదీప్, జాన్సెన్, చాహల్, హర్ప్రీత్ తలో 2 వికెట్లు తీయగా.. బార్ట్‌లెట్ ఒక వికెట్ పడగొట్టాడు.

వధేరా వధించేశాడు..

అనంతరం 96 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన పంజాబ్‌కు ప్రియాన్ష్ 16, ప్రభ్ సిమ్రన్ 13, శ్రేయస్ 7, ఇంగ్లిస్ 14, వధేరా 33, శశాంక్ 1, స్టొయినిస్ 7 పరుగులు చేసి విజయం అందించారు. దీంతో 5 వికెట్ల తేడాతో బెంగళూరును చిత్తు చేసింది. ఆర్సీబీ బౌలర్లలో హేజిల్ వుడ్ 3, భువనేశ్వర్ 2 వికెట్లు తీశారు. కాగా ఇవాళ ఐపీఎల్‌లో రెండు మ్యాచులు జరగనున్నాయి. మధ్యాహ్నం  3.30కి GTతో ఢిల్లీ.. రాత్రి 7.30కి జైపూర్‌లో రాజస్థాన్‌తో లక్నో తలపడనున్నాయి.

Indian Premier League Official Website

Related Posts

Kaleshwaram Project: కాళేశ్వరం ప్రాజెక్టుపై సీబీఐ విచారణ.. ప్రభుత్వం సంచలన నిర్ణయం

కాళేశ్వరం ప్రాజెక్టు(Kaleshwaram Project) నిర్మాణంలో అక్రమాలు జరిగాయని ఆరోపించిన కాంగ్రెస్ సర్కార్(Congress Govt).. అందుకోసం జస్టిస్ పీసీ ఘోష్(Justice PC Ghosh) కమిషన్‌ను ఏర్పాటు చేసిన విషయం తెలిసిందే. దీనిపై కమిషన్ దాదాపు 650 పేజీలతో కూడిన నివేదికను ప్రభుత్వానికి అందజేసింది.…

ఆదోని నుంచి సైకిల్‌పై వచ్చిన అభిమానికి మెగాస్టార్ ఇచ్చిన అద్భుతమైన గిఫ్ట్! వీడియో వైరల్..

మెగాస్టార్ చిరంజీవి(Chiranjeevi) పట్ల అభిమానులు చూపించే ప్రేమ మరోసారి బయటపడింది. ఆదోని(Adoni) నుంచి హైదరాబాద్(Hyderadad) వరకు సైకిల్‌పై ఒంటరిగా ప్రయాణించి వచ్చిన మహిళా అభిమాని రాజేశ్వరి(Rajeshwari) అందరినీ కదిలించింది. ఎన్ని కష్టాలు, అడ్డంకులు ఎదురైనా తన ఆరాధ్య నటుడిని చూడాలన్న తపన…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *