Coolie: సెన్సార్ పూర్తి చేసుకున్న రజినీకాంత్ ‘కూలీ’.. నేడు ట్రైలర్ విడుదల

సూపర్ స్టార్ రజినీకాంత్(Rajinikanth) నటించిన ‘కూలీ(Coolie)’ చిత్రం సెన్సార్ కార్యక్రమాలను పూర్తి చేసుకుంది. లోకేష్ కనకరాజ్(Lokesh Kanagaraj) దర్శకత్వంలో సన్ పిక్చర్స్ బ్యానర్‌పై నిర్మితమైన ఈ పాన్-ఇండియా చిత్రం ఆగస్టు 14న ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్‌గా విడుదల కానుంది. సెన్సార్(Censor board) బోర్డు ఈ చిత్రానికి ‘A’ సర్టిఫికెట్ జారీ చేసింది. అంటే ఈ సినిమా పెద్దలకు మాత్రమే పరిమితం. లోకేష్ సినిమాల్లో సాధారణంగా ఉండే తీవ్రమైన వైలెన్స్ ఈ సర్టిఫికెట్‌కు కారణమని అభిమానులు భావిస్తున్నారు. ఈ వార్తతో రజినీ ఫ్యాన్స్‌లో ఆసక్తి మరింత పెరిగింది. అయితే కొందరు షాక్‌కు గురవుతున్నారు.

రూ.400 కోట్ల బడ్జెట్‌తో..

ఈ చిత్రంలో రజినీకాంత్‌తో పాటు నాగార్జున(Nagarjuna) విలన్ పాత్రలో, ఉపేంద్ర(Upendra), శృతి హాసన్, సౌబిన్ షబీర్ కీలక పాత్రల్లో నటిస్తున్నారు. బాలీవుడ్ స్టార్ ఆమిర్ ఖాన్(Amir Khan) గెస్ట్ రోల్‌లో కనిపించనున్నాడు. అనిరుధ్ రవిచందర్ సంగీతం సమకూర్చగా, పవర్‌హౌస్ సాంగ్ ఇప్పటికే వైరల్‌గా మారింది. రూ.400 కోట్ల బడ్జెట్‌తో రూపొందిన ఈ చిత్రంలో రజినీ రెమ్యూనరేషన్‌గా 260 కోట్లు, నాగార్జునకు 24 కోట్లు ఇచ్చినట్లు సమాచారం. అమెజాన్ డెలివరీ బాక్స్‌లపై ప్రమోషన్స్ వంటి వినూత్న వ్యూహాలతో సినిమాపై హైప్ భారీగా పెరిగింది. ఆగస్టు 2న ట్రైలర్(Trailer) విడుదల కానుంది. ఈ మేరకు శనివారం సాయంత్రం 7 గంటలకు రిలీజ్ చేస్తామని చిత్ర యూనిట్ వెల్లడించింది. ఇప్పటికే విడుదలైన సాంగ్స్ సినిమాపై హైప్‌ను పెంచగా, నేడు రిలీజయ్యే ట్రైలర్ అంచనాలను మరింత పెంచుతుందని చిత్ర యూనిట్ భావిస్తోంది.

Chikitufied storm incoming – Coolie first single promo sends fans into a  frenzy

Related Posts

Mahesh Babu | వారణాసి ఈవెంట్‌లో రాజమౌళి స్ట‌న్నింగ్ కామెంట్స్

Mahesh Babu | సూపర్ స్టార్ మహేశ్‌బాబు—దర్శకధీరుడు ఎస్‌ఎస్‌ రాజమౌళి కాంబినేషన్‌లో వస్తున్న అత్యంత భారీ యాక్షన్ అడ్వెంచర్ ఫిల్మ్ “వారణాసి” పై ఆసక్తి రోజురోజుకూ పెరుగుతోంది. గ్లోబ్ ట్రోటర్ ఈవెంట్‌లో విడుదలైన స్పెషల్ వీడియోకు ప్రేక్షకుల నుంచి అద్భుత స్పందన…

Kaleshwaram Project: కాళేశ్వరం ప్రాజెక్టుపై సీబీఐ విచారణ.. ప్రభుత్వం సంచలన నిర్ణయం

కాళేశ్వరం ప్రాజెక్టు(Kaleshwaram Project) నిర్మాణంలో అక్రమాలు జరిగాయని ఆరోపించిన కాంగ్రెస్ సర్కార్(Congress Govt).. అందుకోసం జస్టిస్ పీసీ ఘోష్(Justice PC Ghosh) కమిషన్‌ను ఏర్పాటు చేసిన విషయం తెలిసిందే. దీనిపై కమిషన్ దాదాపు 650 పేజీలతో కూడిన నివేదికను ప్రభుత్వానికి అందజేసింది.…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *