
ప్రజెంట్ సినీ ఇండస్ట్రీలో నేషన్ క్రష్ రష్మిక మందన్న(Rashmika Mandanna) జోరు కొనసాగుతోంది. టాలీవుడ్(Tollywood), బాలీవుడ్(Bollywood) అనే తేడా లేకుండా వరుసబెట్టి ఆఫర్లు సొంతం చేసుకుంటోంది. దీంతో దక్షిణాది ఇండస్ట్రీలలో ఆమె పట్టిందల్లా బంగారమే అవుతోంది. ఇటీవల యానిమల్(Animal), పుష్ప-2(Pushpa2)తో సూపర్ డూపర్ హిట్ కొట్టిన ఈ అమ్మడు.. తాజాగా మరో హిందీ సినిమాతో సక్సెస్ సాధించింది. రష్మిక హిందీలో నటించిన ‘ఛావా(Chhaava)’ మూవీ వాలంటైన్స్ డే కానుకగా రిలీజై సూపర్ హిట్ టాక్ సొంతం చేసుకుంటోంది. అయితే ఆమె ఈ మూవీ ప్రమోషన్స్(Promotions)లో భాగంగా చేసిన కామెంట్స్ ఇప్పుడు ఆమెకు వివాదాన్ని కొనితెచ్చాయి. ఇంతకీ రష్మిక ఏం చేసిందో తెలుసుకుందామా..
నేషనల్ క్రష్ రష్మిక మరో వివాదంలో చిక్కుకుంది. ‘ఛావా’ ప్రమోషన్స్(Chhaava Promotions)లో భాగంగా తాను హైదరాబాద్(Hyderabad) నుంచి వచ్చానని చెప్పిందీ అమ్మడు. “నేను హైదరాబాద్ నుంచి వచ్చాను. ఇక్కడి ప్రేక్షకులు నాపై చూపిస్తోన్న ప్రేమాభిమానాలు చూస్తుంటే ఎంతో సంతోషంగా ఉంది” అని స్పీచ్ ఇచ్చింది. రష్మిక ఇలా అనడం ఇప్పుడు కర్ణాటక(Karnataka)లో చర్చకు దారితీసింది.
‘@iamRashmika, I sometimes feel pity for you for receiving unnecessary negativity/targeting from our fellow Kannadigas.
But when you make statements like this I think they are right and you deserve the backlash.👍#Kannada #Chaava #RashmikaMandanna pic.twitter.com/RBY7RcpHgP— Virat👑Rocky✨️ (@Virat_Rocky18) February 14, 2025
ఎప్పుడు హైదరాబాదీ అయిందో చెప్పాలని డిమాండ్
దీంతో ఆమె వ్యాఖ్యలను తప్పుపడుతూ నటిపై కన్నడిగులు కన్నెర్ర చేస్తున్నారు. సొంతూరు విరాజ్పేట(Viraajpeta) గురించి చెప్పకపోవడాన్ని కన్నడ వాసులు సోషల్ మీడియా(SM)లో తప్పుపడుతున్నారు. కర్ణాటకకు చెందిన రష్మిక ఎప్పుడు హైదరాబాదీ అయిందో చెప్పాలని నెట్టింట పోస్టులు పెడుతున్నారు. ఇప్పటికే కన్నడలో ఆమె సినిమాలు చేయకపోవడం పట్ల కూడా కన్నడిగులు(Kannadigas) తీవ్ర అసహనం వ్యక్తం చేస్తున్న విషయం తెలిసిందే.