సూపర్ స్టార్ మహేష్ బాబు(Mahesh Babu), రాజమౌళి(SS, Rajamouli) కాంబినేషన్లో వస్తున్న భారీ ప్రాజెక్టు ఎస్ఎస్ఎంబీ 29(SSMB29)పై భారీ అంచనాలున్నాయి. పాన్-వరల్డ్ లెవెల్లో తెరకెక్కనున్న ఈ చిత్రానికి సంబంధించి వరుసగా అప్డేట్స్ వస్తున్నాయి. ఇప్పటికే గ్లోబల్ స్టార్ ప్రియాంక చోప్రా(Priyanka Chopra) ఈ సినిమాలో హీరోయిన్గా నటించనుందని సమాచారం. ప్రాజెక్టులో భాగంగా ప్రియాంక డ్యాన్స్ ట్రైనింగ్ కూడా తీసుకుంటుండటం ఇండస్ట్రీలో హాట్ టాపిక్గా మారింది.
ఈ సినిమాకి రాజమౌళి ప్రతి నటుడికి ప్రత్యేక డైట్ ప్లాన్ ఇచ్చారట. అంతగా శ్రమించి రూపొందిస్తున్న ఈ చిత్రం గురించి ఇప్పుడు మరో ఇంట్రస్టింగ్ బజ్ వైరల్ అవుతోంది. అదే సెకండ్ హీరోయిన్(Second Heroin) గురించి. తాజా సమాచారం ప్రకారం, ఈ భారీ బడ్జెట్ సినిమాలో శృతిహాసన్ను సెకండ్ లీడ్గా ఎంపిక చేసినట్లు ప్రచారం జరుగుతోంది.
రాజమౌళి పలు ఇంటర్వ్యూలలో శృతిహాసన్(Sruthi Hassan) డ్యాన్సింగ్ స్కిల్స్, ఎమోషనల్ ఎక్స్ప్రెషన్స్ గురించి ప్రశంసలు గుప్పించారు. ఆమె రొమాంటిక్ పాత్రలతో పాటు సీరియస్ పాత్రల్లోనూ చక్కగా నటిస్తారని అభిప్రాయపడ్డారు. గతంలో మహేష్ బాబు, శృతిహాసన్ కాంబినేషన్లో వచ్చిన “శ్రీమంతుడు” సినిమా భారీ విజయం సాధించింది. ఇప్పుడు అదే కాంబో మళ్లీ తెరపైకి రానుండడం అభిమానుల్లో ప్రత్యేక ఉత్సాహాన్ని నింపుతోంది.
రాజమౌళి సినిమాల్లో ప్రతి ఎంపిక వెనక వ్యూహమే ఉంటుంది. శృతిని ఈ సినిమాలో తీసుకోవడంలోనూ అదే డెప్త్ ఉందని భావిస్తున్నారు సినీ వర్గాలు. ఆమె పాత్ర ఎలా ఉండబోతుందో ఇంకా అధికారిక సమాచారం రాలేదు కానీ, ఈ కాంబినేషన్ సినిమాకి ఓ మేజిక్ లా పనిచేస్తుందని ఫ్యాన్స్ ఆశిస్తున్నారు.
View this post on Instagram






