Rabinhood: నితిన్ కెరీర్‌లోనే హయ్యెస్ట్ నాన్ థియేట్రికల్ బిజినెస్!

హీరో నితిన్(Nitin), అందాల భామ శ్రీలీల(Sreelaala) జంటగా నటిస్తున్న లేటెస్ట్ మూవీ రాబిన్‌హుడ్(Rabinhood). చలో, భీష్మ లాంటి సినిమాలు డైరెక్ట్ చేసిన వెంకీ కుడుముల(Venky Kudumula) దర్శకత్వంలో ఈ సినిమా రూపొందుతోంది. మైత్రి మూవీ మేకర్స్(Mythri Movie Makers) బ్యానర్ మీద అత్యంత ప్రతిష్ఠాత్మకంగా నిర్మిస్తున్న ఈ మూవీ ఈ నెల 28న థియేటర్లలోకి రానుంది. ఇప్పటికే సినిమా నుంచి విడుదలవుతున్న ప్రమోషనల్ స్టఫ్ అంచనాలను హైప్ చేస్తోంది. తాజాగా రిలీజ్ చేసిన కేతిక శర్మ(Kethika Sharma) ఐటెం సాంగ్ కుర్రకారును తెగ ఆకట్టుకునేలా చేస్తోంది. శేఖర్ మాస్టర్(Shekar Master) కొరియోగ్రఫీ మీద విమర్శలు వినిపిస్తున్నా సాంగ్ బాగుండడంతో ప్రేక్షకులు ఈ మూవీ కోసం ఇంట్రెస్టింగ్‌గా ఎదురు చూస్తున్నారు.

Robinhood : నితిన్ 'రాబిన్ హుడ్' అప్డేట్.. దొంగ‌తో రొమాన్స్  చేయ‌నున్న‌దెవ‌రో తెలుసా..? | Nithin robinhood movie crazy update sreeleela  joins in team-10TV Telugu

అత్యంత భారీ రేటుకు తెలుగు రైట్స్

ఇదిలా ఉండగా ఈ సినిమాకి సంబంధించి ఒక ఆసక్తికరమైన వార్త టీటౌన్లో చక్కర్లు కొడుతోంది. అదేంటంటే ఈ సినిమాకి నితిన్ కెరీర్‌లోనే అత్యంత హైయెస్ట్ నాన్ థియేట్రికల్ బిజినెస్(Highest Non-Theatrical Business) జరిగినట్లుగా తెలుస్తోంది. ఈ సినిమా OTT రైట్స్ ZEE5 సంస్థ కొనుగోలు చేయగా శాటిలైట్ రైట్స్ జీ తెలుగు దక్కించుకుంది. నితిన్ కెరీర్‌లోనే అత్యంత భారీ రేటుకు తెలుగు రైట్స్ దక్కించుకున్నట్లు తెలుస్తోంది.

సినిమా హిట్ టాక్ తెచ్చుకుంటే..

ఇక హిందీ డబ్బింగ్ రైట్స్‌తో పాటు ఇతర భాషల డబ్బింగ్ రైట్స్ కూడా నిర్మాత దగ్గరే ఉన్నాయని చెబుతున్నారు. సినిమా హిట్ టాక్ తెచ్చుకుంటే వాటిని కూడా ZEE5 సంస్థ మంచి రేటుకి కొనుగోలు చేసే అవకాశం ఉందని సినీవర్గాలు అభిప్రాయపడుతున్నాయి. మరి ఈ మూవీ బాక్సాఫీస్(Boxoffice) వద్ద భారీ హిట్ అందుకుంటుందా? లేదా? తెలియాలంటే మరో 15 రోజులు ఆగాల్సిందే.

Related Posts

Mahesh Babu | వారణాసి ఈవెంట్‌లో రాజమౌళి స్ట‌న్నింగ్ కామెంట్స్

Mahesh Babu | సూపర్ స్టార్ మహేశ్‌బాబు—దర్శకధీరుడు ఎస్‌ఎస్‌ రాజమౌళి కాంబినేషన్‌లో వస్తున్న అత్యంత భారీ యాక్షన్ అడ్వెంచర్ ఫిల్మ్ “వారణాసి” పై ఆసక్తి రోజురోజుకూ పెరుగుతోంది. గ్లోబ్ ట్రోటర్ ఈవెంట్‌లో విడుదలైన స్పెషల్ వీడియోకు ప్రేక్షకుల నుంచి అద్భుత స్పందన…

Kaleshwaram Project: కాళేశ్వరం ప్రాజెక్టుపై సీబీఐ విచారణ.. ప్రభుత్వం సంచలన నిర్ణయం

కాళేశ్వరం ప్రాజెక్టు(Kaleshwaram Project) నిర్మాణంలో అక్రమాలు జరిగాయని ఆరోపించిన కాంగ్రెస్ సర్కార్(Congress Govt).. అందుకోసం జస్టిస్ పీసీ ఘోష్(Justice PC Ghosh) కమిషన్‌ను ఏర్పాటు చేసిన విషయం తెలిసిందే. దీనిపై కమిషన్ దాదాపు 650 పేజీలతో కూడిన నివేదికను ప్రభుత్వానికి అందజేసింది.…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *