కాల్పులతో దద్దరిల్లిన ఏటూరు నాగారం.. ఏడుగురు మావోయిస్టులు మృతి

ములుగు జిల్లాలోని ఏటూరు నాగారం మరోసారి తుపాకుల మోతతో దద్దరిల్లింది. చల్పాక అటవీ ప్రాంతంలో భద్రతా బలగాలు, మావోయిస్టుల మధ్య భారీ స్థాయిలో కాల్పులు చోటచేసుకున్నాయి. ఈ భారీ ఎన్​కౌంటర్​లో (encounter) ఏడుగురు మావోయిస్టులు మృతిచెందారు. ఈ ఘటనతో తెలంగాణలో (Telangana news) మావోయిస్టులకు మరో ఎదురుదెబ్బ తగిలింది.

తెలంగాణ గ్రేహౌండ్స్​, యాంటీ మావోయిస్ట్​ స్క్వాడ్​ సంయుక్తంగా ఈ ఆపరేషన్​ చేపట్టాయి. అయితే ఈ ఎన్​కౌంటర్​పై పోలీసులు ఇంకా అధికారికంగా ధ్రువీకరించలేదు.
ఈ ఎన్​కౌంటర్​లో మావోయిస్టు (Maoists) కీలక నేతలు చనిపోయినట్లు సమాచారం. నర్సంపేట ఏరియా కమిటీ కార్యదర్శి భద్రు అలియాస్​ పాపన్న చనిపోయినట్లు సమాచారం. అతడితోపాటు ఏగోలపు మల్లయ్య అలియాస్​ మధు, ముస్సకి దేవల్​ అలియాస్​ కరుణాకర్​, ముస్సకి జమున, జైసింగ్​, కిశోర్​, కామేశ్​ ఉన్నట్లు సమాచారం. ఘటనా స్థలంలో భారీగా ఆయుధాలను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఏకే-47 రైఫిల్స్‌తోపాటు మరికొన్ని పేలుడు పదార్థాలను సైతం స్వాధీనం చేసుకున్నారు.

మావోయిస్టులపై కొన్ని నెలలుగా కేంద్ర ప్రభుత్వం ఉక్కుపాదం మోపుతోంది. ఈ నెల 22న ఛత్తీస్గఢ్ లోని సుక్మా జిల్లాలో సైతం భారీ ఎన్‌కౌంటర్ చేపట్టారు. ఈ ఘటనలో 10 మంది మావోలను భద్రతా దళాలు మట్టుబెట్టారు.

Related Posts

Kaleshwaram Project: కాళేశ్వరం ప్రాజెక్టుపై సీబీఐ విచారణ.. ప్రభుత్వం సంచలన నిర్ణయం

కాళేశ్వరం ప్రాజెక్టు(Kaleshwaram Project) నిర్మాణంలో అక్రమాలు జరిగాయని ఆరోపించిన కాంగ్రెస్ సర్కార్(Congress Govt).. అందుకోసం జస్టిస్ పీసీ ఘోష్(Justice PC Ghosh) కమిషన్‌ను ఏర్పాటు చేసిన విషయం తెలిసిందే. దీనిపై కమిషన్ దాదాపు 650 పేజీలతో కూడిన నివేదికను ప్రభుత్వానికి అందజేసింది.…

ఆదోని నుంచి సైకిల్‌పై వచ్చిన అభిమానికి మెగాస్టార్ ఇచ్చిన అద్భుతమైన గిఫ్ట్! వీడియో వైరల్..

మెగాస్టార్ చిరంజీవి(Chiranjeevi) పట్ల అభిమానులు చూపించే ప్రేమ మరోసారి బయటపడింది. ఆదోని(Adoni) నుంచి హైదరాబాద్(Hyderadad) వరకు సైకిల్‌పై ఒంటరిగా ప్రయాణించి వచ్చిన మహిళా అభిమాని రాజేశ్వరి(Rajeshwari) అందరినీ కదిలించింది. ఎన్ని కష్టాలు, అడ్డంకులు ఎదురైనా తన ఆరాధ్య నటుడిని చూడాలన్న తపన…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *