Manchester Test Day-3: ఆశలు వదులుకోవాల్సిందేనా? నాలుగో టెస్టులో పట్టు బిగించిన ఇంగ్లండ్

మాంచెస్టర్(Manchester) వేదికగా టీమ్ఇండియా(Team India)తో జరుగుతున్న నాలుగో టెస్టులో మూడో రోజు కూడా ఇంగ్లండ్‌(England) ఆధిపత్యం కనబరిచింది. ఏకపక్షంగా సాగుతున్న మ్యాచ్‌లో ఆతిథ్య జట్టు పట్టు బిగించి భారీ స్కోరు దిశగా సాగుతోంది. ఇంగ్లండ్ బ్యాటర్లు బజ్‌బాల్(Buzz ball) ఆటతో విజృంభించడంతో ఆ జట్టును తిరుగులేని స్థితిలో నిలిచింది. దీంతో శుక్రవారం ఆట ముగిసే సమయానికి ఇంగ్లండ్ తొలి ఇన్నింగ్స్‌లో 7 వికెట్లు కోల్పోయి 544 స్కోరు సాధించింది. దీంతో 186 రన్స్ లీడ్ సాధించింది. ఓవర్‌నైట్ స్కోరు 225/2‌తో ఆ జట్టు ఆట కొనసాగించగా.. జోరూట్(150) భారీ శతకంతో కదం తొక్కాడు. ఓలీ పోప్(71) కూడా సత్తాచాటాడు. కెప్టెన్ బెన్ స్టోక్స్(Ben Stokes) ఆల్‌రౌండ్ షోతో ఆకట్టుకున్నాడు. ఐదు వికెట్లు తీసి టీమిండియా పతనాన్ని శాసించిన స్టోక్స్(77*) బ్యాటుతోనూ చెలరేగాడు. నాలుగో రోజైనా గిల్ సేన పుంజుకోకుంటే ఓటమి తప్పదు.

IND vs ENG 4th Test Highlights Day 3: England create 186-run lead, leave India bruised and battling for survival | Crickit

క్రీజులో పాతుకుపోయాడు..

ఇక మూడో రోజు ఆటలో ఇంగ్లండ్ ప్లేయర్ జో రూట్(Joe Root) ఆటే హైలైట్. భారత బౌలర్లు పెద్దగా ప్రభావం చూపకపోవడంతో అతడు ధాటిగా బ్యాటింగ్ చేశాడు. 11 రన్స్‌తో మూడో రోజును కొనసాగించిన రూట్ క్రీజులో పాతుకుపోయాడు. అతన్ని అవుట్ చేసేందుకు భారత బౌలర్లు(Indian Bowlers) చేసిన ప్రయత్నాలు ఫలించలేదు. నిదానంగా ఆడుతూనే చెత్త బంతులను బౌండరీలకు తరలించాడు. ఈ క్రమంలోనే టెస్టుల్లో 38వ శతకాన్ని పూర్తి చేశాడు. ఈ క్రమంలోనే 150 పరుగులు చేసి భారీ శతకాన్ని నమోదు చేశాడు. దీంతో టెస్టుల్లో 13,409 రన్స్ పూర్తి చేసిన రూట్ కీలక మైలురాయిని సాధించాడు.

Image

రెండో స్థానానికి ఎగబాకిన రూట్

కాగా ఈ సెంచరీ ద్వారా టెస్టుల్లో అత్యధిక రన్స్ చేసిన క్రికెటర్ల జాబితాలో రెండో స్థానానికి రూట్ ఎగబాకాడు. ఈ మ్యాచ్‌‌కు ముందు అతను 13, 259 రన్స్‌తో ఆ జాబితాలో 5వ స్థానంలో ఉన్నాడు. ఇప్పుడు ఏకంగా రాహుల్ ద్రవిడ్(13,288), జాక్వెస్ కల్లీస్(13,289), రికీ పాంటింగ్(13,378)లను వెనక్కినెట్టాడు. ఈ జాబితాలో సచిన్(15,921) అగ్రస్థానంలో ఉన్నాడు. సచిన్ కంటే రూట్ ఇంకా 2,512 రన్స్ వెనకబడి ఉన్నాడు. కొంతకాలంగా టెస్టుల్లో నిలకడగా రాణిస్తున్న రూట్.. సచిన్‌‌(Sachin Tendilkar)ను కూడా అధిగమించే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.

Related Posts

Kaleshwaram Project: కాళేశ్వరం ప్రాజెక్టుపై సీబీఐ విచారణ.. ప్రభుత్వం సంచలన నిర్ణయం

కాళేశ్వరం ప్రాజెక్టు(Kaleshwaram Project) నిర్మాణంలో అక్రమాలు జరిగాయని ఆరోపించిన కాంగ్రెస్ సర్కార్(Congress Govt).. అందుకోసం జస్టిస్ పీసీ ఘోష్(Justice PC Ghosh) కమిషన్‌ను ఏర్పాటు చేసిన విషయం తెలిసిందే. దీనిపై కమిషన్ దాదాపు 650 పేజీలతో కూడిన నివేదికను ప్రభుత్వానికి అందజేసింది.…

ఆదోని నుంచి సైకిల్‌పై వచ్చిన అభిమానికి మెగాస్టార్ ఇచ్చిన అద్భుతమైన గిఫ్ట్! వీడియో వైరల్..

మెగాస్టార్ చిరంజీవి(Chiranjeevi) పట్ల అభిమానులు చూపించే ప్రేమ మరోసారి బయటపడింది. ఆదోని(Adoni) నుంచి హైదరాబాద్(Hyderadad) వరకు సైకిల్‌పై ఒంటరిగా ప్రయాణించి వచ్చిన మహిళా అభిమాని రాజేశ్వరి(Rajeshwari) అందరినీ కదిలించింది. ఎన్ని కష్టాలు, అడ్డంకులు ఎదురైనా తన ఆరాధ్య నటుడిని చూడాలన్న తపన…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *