కోల్​కతా ట్రైనీ డాక్టర్​ కేసు.. నేడే కోర్టు తీర్పు

దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన కోల్‌కతాలో ఆర్జీకర్‌ ఆస్పత్రి డాక్టర్ (RG Kar Hospital Case) హత్యాచార కేసులో నేడు తీర్పు వెలువడనుంది. బంగాల్‌లోని సీల్దా కోర్టు శనివారం తీర్పు వెల్లడించనుంది. గతేడాది ఆగస్టు 9వ తేదీన జరిగిన ఈ హత్యాచార ఘటన దేశవ్యాప్తంగా పెను దుమారం రేపిన విషయం తెలిసిందే. ఆ మరుసటి రోజే ప్రధాన నిందితుడు సివిక్‌ వాలంటీర్‌ సంజయ్‌ రాయ్‌ను పోలీసులు అరెస్టు చేయగా.. కలకత్తా హైకోర్టు ఆదేశాల మేరకు ఈ కేసును సీబీఐ దర్యాప్తు చేసింది.

మరణశిక్ష విధించాలి

డీఎన్​ఏ రిపోర్టులు సహా అనేక ఆధారాలను సీబీఐ (CBI).. కోర్టు  ముందుంచింది. నిందితుడు సంజయ్‌ రాయ్‌కు మరణశిక్ష విధించాలని కోర్టును కోరింది. మరోవైపు సంజయ్‌ రాయ్‌ తరఫు న్యాయవాదులు మాత్రం తమ అతడు నిర్దోషి అని, తమ క్లయింట్ కు వ్యతిరేకంగా సాక్ష్యాధారాలను చిత్రీకరించి ఈ కేసులో ఇరికించారని కోర్టుకు వివరించారు. జనవరి 9వ తేదీన ఈ కేసులో వాదనలు పూర్తి కాగా.. ఇవాళ తీర్పు వెలువడనుంది.

నిందితుడి ప్రవర్తనలో మార్పు

మరోవైపు తీర్పు తేదీ దగ్గరపడిన వేళ నిందితుడు సంజయ్‌ రాయ్‌ (Sanjay Roy) ప్రవర్తనలో మార్పు వచ్చినట్లు జైలు వర్గాలు తెలిపినట్లు సమాచారం. ఆహారం, ఔషధాలు తీసుకోవడం నిందితుడు తగ్గించాడని.. నిందితున్ని ప్రత్యేక సెల్‌లో ఉంచి అతనిపై నిరంతరం నిఘా ఉంచినట్లు తెలిసింది. అతని కార్యకలాపాలు పర్యవేక్షించడానికి సీసీటీవీ కెమెరాలు ఏర్పాటు చేసినట్లు జైలు వర్గాలు తెలిపాయి.

దర్యాప్తు సగమే జరిగింది

మరోవైపు హత్యాచార కేసులో (Kolkata Doctor Case Update) తీర్పు రానున్న వేళ ఈ కేసులో దర్యాప్తు సగమే జరిగిందని బాధితురాలి తల్లిదండ్రులు ఆరోపించారు. ఈ కేసుకు సంబంధించిన ఇతర నిందితులు స్వేచ్ఛగా తిరుగుతున్నారని.. తమ కుమార్తెకు న్యాయం జరిగే వరకు పోరాడతామని తేల్చి చెప్పారు. “సంజయ్‌ రాయ్‌ తప్పు చేశాడు. కోర్టు అతడికి వ్యతిరేకంగా తీర్పు ఇస్తుంది. అయితే ఇతర నేరస్థుల మాట ఏంటి?” అని బాధితురాలి తల్లి ప్రశ్నించారు.

Related Posts

Kaleshwaram Project: కాళేశ్వరం ప్రాజెక్టుపై సీబీఐ విచారణ.. ప్రభుత్వం సంచలన నిర్ణయం

కాళేశ్వరం ప్రాజెక్టు(Kaleshwaram Project) నిర్మాణంలో అక్రమాలు జరిగాయని ఆరోపించిన కాంగ్రెస్ సర్కార్(Congress Govt).. అందుకోసం జస్టిస్ పీసీ ఘోష్(Justice PC Ghosh) కమిషన్‌ను ఏర్పాటు చేసిన విషయం తెలిసిందే. దీనిపై కమిషన్ దాదాపు 650 పేజీలతో కూడిన నివేదికను ప్రభుత్వానికి అందజేసింది.…

ఆదోని నుంచి సైకిల్‌పై వచ్చిన అభిమానికి మెగాస్టార్ ఇచ్చిన అద్భుతమైన గిఫ్ట్! వీడియో వైరల్..

మెగాస్టార్ చిరంజీవి(Chiranjeevi) పట్ల అభిమానులు చూపించే ప్రేమ మరోసారి బయటపడింది. ఆదోని(Adoni) నుంచి హైదరాబాద్(Hyderadad) వరకు సైకిల్‌పై ఒంటరిగా ప్రయాణించి వచ్చిన మహిళా అభిమాని రాజేశ్వరి(Rajeshwari) అందరినీ కదిలించింది. ఎన్ని కష్టాలు, అడ్డంకులు ఎదురైనా తన ఆరాధ్య నటుడిని చూడాలన్న తపన…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *